Political News

వైసీపీ కార్యాల‌యం కూల్చివేత‌.. జ‌గ‌న్ గ‌గ్గోలు!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శివారు ప్రాంతమైన తాడేప‌ల్లిలో సుమారు 15 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన(తుది ద‌శ‌కు చేరుకుంది) వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని తాజాగా అధికారులు కూల్చేశారు. అక్ర‌మ నిర్మాణ‌మ‌ని.. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని పేర్కొంటూ.. శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ నిర్మాణాన్ని నేల మ‌ట్టం చేశారు. పైగా వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఈఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మ క సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అని జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

భిన్న స్పంద‌న‌!

ప్ర‌స్తుతం జ‌రిగిన కూల్చివేతల ప‌ర్వంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌జావేదిక‌ను కూల్చేశారు కాబ‌ట్టి.. ఇప్పుడు తాము కూడా.. కూల్చివేత‌ల‌తోనే ప‌ని ప్రారంభిస్తాం.. అన్న‌ట్టుగా టీడీపీ ప‌ని చేస్తోందా? అని కొంద‌రుప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు మాత్రం.. అక్ర‌మంగా నిర్మించుకున్న దానిని కూల్చేస్తే త‌ప్పేముంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు నోటీసులు ఇచ్చి.. స‌మ‌యం కేటాయించి.. ప్ర‌జ‌ల్లోకి ఈ అక్ర‌మాన్ని తీసుకువెళ్లి.. అప్పుడు కూల్చి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు. ఎవ‌రికి అనుకూలంగా వారు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 22, 2024 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

7 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

7 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

7 hours ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

10 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

11 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

11 hours ago