వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయడమే కాక.. నిత్యం సోషల్ మీడియా, మీడియాలో కనిపిస్తూ బాగానే హైలైట్ అయ్యాడు గుడివాడ అమర్నాథ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్నాథ్.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయి తెలుగుదేశం మీద.. అలాగే జనసేన మీద చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.
మిగతా వైసీపీ నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే అయినా.. మంత్రి స్థాయికి తగ్గట్లు హుందాగా మాట్లాడకపోవడం వల్ల పలు సందర్భాల్లో ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో ఆయన ఒకరు అనడంలో సందేహం లేదు. ఏపీలో పరిశ్రమలు లేకపోవడం గురించి స్పందిస్తూ.. ఓ సందర్భంలో ఆయన చెప్పిన ‘కోడిగుడ్డు పురాణం’తో తన ఇంటిపేరే ‘గుడ్డు’గా మారిపోయింది.
ఇక వర్తమానంలోకి వస్తే.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో వెలుగుు చూస్తున్న వ్యవహారాలపై పార్టీని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్లలో అమర్నాథ్ ఒకరు. రుషికొండ ప్యాలెస్ విషయంలోనూ ఆయన తమ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్లే మాట్లాడారు. కానీ లేటెస్ట్గా ఆయన అమరావతిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
అమరావతి ఆఫీస్ కూల్చివేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైసీపీ అక్రమ కట్టడాలపై నోటీసులు ఇస్తున్నారు అధికారులు. విశాఖపట్నంలోని మధురవాడలోని ఓ ఆఫీస్ విషయంలోనూ ఇలాగే నోటీసులు ఇవ్వగా.. అక్కడికి వచ్చిన అమర్నాథ్ ఓ విలేకరి వేసిన ప్రశ్నకు సమాధానంగా.. “అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లేదంటే ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ పార్టీని, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడే అమర్నాథ్.. తమ ప్రభుత్వంలో కూల్చివేతల గురించి ఇలా విమర్శనాత్మకంగా మాట్లాడేశాడేంటి.. జగన్ ఇలాంటి మాటలు విని ఊరుకుంటాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on June 24, 2024 10:01 am
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…
స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ…
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…