ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకుల జంపింగులు కొత్తకాదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. అలానే దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉన్న రాజకీయాలు రేపు ఉండవు. రేపు ఉన్నవి మరునాడు కూడా ఉండవు. అయితే.. ఎవరు పోయినా.. ఎవరు వచ్చినా.. కీలకనాయకులు అనేవారిని నిలబెట్టుకోవాల్సి ఉంది. ఒకవేళ వెళ్లిపోతున్న నాయకులను పిలిచి మాట్లాడాలి. ఓదార్చాలి. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి. వారు ఏం ఆశిస్తున్నారో చూడాలి . సాధ్యమైనంత వరకు వారిని పార్టీలకు అనుబంధంగానే ఉంచుకోవాలి.
కానీ, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్టుగా రాజకీయాలకు రాజకీయాలు నేర్పించే స్థాయిలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేయాల్సిరావడం వింతగా ఉంది. ఆయన అసహనంతో అన్నారో.. ఏమైనా ఫర్వాలేదని అనుకున్నారో.. నాయకులు వెళ్లిపోయినా.. ఏం కాదని సెలవిచ్చారు. నిజమే.. ఇది ఒకప్పుడు అనుకున్న పరిస్థితివుంది. నాయకులు పోయినా.. ప్రజలు మనతో ఉన్నారని.. బలంగా విశ్వసించి ప్రజల మధ్యకు వెళ్లిన రోజులు ఉన్నాయి కాబట్టి వాటిని గమనంలో పెట్టుకుని కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించి ఉంటారు. కానీ, వాస్తవానికి ఇప్పుడు ప్రజలుకూడా కేసీఆర్తో లేరు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఆయనకు దూరమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒకరిద్దరికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను చేరుకునేందుకు వారధుల వంటి నాయకులను కూడా కోల్పోతే.. పార్టీకి పెను ప్రమాదమనే విషయాన్ని కేసీఆర్ ఎక్కడో మరిచిపోతున్నట్టుగా అనిపిస్తోంది. తాజాగా కేసీఆర్ ఎంతో వినయంగా ‘అన్న’ అని సంబోధిం చే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెళ్లిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జారుకున్నారు. దీనికి ముందు కేకే.. సహా అనేక మంది నాయకులు జంప్ చేశారు.
అయినా.. ఇంత జరుగుతున్నా.. కేసీఆర్ దూకుడుగానే ఉన్నారు. పోయేవాళ్లు పోవచ్చని. వారి గురించి తాను పట్టించుకోనని చెప్పారు. కానీ, చెబుతున్న ఈజీగా పార్టీ పరిస్థితి అయితే కనిపించడం లేదు. వయసు మీదపడుతుండడంతో మునుపటి మాదిరిగా తెలంగాణ సమాజంలో కేసీఆర్ ప్రజ్వల వేడిని రగించలేరనేది వాస్తవం. ఇదేసమయంలో నాయకత్వ లోపంతోనూ పార్టీ ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో నాయకులను కాపాడుకుని.. ఆరుతున్న దీపానికి చేతులు అడ్డుపెట్టుకోవాల్సిన సమయంలో చేతులు ఎత్తేసి.. ఏమైనా ఫర్వాలేదంటే.. పుంజుకునేందుకు బీజేపీ, పొదవి పట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.
This post was last modified on June 25, 2024 9:58 pm
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సర్కారీ…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రిజవిజన్(సర్) ప్రక్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు…
టాలీవుడ్ లో కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల సంకట స్థితి అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తేల్చకుండా, అభిమానుల…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత…