తెలుగు కమెడియన్ స్టార్.. అలీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఆయన వైసీపీతో ఉన్న విషయం తెలిసిందే. గత రెండేళ్ల కిందట ఆయనకు అప్పటి సీఎం జగన్.. సలహాదారు పదవిని కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కానీ, రాజ్యసభ సీటునుకానీ అలీ ఆశించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ ఆయనకు దక్కలేదు. ఇదిలావుంటే.. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అలీ తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తాను ఇక నుంచి రాజకీయాల్లో ఉండబోనన్నారు. ఏ పార్టీకీ మద్దతుగా కానీ, మాట మాత్రంగా కానీ.. పనిచేసేది లేదన్నారు.
ఇక, నుంచి కేవలం సినీ నటుడిగా.. సాధారణ పౌరుడిగా మాత్రమే జీవిస్తానని అలీ వెల్లడించారు. గతంలో తాను దివంగత నిర్మాత రామానాయుడు ప్రోత్సాహంతో సినీరంగంలో కుదురుకున్నట్టు తెలిపారు. ఆయన వల్లే ఇంత వాడిని అయినట్టు చెప్పారు. ఇక, ఆయన రాజకీయాల్లో ఉన్న సమయంలో పరుచూరు నుంచి పోటీ చేసినప్పుడు.. తాను ప్రచారం చేశానని అలీ చెప్పారు. తర్వాత.. కొన్నాళ్లు టీడీపీలోనే ఉన్నట్టు చెప్పారు. తర్వాత.. వైసీపీలోకి వచ్చానన్నారు. రాజకీయాలు చేయడానికి కాకుండా.. రాజకీయంగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చినట్టు వివరణ ఇచ్చుకున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం తాను రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అలీ తెలిపారు. సినీ పరిశ్రమ తనకు చాలా మంచి జీవితం ఇచ్చిందని, ఇక నుంచి సినీ రంగంలోనే ఉంటానని చెప్పారు. “మా నాన్నగారిపేరుపై ఓ ట్రస్టును 16 ఏళ్లుగా నడుపుతున్నా. కరోనా సమయంలో కూడా నేను సాయం ఆపలేదు. ఎంతో మందిని చదివిస్తున్నా. నా సంపాదనలో 20 శాతం సొమ్మును ట్రస్ట్ కు ఇస్తున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. వృత్తి పరంగా, రాజకీయాల్లో కూడా ఫలానా వ్యక్తిని లేదా రాజకీయ నాయకుడ్ని తప్పుడు మాట అనలేదు” అని అలీ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇకపై తనకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణ పౌరుడిగా.. సాధారణ ఓటరుగా మాత్రమే తన జీవితం ఇకనుంచి కొనసాగుతుందన్నారు.
This post was last modified on June 28, 2024 8:47 pm
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. విభజన సమస్యలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పొరుగున ఉన్న తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను…
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడి రెండో భాగం గురించి అప్పుడే ఎదురు చూపులు మొదలైపోయాయి. తాజాగా…
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత..…
టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నాయకుడే. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు…
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా టీ20 ప్రపంచ కప్ సాధించింది. 2024 టీ20 ప్రపంచ కప్…