Political News

దేశంలో న్యాయం మారుతోంది!

దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ మారుతోంది. జూలై 1(సోమ‌వారం) నుంచి దేశ‌వ్యాప్తంగా నూత‌న నేర న్యాయ చట్టాలు అమ‌ల్లోకి రానున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నూత‌న నేర న్యాయ చ‌ట్టాల మేర‌కు.. తీర్పులు, కేసుల న‌మోదు, ఫిర్యాదుల న‌మోదు వంటివి అందుబాటులోకి వ‌స్తున్నాయి.

2023లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. మూడు నూత‌న నేర న్యాయ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. వీటికి డెడ్ లైన్ జూన్ 30.. ఆదివారంతో ముగిసింది.

అనంత‌రం.. జూలై 1 నుంచి వీటిని అమ‌లు చేసే ప్ర‌క్రియ ప్రారంభ‌వుతుంది. ఇప్ప‌టికే అన్ని రాస్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు వీటిన అమ‌లు చేసేందుకు నోటిఫికేష‌న్లు ఇచ్చాయి. ముఖ్యంగా ఎన్డీయే కూట‌మి పార్టీలు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్ప‌టికే నోటిఫికేష‌న్లు ఇవ్వ‌గా.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం ఇంకా వేచి చూస్తున్నాయి. కానీ, దేశ‌వ్యాప్తంగా వీటిని అమ‌లు చేయాల్సిందేన‌ని మోడీ స‌ర్కారు తాఖీదులు ఇస్తోంది. మ‌రోవైపు సుప్రీంకోర్టు కూడా.. అన్ని హైకోర్టుల‌కు ఇప్ప‌టికే ఈ నూత‌న చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఏమిటీ చ‌ట్టాలు…?

ఇప్ప‌టి వ‌ర‌కు 1850-1902 మ‌ధ్య అప్ప‌టి బ్రిటీష్ పాల‌కులు తీసుకువ‌చ్చిన ఐపీసీ(ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌), సీఆర్ పీసీ(క్రిమిల‌న్ ప్రొసీజ‌రీ కోడ్‌) చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తున్నారు. వీటి ప్ర‌కార‌మే కేసులు న‌మోదు చేస్తున్నారు. వీటి ప్ర‌కార‌మే కోర్టులు కూడా.. చ‌ట్టాల‌కు లోబ‌డి తీర్పులు ఇస్తున్నాయి. అయితే.. 2019లో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన న‌రేంద్ర మోడీ.. పాత చ‌ట్టాల‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఐపీసీ, సీఆర్ పీసీల‌ను ప‌క్క‌న పెట్టారు.

వీటి స్థానంలో భార‌తీయ న్యాయ‌ సంహిత‌, భార‌తీయ సాక్ష్య అధినియం, భార‌తీయ నాగ‌రిక సుర‌క్ష సంహిత‌ల‌ను మోడీ స‌ర్కారు 2023లో పార్ల‌మెంటులో ఆమోదించింది. వీటిని జూలై 2024 నుంచి అమ‌లు చేయాల‌ని అప్ప‌ట్లోనే పేర్కొన్నారు. ఇక‌, ఇప్పుడు వీటి ప్ర‌కార‌మే కేసుల న‌మోదు.. తీర్పులు కూడా వెలువ‌రించ‌నున్నారు. వీటి వ‌ల్ల న్యాయం త్వ‌రిత‌గ‌తిన ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతుంద‌ని ప్ర‌ధాని చెబుతున్నారు.

This post was last modified on June 30, 2024 6:26 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago