Political News

ఏపీలో సంచలన వ్యవహారం గుట్టు తేలుతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్ట పరిధిలోనే అక్రమార్కుల పని పట్టే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాకినాడలో అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం గట్టిగానే ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వైసీపీ అక్రమాలను బయటికి తీసే పని మీద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఐతే జగన్ హయాంలో మరుగున పడిపోయిన ఓ సంచలన వ్యవహారం గుట్టు బయటికి తీయాలని జనం కోరుకుంటున్నారు. అదే.. విశాఖపట్నంలో మార్చిలో పట్టుబడ్డ భారీ డ్రగ్ కంటైనర్ వ్యవహారం. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం సంచలనం రేపింది. జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరిగింది. కానీ తర్వాత అది మరుగున పడిపోయింది.

ఒక భారీ కంటైనర్లో టన్నుల కొద్దీ డ్రగ్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒక నిపుణుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ అంతటిని సరఫరా చేస్తే దేశంలో సగం మందిని మత్తులో ముంచేయొచ్చని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఒక రాష్ట్రంలో అడుగు పెట్టడం అసాధ్యమని కూడా చెప్పారు. ఐతే వైసీపీ ప్రభుత్వం మాత్రం అది టీడీపీ వాళ్లదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.

నిజంగా టీడీపీ వాళ్లు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే.. ఆ పార్టీని ఇరికించకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వదిలి పెట్టేదా.. దాన్ని ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండేదా అన్నది ప్రశ్న. అప్పటి ప్రభుత్వ పెద్దల హ్యాండ్ కచ్చితంగా ఇందులో ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఐతే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టేశారు.

విశాఖలో డ్రగ్స్ కంటైనర్‌ను పట్టుకుంది సీబీఐ వాళ్లు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉంది. అంతే కాక కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది. ఈ డ్రగ్ రాకెట్ గుట్టంతా బయటికి తీయడం కష్టమేమీ కాదు. ఇందులో వైసీపీ నేతల భాగస్వామ్యాన్ని బయటపెట్టగలిగితే ఆ పార్టీకి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on July 6, 2024 4:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: Vizag

Recent Posts

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…

54 minutes ago

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…

4 hours ago

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

5 hours ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

5 hours ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

12 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

14 hours ago