తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన తన సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కడపలో ఎంపీ స్థానానికి.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోందన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఉప ఎన్నిక జరిగితే.. ఆ స్థానంలో తాము తమ పౌరుషాన్ని చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలను గెలిపించుకునేందుకు గల్లీ గల్లీలోనూ తిరుగుతామన్నారు.
కాంగ్రెస్ ఎక్కడైతే.. పోగొట్టుకుందో..అక్కడ నుంచి తిరిగి సంపాయించుకుంటామని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామన్నారు. ఏపీలో షర్మిల చేస్తున్న ప్రయత్నాలు పార్టీని బలోపేతం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కడపలో ఉప ఎన్నిక వస్తే.. షర్మిల గెలుపు పక్కా అని రేవంత్ అన్నారు. దీనికి గాను తామంతా కడపలో మకాం వేసి మరీ.. అక్కడి ప్రతి గల్లీలోనూ తిరిగి పార్టీని, షర్మిలను గెలిపించుకుని కడప పౌరుషాన్ని, కాంగ్రెస్ పౌరుషాన్ని కూడా ఢిల్లీ వరకు వినిపించేలా చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని.. ఆ పాత్రను షర్మిల నిర్విఘ్నంగా పోషిస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యలను ప్రస్తావించడంలోనూ.. ప్రశ్నించడంలోనూ కూడా షర్మిలకు షర్మిలే సాటి అని చెప్పుకొచ్చారు. షర్మిలకు తామంతా అండగా ఉంటామని.. రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేసే క్రమంలో ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ చెప్పారు. ఏపీలో ఉన్నది కేవలం అధికార పార్టీనేనని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కాగా.. కడపలో ఉప ఎన్నిక వ్యవహారంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోనూ పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఏపీపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేయలేక పోయారు. కానీ, ఈ సారి కనుక ఉప పోరు వస్తే.. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగమే వచ్చి ఇక్కడ కూర్చున్నా ఆశ్చర్యం లేదని.. వైసీపీకి మరింత డ్యామేజీ ఖాయమని తెలుస్తోంది.
This post was last modified on July 9, 2024 2:16 am
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…
గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…