తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రధాన నగరాలను అభివృద్ది చేసేందుకు మాస్టర్ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటించిన రేవంత్రెడ్డి.. వరంగల్ నగరాన్ని.. హైదరాబాద్ నగరంతో సమానంగా అభివృద్ది చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. తద్వారా.. పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొనడం గమనార్హం.
అంతేకాదు.. గతంలో బీఆర్ ఎస్ హయాంలో రూపొందించిన వరంగల్ మాస్టర్ప్లాన్ను సమూలంగా మార్పు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ – 2050ని రూపొందించాలన్నారు. మరీ ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ పథకాలను వేగంగా అమలు చేయడంపైనా దృష్టి పెట్టారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వేగంగా ముందుకు సాగాలన్నారు. తద్వారా హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. సాంస్కృతిక నగరంగా వరంగల్ ను అభివృద్ది చేయడం ద్వారా.. పర్యాటక, హోటల్ రంగాలకు నగరం ఆతిధ్యం ఇస్తుందని పేర్కొన్నారు.
ఎందుకు?
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వరంగల్పై ఫోకస్ చేయడం వెనుక.. ఏముందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. వరంగల్ జిల్లా బీఆర్ ఎస్కు గట్టిపట్టుగా మారిన విషయం తెలిసిందే. అదేసమయంలో బీజేపీ కూడా ఇక్కడ పుంజుకుంటోంది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా చైతన్యవంతమైన ఈ జిల్లాను కాంగ్రెస్కు కంచుకోటగా మార్చుకునేందుకు రేవంత్ ఇలా.. అభివృద్ది వ్యూహంతో ముందుకు సాగుతున్నారనే చర్చ సాగుతోంది. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వరంగల్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తాని రేవంత్ మాస్టర్ ప్లాన్ – 2050 ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on June 30, 2024 7:20 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…