తెలుగు కమెడియన్ స్టార్.. అలీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఆయన వైసీపీతో ఉన్న విషయం తెలిసిందే. గత రెండేళ్ల కిందట ఆయనకు అప్పటి సీఎం జగన్.. సలహాదారు పదవిని కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కానీ, రాజ్యసభ సీటునుకానీ అలీ ఆశించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ ఆయనకు దక్కలేదు. ఇదిలావుంటే.. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అలీ తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తాను ఇక నుంచి రాజకీయాల్లో ఉండబోనన్నారు. ఏ పార్టీకీ మద్దతుగా కానీ, మాట మాత్రంగా కానీ.. పనిచేసేది లేదన్నారు.
ఇక, నుంచి కేవలం సినీ నటుడిగా.. సాధారణ పౌరుడిగా మాత్రమే జీవిస్తానని అలీ వెల్లడించారు. గతంలో తాను దివంగత నిర్మాత రామానాయుడు ప్రోత్సాహంతో సినీరంగంలో కుదురుకున్నట్టు తెలిపారు. ఆయన వల్లే ఇంత వాడిని అయినట్టు చెప్పారు. ఇక, ఆయన రాజకీయాల్లో ఉన్న సమయంలో పరుచూరు నుంచి పోటీ చేసినప్పుడు.. తాను ప్రచారం చేశానని అలీ చెప్పారు. తర్వాత.. కొన్నాళ్లు టీడీపీలోనే ఉన్నట్టు చెప్పారు. తర్వాత.. వైసీపీలోకి వచ్చానన్నారు. రాజకీయాలు చేయడానికి కాకుండా.. రాజకీయంగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చినట్టు వివరణ ఇచ్చుకున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం తాను రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అలీ తెలిపారు. సినీ పరిశ్రమ తనకు చాలా మంచి జీవితం ఇచ్చిందని, ఇక నుంచి సినీ రంగంలోనే ఉంటానని చెప్పారు. “మా నాన్నగారిపేరుపై ఓ ట్రస్టును 16 ఏళ్లుగా నడుపుతున్నా. కరోనా సమయంలో కూడా నేను సాయం ఆపలేదు. ఎంతో మందిని చదివిస్తున్నా. నా సంపాదనలో 20 శాతం సొమ్మును ట్రస్ట్ కు ఇస్తున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. వృత్తి పరంగా, రాజకీయాల్లో కూడా ఫలానా వ్యక్తిని లేదా రాజకీయ నాయకుడ్ని తప్పుడు మాట అనలేదు” అని అలీ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇకపై తనకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణ పౌరుడిగా.. సాధారణ ఓటరుగా మాత్రమే తన జీవితం ఇకనుంచి కొనసాగుతుందన్నారు.
This post was last modified on June 28, 2024 8:47 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…