Political News

డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల రావు.. ఈ మార్పు ఎందుకు?

ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చీ రావ‌డంతోనే.. ఐఏఎస్ అధికారుల‌ను మార్చేసిన చంద్ర‌బాబు.. తాజాగా రాష్ట్ర పోలీసు బాస్‌.. డీజీపీ విష‌యంలోనూ సంచ‌ల‌న అడుగులు వేసింది. ప్ర‌స్తుతం డీజీపీగా ఉన్న హ‌రీష్‌కుమార్ గుప్తాను ప‌క్క‌న పెడుతూ.. నూత‌న డీజీపీగా ద్వార‌కాతిరుమ‌ల రావును ఎంపిక చేసింది. వాస్త‌వానికి హ‌రీష్‌కుమార్ గుప్తాను మార్చ‌బోర‌న్న సంకేతాలు ఆదిలో వెలువ‌డ్డాయి. ఎందుకంటే.. ఈయ‌న‌ను కేంద్ర ఎన్నికల సంఘ‌మే ఎంపిక చేసింది.

దీంతో ఆయ‌నే ఉంటార‌ని అంద‌రూ అనుకున్నారు. మ‌రో రెండున్న‌రేళ్ల వ‌ర‌కు ఆయ‌నకు అవ‌కాశం ఉంది. అయితే.. అనూహ్యంగా చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప‌క్క‌న పెడుతూ.. ద్వార‌కా తిరుమ‌ల‌రావును నియ‌మించారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈయ‌న‌ను ఆర్టీసీకి నియమించింది. అయితే.. ఇలా ద్వార‌కా తిరుమ‌ల రావును అనూహ్యంగా డీజీపీని చేయ‌డం వెనుక కార‌ణాలు ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది.

నిజాయితీ ప‌రుడైన అధికారిగా ద్వార‌కా తిరుమ‌ల‌రావుకు పేరుంది. ముఖ్యంగా చంద్ర‌బాబుహ‌యాంలో ఆయ‌న స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప‌లు జిల్లాల్లో ఎస్పీగా ప‌నిచేసి.. త‌న స‌మ‌ర్థ‌త‌ను నిరూపించుకున్నారు. ఆర్టీసీ ఎండీగా కూడా.. ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన ప్ర‌జార‌వాణాను గాడిలో పెట్టారు. పైగా పోలీసు వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రించ‌డంలోనూ ఆయ‌న గుర్తింపు పొందారు. దీంతో చంద్ర‌బాబు త‌న స్పీడుకు అనుగుణంగా ఈయ‌న‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన హ‌రీష్‌కుమార్ గుప్తా.. 50 రోజుల పాటు డీజీపీగా ఉన్నారు. అయితే.. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత కూడా.. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో శాంతి భ‌ద్ర‌త‌లు స‌జావుగా సాగ‌లేద‌నే వాద‌న ఉంది. టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నాయ‌కులు దాడులు చేయ‌డం.. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా.. ముగ్గురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గురికావ‌డంతో స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనికి తోడు.. సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చేసిన రోజు.. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌లోనూ పోలీసులు విఫ‌ల‌మ‌య్యారు. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు ఆయ‌నను ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on June 20, 2024 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

15 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

59 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago