Political News

వైసీపీ కార్యాల‌యం కూల్చివేత‌.. జ‌గ‌న్ గ‌గ్గోలు!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శివారు ప్రాంతమైన తాడేప‌ల్లిలో సుమారు 15 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన(తుది ద‌శ‌కు చేరుకుంది) వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని తాజాగా అధికారులు కూల్చేశారు. అక్ర‌మ నిర్మాణ‌మ‌ని.. అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని పేర్కొంటూ.. శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ నిర్మాణాన్ని నేల మ‌ట్టం చేశారు. పైగా వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఈఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మ క సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అని జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

భిన్న స్పంద‌న‌!

ప్ర‌స్తుతం జ‌రిగిన కూల్చివేతల ప‌ర్వంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌జావేదిక‌ను కూల్చేశారు కాబ‌ట్టి.. ఇప్పుడు తాము కూడా.. కూల్చివేత‌ల‌తోనే ప‌ని ప్రారంభిస్తాం.. అన్న‌ట్టుగా టీడీపీ ప‌ని చేస్తోందా? అని కొంద‌రుప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు మాత్రం.. అక్ర‌మంగా నిర్మించుకున్న దానిని కూల్చేస్తే త‌ప్పేముంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు నోటీసులు ఇచ్చి.. స‌మ‌యం కేటాయించి.. ప్ర‌జ‌ల్లోకి ఈ అక్ర‌మాన్ని తీసుకువెళ్లి.. అప్పుడు కూల్చి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు. ఎవ‌రికి అనుకూలంగా వారు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 22, 2024 12:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago