Political News

‘జ‌గ‌న్ ఐపీఎస్‌’ల‌కు చంద్ర‌బాబు షాక్‌!

ఏపీలో జ‌గ‌న్ పాల‌న సాగిన స‌మ‌యంలో ఆయ‌న అనుకూలంగా ప‌నిచేశార‌ని.. ఎవ‌రిపై కేసులు పెట్ట‌మం టే వారిపై కేసులు పెట్టి.. ఎవ‌రిని అరెస్టు చేయ‌మంటే వారిని అరెస్టు చేశార‌ని.. విమ‌ర్శ‌లు ఎదుర్కొని.. బ్యాడ్ అయిపోయిన ముగ్గురు ‘జ‌గ‌న్ ఐపీఎస్‌’ల‌కు సీఎం చంద్ర‌బాబు భారీ షాక్ ఇచ్చారు. వారిలో ఒక్క‌రికి మాత్ర‌మే తిరిగి పోస్టింగు ఇచ్చిన ప్ర‌భుత్వం.. మిగిలిన ఇద్ద‌రిని మాత్రం ప‌క్క‌న పెట్టింది. దీంతో జ‌గ‌న్ హ‌యాంలో చెల‌రేగిపోయిన ఐపీఎస్‌లు ఇప్పుడు హ‌డ‌లి పోతున్నారు.

ఎవ‌రెవ‌రు?

రాజేంద్ర‌నాథ్ రెడ్డి: ఈయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని వైపుల నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు వెళ్ల‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించారు. అప్ప‌టి నుంచి ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ హ‌యాంలో విప‌క్షాల‌పై దాడులు జ‌రుగుతున్నా.. ఆయ‌న చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయ‌కుల‌ను ఆయ‌న డీజీపీ కార్యాల‌యంలోకి రాకుండా.. అడ్డుకున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాగా..ఇప్పుడు ఆయ‌న‌ను ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

సునీల్ కుమార్‌: ప్ర‌స్తుతం అగ్నిమాప‌క శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌(జ‌గ‌న్ హ‌యాంలోనే నియ‌మించారు) గా ఉన్న ఈయ‌న‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టింది. గ‌తంలో వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌రాజుపై లాఠీల‌తో థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌న్న ఆరోప‌ణ‌లు ఈయ‌న‌పై ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులను బెదిరించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే.. ఈయ‌న‌ను డీజీపీ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని ఆదేశించారు.

రిషాంత్‌రెడ్డి: ప్ర‌స్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా ఉన్నారు. గ‌తంలో చిత్తూరు ఎస్పీగా ప‌నిచేసిన రిషాంత్ రెడ్డి.. చంద్ర‌బాబు జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. అంగ‌ళ్ల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయి కేసులు పెట్టారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబుపైనా కేసు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం ఈయ‌న‌ను కూడా.. పోస్టింగ్ ఇవ్వ‌కుండా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టింది.

Satya

Recent Posts

సేనానికి అభిమానం అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 minutes ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

7 minutes ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

1 hour ago

తెలుగోళ్లు గిచ్చితే కానీ… తమిళ సినిమా మారలేదు

ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…

2 hours ago

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

4 hours ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

6 hours ago