సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లతో 2019లో ఎవరూ ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్.. 2024కు వచ్చే సరికి కేవలం 11 స్థానాలకు సరిపుచ్చుకుని.. ఇప్పుడు కూడా.. ఎవరూ ఊహించని విధంగా నేల మట్టమయ్యారు. దీనికి కారణం ఎవరు? ఎలా ? అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద దీనిని తోసేయాలన్నా.. కుదరడం లేదు. మొదట్లో ఐఏఎస్ ధనుంజయరెడ్డి కారణమని చెప్పినా.. దానిలో పసలేకుండా పోయింది.
తర్వాత వలంటీర్లపై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఇక, కొన్ని చట్టాలు కారణమంటూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బూచిగా చూపించారు. కానీ, వీటిని మించిన తప్పులు జరిగా యన్నది అందరికీ తెలుసు. కానీ, ఎవరూ నోరు విప్పేందుకు సాహసించలేదు. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ నాయకులు నోరు విప్పుతున్నారు. తప్పులపై సమీక్షలు చేసుకుంటున్నారు. కీలక తప్పులు.. రాంగు స్టెప్పులపై ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో అత్యంత కీలకమైన కారణం జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను కెలకడమేనని చెప్పుకొచ్చారు. ఇది.. యువత ఓటు బ్యాంకును తమకు దూరం చేసిందన్నారు. ఇదేసమయంలో సినీ రంగాన్ని కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తాప పడ్డారు. అయితే.. ఇప్పుడు చేతులు కాలిపోయాయి. మరి ఇక ముందైనా.. జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాలి.
ఎలా కెలికారంటే..
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…