తెలుగు కమెడియన్ స్టార్.. అలీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఆయన వైసీపీతో ఉన్న విషయం తెలిసిందే. గత రెండేళ్ల కిందట ఆయనకు అప్పటి సీఎం జగన్.. సలహాదారు పదవిని కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కానీ, రాజ్యసభ సీటునుకానీ అలీ ఆశించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ ఆయనకు దక్కలేదు. ఇదిలావుంటే.. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అలీ తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తాను ఇక నుంచి రాజకీయాల్లో ఉండబోనన్నారు. ఏ పార్టీకీ మద్దతుగా కానీ, మాట మాత్రంగా కానీ.. పనిచేసేది లేదన్నారు.
ఇక, నుంచి కేవలం సినీ నటుడిగా.. సాధారణ పౌరుడిగా మాత్రమే జీవిస్తానని అలీ వెల్లడించారు. గతంలో తాను దివంగత నిర్మాత రామానాయుడు ప్రోత్సాహంతో సినీరంగంలో కుదురుకున్నట్టు తెలిపారు. ఆయన వల్లే ఇంత వాడిని అయినట్టు చెప్పారు. ఇక, ఆయన రాజకీయాల్లో ఉన్న సమయంలో పరుచూరు నుంచి పోటీ చేసినప్పుడు.. తాను ప్రచారం చేశానని అలీ చెప్పారు. తర్వాత.. కొన్నాళ్లు టీడీపీలోనే ఉన్నట్టు చెప్పారు. తర్వాత.. వైసీపీలోకి వచ్చానన్నారు. రాజకీయాలు చేయడానికి కాకుండా.. రాజకీయంగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చినట్టు వివరణ ఇచ్చుకున్నారు.
అయితే.. ఇప్పుడు మాత్రం తాను రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అలీ తెలిపారు. సినీ పరిశ్రమ తనకు చాలా మంచి జీవితం ఇచ్చిందని, ఇక నుంచి సినీ రంగంలోనే ఉంటానని చెప్పారు. “మా నాన్నగారిపేరుపై ఓ ట్రస్టును 16 ఏళ్లుగా నడుపుతున్నా. కరోనా సమయంలో కూడా నేను సాయం ఆపలేదు. ఎంతో మందిని చదివిస్తున్నా. నా సంపాదనలో 20 శాతం సొమ్మును ట్రస్ట్ కు ఇస్తున్నా. వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. వృత్తి పరంగా, రాజకీయాల్లో కూడా ఫలానా వ్యక్తిని లేదా రాజకీయ నాయకుడ్ని తప్పుడు మాట అనలేదు” అని అలీ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇకపై తనకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సాధారణ పౌరుడిగా.. సాధారణ ఓటరుగా మాత్రమే తన జీవితం ఇకనుంచి కొనసాగుతుందన్నారు.
This post was last modified on June 28, 2024 8:47 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…