‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను చూడడం ఇదే మొదటిసారి. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించింది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా శాసనసభకు రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యత. పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖలు లోతుగా పని చేయాలని భావిస్తున్నాడు. పదవి తాలూకు పవర్ ను మేం ఆశించడం లేదు. కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా పవన్ కు వచ్చే లాభం ఏం లేదు. పవన్ సినిమాల వరకే పవన్ స్టార్. వాస్తవంలో రియల్ లీడర్’ అని జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అన్నాడు. శాసనసభలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన శాసనసభకు విచ్చేశారు.
అంతకుముందు ట్విట్టర్ లో నాగబాబు చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతున్నది. “జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్.. ప్రజలు నిన్ను నమ్మలేదు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు” అంటూ విమర్శించిన వారందరి నోళ్లన్ని మూతపడేలా పవన్ కళ్యాణ్ బంఫర్ మేజార్టీతో విజయం సాధించాడు అని నాగబాబు పెట్టిన ట్వీట్ పై జనసైనికులు ఈ రోజు కోసమే ఎదురుచూశాం అంటూ బావేద్వేగంతో స్పందిస్తున్నారు.
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చాడు. 2019లో ఒంటరిగా పోటీ చేసి స్వయంగా పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక స్థానానికి పరిమితం అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో కీలకంగా వ్యవహరించి 21 లోక్ సభ, 164 శాసనసభ స్థానాలు గెలుచుకోవడంలో కీలకం అయ్యాడు పవన్. అంతేకాకుండా జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలను గెలుచుకోవడం కొసమెరుపు.
This post was last modified on June 21, 2024 2:01 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…