ఏపీలో జగన్ పాలన సాగిన సమయంలో ఆయన అనుకూలంగా పనిచేశారని.. ఎవరిపై కేసులు పెట్టమం టే వారిపై కేసులు పెట్టి.. ఎవరిని అరెస్టు చేయమంటే వారిని అరెస్టు చేశారని.. విమర్శలు ఎదుర్కొని.. బ్యాడ్ అయిపోయిన ముగ్గురు ‘జగన్ ఐపీఎస్’లకు సీఎం చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు. వారిలో ఒక్కరికి మాత్రమే తిరిగి పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం.. మిగిలిన ఇద్దరిని మాత్రం పక్కన పెట్టింది. దీంతో జగన్ హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్లు ఇప్పుడు హడలి పోతున్నారు.
ఎవరెవరు?
రాజేంద్రనాథ్ రెడ్డి: ఈయన నిన్న మొన్నటి వరకు రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వైపుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనను తప్పించారు. అప్పటి నుంచి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్ హయాంలో విపక్షాలపై దాడులు జరుగుతున్నా.. ఆయన చూసీ చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకులను ఆయన డీజీపీ కార్యాలయంలోకి రాకుండా.. అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి. కాగా..ఇప్పుడు ఆయనను ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది.
సునీల్ కుమార్: ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్(జగన్ హయాంలోనే నియమించారు) గా ఉన్న ఈయనను చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామరాజుపై లాఠీలతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులను బెదిరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే.. ఈయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
రిషాంత్రెడ్డి: ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా ఉన్నారు. గతంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసిన రిషాంత్ రెడ్డి.. చంద్రబాబు జిల్లాలో పర్యటించినప్పుడు.. అంగళ్లలో జరిగిన ఘర్షణల సమయంలో టీడీపీ నాయకులపై తీవ్ర స్థాయి కేసులు పెట్టారు. అదేసమయంలో చంద్రబాబుపైనా కేసు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈయనను కూడా.. పోస్టింగ్ ఇవ్వకుండా.. చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టింది.
This post was last modified on June 21, 2024 11:54 am
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…