Political News

ఏకంగా చంద్రబాబు స్థలానికి లంచం తీసుకున్నాడు !

అది వైసీపీ ప్రభుత్వ కాలం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. అది స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్య‌వ‌సాయ భూమి.

ఆ స్థ‌లంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేత‌లు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేశారు. ఆ స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సెన్‌ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాల‌ని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం ఇచ్చి పనిచేయించుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. గత నెల 25, 26 తేదీల్లో కుప్పం పర్యటనకు వచ్చారు. ఈ సంధర్బంగా ఆయన బస చేసిన ఆర్ అండ్‌ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది.

దానిని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు చెవిన వేశారు. సర్వే శాఖ ఏడీ గౌస్‌ భాషాతో శాఖాపరమైన విచారణ చేయించ‌డంతో లంచం తీసుకున్న విషయం నిజమే అని తేలింది. దీంతో పాటు మరో రైతు నుండి భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్‌ చేసినట్లు వారి దృష్టికి వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సద్దాంహుస్సేన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

This post was last modified on July 2, 2024 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

43 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago