వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఇప్పుడు టైం ఒక పరీక్షగా మారింది. ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చినా.. ప్రజలను ఎలా మచ్చిక చేసుకున్నా.. వారికి ఎలాంటి పథకాలపై హామీ ఇచ్చినా.. కూటమి అధికారంలోకి వచ్చింది. దీనిని ఎవరూ తప్పుపట్టలేరు. 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు పంచిన ముఖ్యమంత్రిగా.. ప్రజల క్షేమం కోసం.. కష్టపడిన నాయకుడిగా.. వ్యక్తిగతంగా జగన్కు అధికారం కోల్పోయామన్న బాధ ఉంటే ఉండొచ్చు.
కానీ, ప్రజా తీర్పును మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా తీర్పును శిరసావహించాలి. అంతేకాదు.. వెయిటింగ్ కూడా చేయాలి. ఇప్పుడే ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తోందో .. పరిశీలించుకోవాలి. ఆ తర్వాతే.. మాట్లాడాలి. అయితే.. దీనికి కూడా కొంత సమయం ఉంది. పట్టుమని నెల రోజులు కూడా కాకుండానే.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేయడం ద్వారా.. జగన్ మరింత డ్యామేజీ అవుతారనడంలో సందేహం లేదు.
తాజాగా ఆయన నెల్లూరు జైల్లో ఉన్న పినెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం.. చేసిన వ్యాఖ్య లు సబబుగాలేవు. చంద్రబాబు సర్కారును పథకాల విషయంలో నిలదీయడంవరకు బాగానే ఉంది. కానీ, అంతకు మించి చేసిన వ్యాఖ్యలు జగన్ స్థాయికి సరిపోయేలా కనిపించడం లేదు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. పుంజుకునేలా చేయాలి. ఆ తర్వాత.. విమర్శలు చేసినా.. అవి ప్రజల్లోకి వెళ్తాయి. అలా కాకుండా.. ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదు.
మరీ ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు చంద్రబాబు సర్కారుపై జోష్లో ఉన్నారు. పింఛన్ల పంపిణీతో ఆయన క్రెడిట్ సంపాయించుకున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబును విమర్శించినా.. జగన్కు రివర్స్ అవుతుంది. అలా కాకుండా.. కొంత సమయం వేచి ఉండి.. మూడు నాలుగు మాసాల తర్వాత.. ఆయనను ప్రభుత్వాన్ని విపక్షంగా టార్గెట్ చేస్తే.. మంచిదని.. అప్పుడు జగన్కు సానుభూతి వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 6, 2024 1:02 pm
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…