అది వైసీపీ ప్రభుత్వ కాలం. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. అది స్థలం జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి.
ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు వ్యవసాయ భూమిని భూ వినియోగ మార్పిడి కోసం దరఖాస్తు చేశారు. ఆ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరాగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సెన్ రూ. 1.80 లక్షల లంచం ఇవ్వాలని కోరారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం ఇచ్చి పనిచేయించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. గత నెల 25, 26 తేదీల్లో కుప్పం పర్యటనకు వచ్చారు. ఈ సంధర్బంగా ఆయన బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది.
దానిని కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చెవిన వేశారు. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషాతో శాఖాపరమైన విచారణ చేయించడంతో లంచం తీసుకున్న విషయం నిజమే అని తేలింది. దీంతో పాటు మరో రైతు నుండి భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్ చేసినట్లు వారి దృష్టికి వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సద్దాంహుస్సేన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
This post was last modified on July 2, 2024 11:34 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…