సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లతో 2019లో ఎవరూ ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్.. 2024కు వచ్చే సరికి కేవలం 11 స్థానాలకు సరిపుచ్చుకుని.. ఇప్పుడు కూడా.. ఎవరూ ఊహించని విధంగా నేల మట్టమయ్యారు. దీనికి కారణం ఎవరు? ఎలా ? అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద దీనిని తోసేయాలన్నా.. కుదరడం లేదు. మొదట్లో ఐఏఎస్ ధనుంజయరెడ్డి కారణమని చెప్పినా.. దానిలో పసలేకుండా పోయింది.
తర్వాత వలంటీర్లపై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఇక, కొన్ని చట్టాలు కారణమంటూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బూచిగా చూపించారు. కానీ, వీటిని మించిన తప్పులు జరిగా యన్నది అందరికీ తెలుసు. కానీ, ఎవరూ నోరు విప్పేందుకు సాహసించలేదు. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ నాయకులు నోరు విప్పుతున్నారు. తప్పులపై సమీక్షలు చేసుకుంటున్నారు. కీలక తప్పులు.. రాంగు స్టెప్పులపై ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో అత్యంత కీలకమైన కారణం జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను కెలకడమేనని చెప్పుకొచ్చారు. ఇది.. యువత ఓటు బ్యాంకును తమకు దూరం చేసిందన్నారు. ఇదేసమయంలో సినీ రంగాన్ని కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తాప పడ్డారు. అయితే.. ఇప్పుడు చేతులు కాలిపోయాయి. మరి ఇక ముందైనా.. జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాలి.
ఎలా కెలికారంటే..
This post was last modified on July 2, 2024 3:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…