‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను చూడడం ఇదే మొదటిసారి. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించింది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా శాసనసభకు రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యత. పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖలు లోతుగా పని చేయాలని భావిస్తున్నాడు. పదవి తాలూకు పవర్ ను మేం ఆశించడం లేదు. కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా పవన్ కు వచ్చే లాభం ఏం లేదు. పవన్ సినిమాల వరకే పవన్ స్టార్. వాస్తవంలో రియల్ లీడర్’ అని జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అన్నాడు. శాసనసభలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయన శాసనసభకు విచ్చేశారు.
అంతకుముందు ట్విట్టర్ లో నాగబాబు చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతున్నది. “జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్.. ప్రజలు నిన్ను నమ్మలేదు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు” అంటూ విమర్శించిన వారందరి నోళ్లన్ని మూతపడేలా పవన్ కళ్యాణ్ బంఫర్ మేజార్టీతో విజయం సాధించాడు అని నాగబాబు పెట్టిన ట్వీట్ పై జనసైనికులు ఈ రోజు కోసమే ఎదురుచూశాం అంటూ బావేద్వేగంతో స్పందిస్తున్నారు.
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చాడు. 2019లో ఒంటరిగా పోటీ చేసి స్వయంగా పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక స్థానానికి పరిమితం అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో కీలకంగా వ్యవహరించి 21 లోక్ సభ, 164 శాసనసభ స్థానాలు గెలుచుకోవడంలో కీలకం అయ్యాడు పవన్. అంతేకాకుండా జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలను గెలుచుకోవడం కొసమెరుపు.
This post was last modified on June 21, 2024 2:01 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…