ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్ట పరిధిలోనే అక్రమార్కుల పని పట్టే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాకినాడలో అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం గట్టిగానే ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వైసీపీ అక్రమాలను బయటికి తీసే పని మీద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఐతే జగన్ హయాంలో మరుగున పడిపోయిన ఓ సంచలన వ్యవహారం గుట్టు బయటికి తీయాలని జనం కోరుకుంటున్నారు. అదే.. విశాఖపట్నంలో మార్చిలో పట్టుబడ్డ భారీ డ్రగ్ కంటైనర్ వ్యవహారం. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం సంచలనం రేపింది. జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరిగింది. కానీ తర్వాత అది మరుగున పడిపోయింది.
ఒక భారీ కంటైనర్లో టన్నుల కొద్దీ డ్రగ్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒక నిపుణుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ అంతటిని సరఫరా చేస్తే దేశంలో సగం మందిని మత్తులో ముంచేయొచ్చని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఒక రాష్ట్రంలో అడుగు పెట్టడం అసాధ్యమని కూడా చెప్పారు. ఐతే వైసీపీ ప్రభుత్వం మాత్రం అది టీడీపీ వాళ్లదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
నిజంగా టీడీపీ వాళ్లు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే.. ఆ పార్టీని ఇరికించకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వదిలి పెట్టేదా.. దాన్ని ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండేదా అన్నది ప్రశ్న. అప్పటి ప్రభుత్వ పెద్దల హ్యాండ్ కచ్చితంగా ఇందులో ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఐతే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టేశారు.
విశాఖలో డ్రగ్స్ కంటైనర్ను పట్టుకుంది సీబీఐ వాళ్లు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉంది. అంతే కాక కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది. ఈ డ్రగ్ రాకెట్ గుట్టంతా బయటికి తీయడం కష్టమేమీ కాదు. ఇందులో వైసీపీ నేతల భాగస్వామ్యాన్ని బయటపెట్టగలిగితే ఆ పార్టీకి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on July 6, 2024 4:51 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…