బ్రిటన్లో రాజకీయ దుమారం రేగింది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రగులుకున్నాయి. ప్రధాన మంత్రి రుషి సునాక్ను ఉద్దేశించి.. ప్రతిపక్ష రిఫార్మ్ పార్టీ(ఆర్పీ) నాయకుడు ఒకరు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్లో సునాక్ హయాంలో తీసుకువచ్చిన.. మైగ్రేషన్ పాలసీ(వలస విధానం)పై స్పందిస్తూ.. ఇవి పాకీ నిర్ణయాలు. ఆయన ఓ పాకీ అంటూ.. సదరు నేత విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.
సహజంగా పాకీ అనే పదాన్ని బ్రిటన్లో తీవ్రంగా భావిస్తారు. ఇవి జాత్యాహంకారానికి ప్రతీకలుగా భావిస్తున్నారు. ఇప్పుడు రిఫార్మ్ నాయకుడు చేసిన వ్యాఖ్యలను కూడా.. ప్రధాని సునాక్ అలానే భావిస్తున్నారు.
ఈ విషయంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘ఈ వ్యాఖ్యలు నా మనసును గాయ పరిచాయి“ అని అన్నారు. రిఫార్మ్ పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు కూడా.. హద్దులు మీరుతున్నారని సునాక్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రిఫార్మ్ పార్టీ సంస్కృతి, సంప్రదాయాలు లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోందని సునాక్ మండిపడ్డారు. ఇక, అధికార పార్టీ నేతలు కూడా.. సునాక్కు అండగా నిలిచారు. సదరు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక, రిఫార్మ్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ చీఫ్ నైజెల్ ఫరాజ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించని నైజెల్ తెలిపారు. ఇవి సదరు నేత.. వ్యక్తిగత వ్యాఖ్యలని.. పార్టీకి సంబంధం లేదని నైజెల్ పేర్కొన్నారు. గతంలోనూ తమ పార్టీలో కొందరు ఇలా వ్యాఖ్యానించినప్పుడు కఠిన చర్యలు తీసుకున్నామని.. ఇప్పుడు కూడా.. అదే పని చేస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ,.. అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల మంటలు రగులుతూనే ఉన్నాయి.
This post was last modified on June 30, 2024 10:06 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…