ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని గద్దెదించేసిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదు.దీంతో వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా.. పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయారు. అయితే.. తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అధికారం కోల్పోయినా.. 33 మంది ఎమ్మెల్యేలను దక్కించుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే నిలబెట్టుకుంది.
కానీ… ఇప్పుడు ఈ హోదాపైనే కాంగ్రెస్ కన్నేసింది. తాము తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అసెంబ్లీ లో బీఆర్ఎస్ అడ్డుకుంటున్న దరిమిలా.. ముఖ్యమైన నిర్ణయాలు పెండింగ్లో పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా.. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార పార్టీవైపు నడిపించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే.. కొందరు నాయకులు వచ్చారు.
ఇక, ఇప్పుడు.. బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికల్లో కూసాలు కదిలిపోయిన దరిమిలా.. సిట్టింగ్ ఎమ్మెల్యే లు.. ఆ పార్టీలో ఉంటే నియోజకవర్గం నిదులు కూడా తమకు అందే పరిస్థితి లేదని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పిలుపునకు వారు అంతర్గత సమావేశాల్లో ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది. ఇదేసమయంలో మరో నలుగురు ఎమ్మెల్యేలపైనా కన్నేసింది. అయితే.. వీరితో బీఆర్ఎస్ అధినేత చర్చించారు. పార్టీ మారొద్దని సూచించారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ అధినేత చెప్పినట్టుగా లేదు. కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని పలువురు నాయకులు తమకు సన్నిహితంగా ఉన్న వారి వద్ద చెబుతున్నారు. త్వరలో నే స్థానిక ఎన్నికలు ఉన్న దరిమిలా.. అధికార పార్టీ నుంచి తమపై ఒత్తిడి ఉందని.. పైగా బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు సుమారు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చిక్కుతారని అంటున్నారు. విడతల వారీగా వారిని కారు దింపేస్తే.. తమ పని సులువు అవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తుండడం గమనార్హం. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఎప్పుడేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 21, 2024 2:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…