Political News

ఈవీఎం టాంపరింగ్.. కొట్టిపారేసిన వైసీపీ నేత

2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ సాధించిన విజయంపై తెలుగుదేశం అనుమానాలు వ్యక్తం చేసింది. అప్పుడు ఈవీఎంల పనితీరుపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తే అప్పటి సీఎం జగన్ తేలిగ్గా కొట్టి పారేశారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో ఏకంగా 164 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో ఇప్పుడు వైసీపీ వాళ్లు ఈవీఎం టాంపరింగ్ గురించి ఆరోపణలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. కానీ గత పరిణామాల దృష్ట్యా వారి ఆరోపణలకు విలువ లేకుండా పోతోంది.

స్వయంగా సీఎం జగనే ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ పెడితే.. సోషల్ మీడియాలో ఆయన గతంలో ఈవీఎంల గురించి మాట్లాడిన వీడియోలు తెచ్చిపెట్టి తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేశారు నెటిజన్లు. కానీ మిగతా వైసీపీ నేతలు మాత్రం ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి టైంలో ఓ వైసీపీ నాయకుడు మాత్రం భిన్నమైన స్వరం వినిపించారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి జంప్ అయిన రాపాక వరప్రసాద్.. ఈవీఎంలపై వైసీపీ వాళ్లు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈసారి అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన రాపాక.. తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఈవీఎం టాంపరింగ్ గురించి వస్తున్న ఆరోపణల గురించి ఆయన దగ్గర ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావిస్తే.. అది శుద్ధ అబద్ధమని, అవి అర్థం లేని ఆరోపణలని కొట్టిపారేశారు. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయని.. అందువల్ల అన్ని పార్టీల ఓట్లు కలిసి కూటమి విజయం సాధించిందని.. ఇది క్లియర్‌గా కనిపిస్తుంటే ఇంకా ఈవీఎంల మీద ఆరోపణలు చేయడంలో అర్థం లేదని ఆయన తేల్చి పడేశారు. మరి పార్టీ స్టాండ్‌కు భిన్నంగా మాట్లాడిన రాపాక విషయంలో వైసీపీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో?

This post was last modified on June 21, 2024 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏం చేయాలో నాకు తెలుసు.. రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్!

ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటివరకు వరుసగా విఫలమవ్వడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే…

19 seconds ago

మహేషే కాదు తారక్ కూడా అడవుల్లోకే

ఒక్క అప్డేట్ బయటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న…

7 minutes ago

ఇండియన్స్ కు మరో షాక్.. అమెరికా స్టైల్ లొనే బ్రిటన్..

అక్రమ వలసదారుల నియంత్రణకు ఇటీవల పలు దేశాల తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా అమెరికా…

38 minutes ago

“నరకం చూపిస్తా” : ట్రంప్ డెడ్‌లైన్‌!

ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణలో కీలక మలుపు చోటుచేసుకుంది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు.…

1 hour ago

రష్మిక సినిమాకు బజ్ : అక్కడ ఫుల్… ఇక్కడ డల్!

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చావా మీద పెద్దగా బజ్ కనిపించడం లేదు. బాలీవుడ్ లో అత్యంత భారీ…

1 hour ago

కుంభమేళాకు వెళ్లి వస్తూ… ఏడుగురు దుర్మరణం

మహా కుంభమేళాకు వెళ్లిన హైదరాబాదీలు ప్రమాదంలో చిక్కుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ…

2 hours ago