ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని గద్దెదించేసిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదు.దీంతో వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా.. పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయారు. అయితే.. తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అధికారం కోల్పోయినా.. 33 మంది ఎమ్మెల్యేలను దక్కించుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే నిలబెట్టుకుంది.
కానీ… ఇప్పుడు ఈ హోదాపైనే కాంగ్రెస్ కన్నేసింది. తాము తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అసెంబ్లీ లో బీఆర్ఎస్ అడ్డుకుంటున్న దరిమిలా.. ముఖ్యమైన నిర్ణయాలు పెండింగ్లో పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా.. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార పార్టీవైపు నడిపించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే.. కొందరు నాయకులు వచ్చారు.
ఇక, ఇప్పుడు.. బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికల్లో కూసాలు కదిలిపోయిన దరిమిలా.. సిట్టింగ్ ఎమ్మెల్యే లు.. ఆ పార్టీలో ఉంటే నియోజకవర్గం నిదులు కూడా తమకు అందే పరిస్థితి లేదని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పిలుపునకు వారు అంతర్గత సమావేశాల్లో ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది. ఇదేసమయంలో మరో నలుగురు ఎమ్మెల్యేలపైనా కన్నేసింది. అయితే.. వీరితో బీఆర్ఎస్ అధినేత చర్చించారు. పార్టీ మారొద్దని సూచించారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ అధినేత చెప్పినట్టుగా లేదు. కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని పలువురు నాయకులు తమకు సన్నిహితంగా ఉన్న వారి వద్ద చెబుతున్నారు. త్వరలో నే స్థానిక ఎన్నికలు ఉన్న దరిమిలా.. అధికార పార్టీ నుంచి తమపై ఒత్తిడి ఉందని.. పైగా బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు సుమారు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చిక్కుతారని అంటున్నారు. విడతల వారీగా వారిని కారు దింపేస్తే.. తమ పని సులువు అవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేస్తుండడం గమనార్హం. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కాబట్టి.. ఎప్పుడేం జరుగుతుందో చూడాలి.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…