తెలుగు కమెడియన్ స్టార్.. అలీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఆయన వైసీపీతో ఉన్న విషయం తెలిసిందే. గత రెండేళ్ల కిందట ఆయనకు అప్పటి సీఎం జగన్.. సలహాదారు పదవిని కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కానీ, రాజ్యసభ సీటునుకానీ అలీ ఆశించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ ఆయనకు దక్కలేదు. ఇదిలావుంటే.. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అలీ తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తాను ఇక నుంచి రాజకీయాల్లో ఉండబోనన్నారు. ఏ పార్టీకీ మద్దతుగా కానీ, మాట మాత్రంగా కానీ.. పనిచేసేది లేదన్నారు.
ఇక, నుంచి కేవలం సినీ నటుడిగా.. సాధారణ పౌరుడిగా మాత్రమే జీవిస్తానని అలీ వెల్లడించారు. గతంలో తాను దివంగత నిర్మాత రామానాయుడు ప్రోత్సాహంతో సినీరంగంలో కుదురుకున్నట్టు తెలిపారు. ఆయన వల్లే ఇంత వాడిని అయినట్టు చెప్పారు. ఇక, ఆయన రాజకీయాల్లో ఉన్న సమయంలో పరుచూరు నుంచి పోటీ చేసినప్పుడు.. తాను ప్రచారం చేశానని అలీ చెప్పారు. తర్వాత.. కొన్నాళ్లు టీడీపీలోనే ఉన్నట్టు చెప్పారు. తర్వాత.. వైసీపీలోకి వచ్చానన్నారు. రాజకీయాలు చేయడానికి కాకుండా.. రాజకీయంగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చినట్టు వివరణ ఇచ్చుకున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం తాను రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అలీ తెలిపారు. సినీ పరిశ్రమ తనకు చాలా మంచి జీవితం ఇచ్చిందని, ఇక నుంచి సినీ రంగంలోనే ఉంటానని చెప్పారు. “మా నాన్నగారిపేరుపై ఓ ట్రస్టును 16 ఏళ్లుగా నడుపుతున్నా. కరోనా సమయంలో కూడా నేను సాయం ఆపలేదు. ఎంతో మందిని చదివిస్తున్నా. నా సంపాదనలో 20 శాతం సొమ్మును ట్రస్ట్ కు ఇస్తున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. వృత్తి పరంగా, రాజకీయాల్లో కూడా ఫలానా వ్యక్తిని లేదా రాజకీయ నాయకుడ్ని తప్పుడు మాట అనలేదు” అని అలీ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇకపై తనకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణ పౌరుడిగా.. సాధారణ ఓటరుగా మాత్రమే తన జీవితం ఇకనుంచి కొనసాగుతుందన్నారు.
This post was last modified on June 28, 2024 8:47 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…