సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లతో 2019లో ఎవరూ ఊహించని ఘన విజయం సొంతం చేసుకున్న జగన్.. 2024కు వచ్చే సరికి కేవలం 11 స్థానాలకు సరిపుచ్చుకుని.. ఇప్పుడు కూడా.. ఎవరూ ఊహించని విధంగా నేల మట్టమయ్యారు. దీనికి కారణం ఎవరు? ఎలా ? అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద దీనిని తోసేయాలన్నా.. కుదరడం లేదు. మొదట్లో ఐఏఎస్ ధనుంజయరెడ్డి కారణమని చెప్పినా.. దానిలో పసలేకుండా పోయింది.
తర్వాత వలంటీర్లపై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఇక, కొన్ని చట్టాలు కారణమంటూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బూచిగా చూపించారు. కానీ, వీటిని మించిన తప్పులు జరిగా యన్నది అందరికీ తెలుసు. కానీ, ఎవరూ నోరు విప్పేందుకు సాహసించలేదు. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ నాయకులు నోరు విప్పుతున్నారు. తప్పులపై సమీక్షలు చేసుకుంటున్నారు. కీలక తప్పులు.. రాంగు స్టెప్పులపై ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో అత్యంత కీలకమైన కారణం జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను కెలకడమేనని చెప్పుకొచ్చారు. ఇది.. యువత ఓటు బ్యాంకును తమకు దూరం చేసిందన్నారు. ఇదేసమయంలో సినీ రంగాన్ని కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన పశ్చాత్తాప పడ్డారు. అయితే.. ఇప్పుడు చేతులు కాలిపోయాయి. మరి ఇక ముందైనా.. జాగ్రత్తగా వ్యవహరిస్తారేమో చూడాలి.
ఎలా కెలికారంటే..
This post was last modified on July 2, 2024 3:11 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…