కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నేతల అరాచకాలపై దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో సర్కారు దన్ను చూసుకుని చెలరేగిన చాలా మంది నాయకులు.. భూములను కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ.. ప్రముఖ రియల్టర్.. సినీ నిర్మాత కూడా అయిన.. ఎంవీవీ సత్యనారయణపై విశాఖపట్నంపోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
విశాఖ ఎంపీగా ఉన్న సమయంలో ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంటు పరిధిలో చాలా మంది నుంచి భూములు తక్కువధరలకు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరి నుంచి భూములు తీసుకుని.. వారి నుంచి ఎదురు వైట్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో టీడీపీ నేతలు బండారు, వెలగపూడి వంటివారు మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.
అయితే..తాజా ఎంవీవీ ఓడిపోయిన దరిమిలా.. ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. రియల్ రంగంలో పేరున్న హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు తాజాగా ఎంవీవీ సత్యనారాయణపై కేసు పెట్టారు. ఎంవోయూ పేరిట కొన్ని వైట్ పేపర్లపై అప్పటి ఎంపీ సత్యనారాయణ ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. దీని వెనుక తన విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఆరిలోవ ప్రాంతానికి చెందిన పోలీసులు ఎంవీవీ సత్యానారాయణతోపాటు.. ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరావు, మరో రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ విషయంపై ఎంవీవీ మీడియా ముందుకు కానీ.. వ్యక్తిగతంగా కానీ స్పందించలేదు. నేరుగా హైకోర్టు తలుపు తట్టారు. తనపై రాజకీయ దుగ్ధతోనే కేసు పెట్టారని.. టీడీపీ నేతల ప్రోద్బలం ఉందని ఆరోపిస్తూ.. ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసు పూర్వాపరాలు వెలుగు చూశాయి.
This post was last modified on June 25, 2024 6:05 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…