తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన తన సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కడపలో ఎంపీ స్థానానికి.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోందన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఉప ఎన్నిక జరిగితే.. ఆ స్థానంలో తాము తమ పౌరుషాన్ని చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలను గెలిపించుకునేందుకు గల్లీ గల్లీలోనూ తిరుగుతామన్నారు.
కాంగ్రెస్ ఎక్కడైతే.. పోగొట్టుకుందో..అక్కడ నుంచి తిరిగి సంపాయించుకుంటామని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామన్నారు. ఏపీలో షర్మిల చేస్తున్న ప్రయత్నాలు పార్టీని బలోపేతం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కడపలో ఉప ఎన్నిక వస్తే.. షర్మిల గెలుపు పక్కా అని రేవంత్ అన్నారు. దీనికి గాను తామంతా కడపలో మకాం వేసి మరీ.. అక్కడి ప్రతి గల్లీలోనూ తిరిగి పార్టీని, షర్మిలను గెలిపించుకుని కడప పౌరుషాన్ని, కాంగ్రెస్ పౌరుషాన్ని కూడా ఢిల్లీ వరకు వినిపించేలా చేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని.. ఆ పాత్రను షర్మిల నిర్విఘ్నంగా పోషిస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యలను ప్రస్తావించడంలోనూ.. ప్రశ్నించడంలోనూ కూడా షర్మిలకు షర్మిలే సాటి అని చెప్పుకొచ్చారు. షర్మిలకు తామంతా అండగా ఉంటామని.. రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేసే క్రమంలో ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ చెప్పారు. ఏపీలో ఉన్నది కేవలం అధికార పార్టీనేనని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కాగా.. కడపలో ఉప ఎన్నిక వ్యవహారంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోనూ పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో ఏపీపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేయలేక పోయారు. కానీ, ఈ సారి కనుక ఉప పోరు వస్తే.. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగమే వచ్చి ఇక్కడ కూర్చున్నా ఆశ్చర్యం లేదని.. వైసీపీకి మరింత డ్యామేజీ ఖాయమని తెలుస్తోంది.
This post was last modified on July 9, 2024 2:16 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…