Political News

షాతో జగన్ భేటీ… ఏపీలో సీబీఐ దూకుడు పెరుగుతుందా?

నవ్యాంధ్ర వ్యవహారాలకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం హోదాలో ఢిల్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీని ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లే లక్ష్యంగా చేసుకుని విచారణకు రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాటి భేటీలో అమిత్ షాతో జగన్ ఈ విషయాలపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటి అంశాపైనా జగన్, షాల మధ్య చర్చలు జరిగినా… ప్రధానంగా అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన అంశాలే ప్రధానంగా చర్చలు జరిగినట్టుగా సమాచారం. అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబు అండ్ కో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో నారా లోకేశ్ మంత్రిగా ఉండగా ఫైబర్ నెట్ వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని కూడా జగన్ అండ్ కో వాదిస్తోంది. ఈ రెండు అంశాలపై సీబీఐ చేత విచారణ చేయించి చంద్రబాబుతో పాటు లోకేశ్ ను కూడా ఇరుకునపెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతీ తెలిసిందే.

ఈ క్రమంలో గతంలో మాదిరిగా కాకుండా ఢిల్లీ వచ్చిన వెంటనే తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం, తన ఢిల్లీ పర్యటనలో జగన్ తొలుత షాతోనే భేటీ కావడం వైసీపీకి ఒకింత సానుకూల అంశమేనని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో తన ప్రత్యర్థులపై సీబీఐని రంగంలోకి దించే దిశగా కేంద్రాన్ని ఒప్పించడమే లక్ష్యంగా జగన్ వ్యూహం రచించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే షాతో భేటీలో జగన్ ఈ అంశాలనే ప్రదానంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సజావుగా అమలయ్యే దిశగానూ సహకరించే విషయంలోనే షా మద్దతును జగన్ కోరినట్టుగా కూడా సమాచారం. మొత్తంగా జగన్ చేసిన ప్రతిపాదనలకు షా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ… షా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలు ఏపీ రాజకీయాలను తీవ్రంగానే ప్రభావితం చేయనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on September 22, 2020 9:08 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

34 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

51 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago