ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్ట పరిధిలోనే అక్రమార్కుల పని పట్టే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. కాకినాడలో అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం గట్టిగానే ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వైసీపీ అక్రమాలను బయటికి తీసే పని మీద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఐతే జగన్ హయాంలో మరుగున పడిపోయిన ఓ సంచలన వ్యవహారం గుట్టు బయటికి తీయాలని జనం కోరుకుంటున్నారు. అదే.. విశాఖపట్నంలో మార్చిలో పట్టుబడ్డ భారీ డ్రగ్ కంటైనర్ వ్యవహారం. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం సంచలనం రేపింది. జాతీయ స్థాయిలో దీని గురించి చర్చ జరిగింది. కానీ తర్వాత అది మరుగున పడిపోయింది.
ఒక భారీ కంటైనర్లో టన్నుల కొద్దీ డ్రగ్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఒక నిపుణుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ డ్రగ్స్ అంతటిని సరఫరా చేస్తే దేశంలో సగం మందిని మత్తులో ముంచేయొచ్చని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వం సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఒక రాష్ట్రంలో అడుగు పెట్టడం అసాధ్యమని కూడా చెప్పారు. ఐతే వైసీపీ ప్రభుత్వం మాత్రం అది టీడీపీ వాళ్లదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
నిజంగా టీడీపీ వాళ్లు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే.. ఆ పార్టీని ఇరికించకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం వదిలి పెట్టేదా.. దాన్ని ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండేదా అన్నది ప్రశ్న. అప్పటి ప్రభుత్వ పెద్దల హ్యాండ్ కచ్చితంగా ఇందులో ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఐతే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టేశారు.
విశాఖలో డ్రగ్స్ కంటైనర్ను పట్టుకుంది సీబీఐ వాళ్లు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉంది. అంతే కాక కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామిగా ఉంది. ఈ డ్రగ్ రాకెట్ గుట్టంతా బయటికి తీయడం కష్టమేమీ కాదు. ఇందులో వైసీపీ నేతల భాగస్వామ్యాన్ని బయటపెట్టగలిగితే ఆ పార్టీకి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on July 6, 2024 4:51 pm
ఇటీవలే ‘కల్కి’ సినిమాలో కాసేపు ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తే.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మహాభారతంలో ఎన్నో…
తిరుమల లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ హిందువులు ఆచరించే సనాతన ధర్మం గురించి చాలా బలంగా గళాన్ని వినిపిస్తున్న…
తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు…
1989 సంవత్సరం. అక్టోబర్ 5వ తేదీ. బ్రేక్ డాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు ఆర్భాటాలు, అవుట్ డోర్ లొకేషన్ల…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ…
వైసీపీ అధినేత జగన్.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా…