Political News

అమర్‌నాథ్ అంత మాట అనేశాడేంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయడమే కాక.. నిత్యం సోషల్ మీడియా, మీడియాలో కనిపిస్తూ బాగానే హైలైట్ అయ్యాడు గుడివాడ అమర్‌నాథ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్‌నాథ్.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయి తెలుగుదేశం మీద.. అలాగే జనసేన మీద చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.

మిగతా వైసీపీ నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే అయినా.. మంత్రి స్థాయికి తగ్గట్లు హుందాగా మాట్లాడకపోవడం వల్ల పలు సందర్భాల్లో ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వైసీపీ నేతల్లో ఆయన ఒకరు అనడంలో సందేహం లేదు. ఏపీలో పరిశ్రమలు లేకపోవడం గురించి స్పందిస్తూ.. ఓ సందర్భంలో ఆయన చెప్పిన ‘కోడిగుడ్డు పురాణం’తో తన ఇంటిపేరే ‘గుడ్డు’గా మారిపోయింది.

ఇక వర్తమానంలోకి వస్తే.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో వెలుగుు చూస్తున్న వ్యవహారాలపై పార్టీని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్లలో అమర్‌నాథ్ ఒకరు. రుషికొండ ప్యాలెస్ విషయంలోనూ ఆయన తమ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్లే మాట్లాడారు. కానీ లేటెస్ట్‌గా ఆయన అమరావతిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

అమరావతి ఆఫీస్ కూల్చివేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైసీపీ అక్రమ కట్టడాలపై నోటీసులు ఇస్తున్నారు అధికారులు. విశాఖపట్నంలోని మధురవాడలోని ఓ ఆఫీస్‌ విషయంలోనూ ఇలాగే నోటీసులు ఇవ్వగా.. అక్కడికి వచ్చిన అమర్‌నాథ్ ఓ విలేకరి వేసిన ప్రశ్నకు సమాధానంగా.. “అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లేదంటే ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ పార్టీని, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడే అమర్‌నాథ్.. తమ ప్రభుత్వంలో కూల్చివేతల గురించి ఇలా విమర్శనాత్మకంగా మాట్లాడేశాడేంటి.. జగన్ ఇలాంటి మాటలు విని ఊరుకుంటాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

This post was last modified on June 24, 2024 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు రాక‌తో మ‌ళ్లీ లులూ జోష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో మ‌ళ్లీ పెట్టుబ‌డుల‌కు జోష్ పెరిగింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు మాసాల్లోనే ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు…

3 hours ago

తీగ దొరికింది డొంక ప్యాలెస్‌లో వుంది: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం…

4 hours ago

దసరా పండక్కు టాలీవుడ్ సూపర్ 6

మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…

4 hours ago

శంకర్ & తమన్ ‘గేమ్ ప్రెజర్’

గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…

6 hours ago

‘పుష్ప’ మ్యాజిక్‌ను ‘దేవర’ రిపీట్ చేస్తుందా?

నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…

7 hours ago

జగన్ ‘మానవత్వం’పై ఎన్ని కౌంటర్లో..

"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…

7 hours ago