Political News

వైసీపీ కార్యాల‌యం కూల్చివేత‌.. జ‌గ‌న్ గ‌గ్గోలు!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శివారు ప్రాంతమైన తాడేప‌ల్లిలో సుమారు 15 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన(తుది ద‌శ‌కు చేరుకుంది) వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని తాజాగా అధికారులు కూల్చేశారు. అక్ర‌మ నిర్మాణ‌మ‌ని.. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని పేర్కొంటూ.. శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ నిర్మాణాన్ని నేల మ‌ట్టం చేశారు. పైగా వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఈఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మ క సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అని జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

భిన్న స్పంద‌న‌!

ప్ర‌స్తుతం జ‌రిగిన కూల్చివేతల ప‌ర్వంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌జావేదిక‌ను కూల్చేశారు కాబ‌ట్టి.. ఇప్పుడు తాము కూడా.. కూల్చివేత‌ల‌తోనే ప‌ని ప్రారంభిస్తాం.. అన్న‌ట్టుగా టీడీపీ ప‌ని చేస్తోందా? అని కొంద‌రుప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు మాత్రం.. అక్ర‌మంగా నిర్మించుకున్న దానిని కూల్చేస్తే త‌ప్పేముంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు నోటీసులు ఇచ్చి.. స‌మ‌యం కేటాయించి.. ప్ర‌జ‌ల్లోకి ఈ అక్ర‌మాన్ని తీసుకువెళ్లి.. అప్పుడు కూల్చి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు. ఎవ‌రికి అనుకూలంగా వారు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 22, 2024 12:18 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago