Political News

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా లడ్హా నియామకం

ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబద్ధత గలిగిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఏపీకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమర్థులైన అధికారుల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ అధికారి మహేశ్‌ చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్హాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న లడ్హాను ఏపీకి కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు రిక్వెస్ట్ చేయడంతో లడ్హాను ఇక్కడకు పంపారు.

1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి లడ్హా గతంలో ఏపీలో పలు జిల్లాల్లో పలు హోదాల్లో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించారు. రౌడీలు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ట్రాక్ రికార్డు లడ్హాకు ఉంది. గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన లడ్హా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ ఈస్ట్‌ జోన్ డీసీపీగా, ఎన్ఐఏలో ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు.

విజయవాడ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగా లడ్హా పని చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌ పై వెళ్లారు. సీఆర్పీఎఫ్‌లో ఐజీగా పనిచేస్తున్న లడ్హా ఏపీకి తిరిగొచ్చారు.

గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా లడ్హా పని చేస్తున్న సమయంలో లడ్హాపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని క్లెమోర్‌మైన్స్‌ పెట్టి పేల్చేశారు. కానీ, ఆ వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో లడ్హాతో పాటు ఆ వాహనంలో ఉన్న ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

This post was last modified on July 3, 2024 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

42 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago