తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రధాన నగరాలను అభివృద్ది చేసేందుకు మాస్టర్ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటించిన రేవంత్రెడ్డి.. వరంగల్ నగరాన్ని.. హైదరాబాద్ నగరంతో సమానంగా అభివృద్ది చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. తద్వారా.. పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొనడం గమనార్హం.
అంతేకాదు.. గతంలో బీఆర్ ఎస్ హయాంలో రూపొందించిన వరంగల్ మాస్టర్ప్లాన్ను సమూలంగా మార్పు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ – 2050ని రూపొందించాలన్నారు. మరీ ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ పథకాలను వేగంగా అమలు చేయడంపైనా దృష్టి పెట్టారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వేగంగా ముందుకు సాగాలన్నారు. తద్వారా హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. సాంస్కృతిక నగరంగా వరంగల్ ను అభివృద్ది చేయడం ద్వారా.. పర్యాటక, హోటల్ రంగాలకు నగరం ఆతిధ్యం ఇస్తుందని పేర్కొన్నారు.
ఎందుకు?
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వరంగల్పై ఫోకస్ చేయడం వెనుక.. ఏముందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. వరంగల్ జిల్లా బీఆర్ ఎస్కు గట్టిపట్టుగా మారిన విషయం తెలిసిందే. అదేసమయంలో బీజేపీ కూడా ఇక్కడ పుంజుకుంటోంది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా చైతన్యవంతమైన ఈ జిల్లాను కాంగ్రెస్కు కంచుకోటగా మార్చుకునేందుకు రేవంత్ ఇలా.. అభివృద్ది వ్యూహంతో ముందుకు సాగుతున్నారనే చర్చ సాగుతోంది. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వరంగల్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తాని రేవంత్ మాస్టర్ ప్లాన్ – 2050 ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on June 30, 2024 7:20 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…