కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నేతల అరాచకాలపై దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో సర్కారు దన్ను చూసుకుని చెలరేగిన చాలా మంది నాయకులు.. భూములను కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ.. ప్రముఖ రియల్టర్.. సినీ నిర్మాత కూడా అయిన.. ఎంవీవీ సత్యనారయణపై విశాఖపట్నంపోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
విశాఖ ఎంపీగా ఉన్న సమయంలో ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంటు పరిధిలో చాలా మంది నుంచి భూములు తక్కువధరలకు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరి నుంచి భూములు తీసుకుని.. వారి నుంచి ఎదురు వైట్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో టీడీపీ నేతలు బండారు, వెలగపూడి వంటివారు మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.
అయితే..తాజా ఎంవీవీ ఓడిపోయిన దరిమిలా.. ఇప్పుడు బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. రియల్ రంగంలో పేరున్న హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు తాజాగా ఎంవీవీ సత్యనారాయణపై కేసు పెట్టారు. ఎంవోయూ పేరిట కొన్ని వైట్ పేపర్లపై అప్పటి ఎంపీ సత్యనారాయణ ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. దీని వెనుక తన విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఆరిలోవ ప్రాంతానికి చెందిన పోలీసులు ఎంవీవీ సత్యానారాయణతోపాటు.. ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరావు, మరో రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ విషయంపై ఎంవీవీ మీడియా ముందుకు కానీ.. వ్యక్తిగతంగా కానీ స్పందించలేదు. నేరుగా హైకోర్టు తలుపు తట్టారు. తనపై రాజకీయ దుగ్ధతోనే కేసు పెట్టారని.. టీడీపీ నేతల ప్రోద్బలం ఉందని ఆరోపిస్తూ.. ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసు పూర్వాపరాలు వెలుగు చూశాయి.
This post was last modified on June 25, 2024 6:05 pm
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఉత్కృష్టం. ఈషణ్మాత్ర(సెకనులో సగభాగం) దర్శనం లభిస్తే.. చాలని పరితపించే దేవదేవుని భక్తులు వ్యయ ప్రయాసలకు…
చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి చూస్తున్న తరుణంలో కల్కి 2898 ఏడికి వస్తున్న భారీ స్పందన థియేటర్లను…
ఏపీలోని కూటమి ప్రభుత్వం.. వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. గత వైసీపీ ప్రభుత్వం పని చేసిన తీరు..…
నిన్న విడుదలైన కల్కి 2898 ఏడిలో మహాభారతానికి సంబంధించి కేవలం కొన్ని నిమిషాల సీక్వెన్సులే చూపించాడు దర్శకుడు నాగ అశ్విన్.…
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ భారతీయులు ఉంటారు. అందునా తెలుగోళ్లు కూడా కనిపిస్తారు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో మాత్రం…
కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన రేణుక స్వామి మర్డర్ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ వ్యవహారం ఇంకా వేడిగానే…