వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అత్యంత నష్టపోయిన.. దారుణమైన అవమానాలు, కష్టాలు అనుభవించిన ప్రాంతం ఏది అంటే మరో మాట లేకుండా అమరావతి అని చెప్పేయొచ్చు. ఎన్నికలకు ముందు వరకు అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నాం, రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి.. అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్ అండ్ కో చేయని ప్రయత్నం లేదు.
ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారి వాళ్లు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్ట కాలంలో అమరావతి రైతులకు అండగా నిలిచి, వారి కోసం గట్టిగా గళం వినిపించిన నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకడు. అప్పుడు ఆయన చేసిన సాయానికి ఇప్పుడు అమరావతి రైతులు రుణం తీర్చుకునే పనిలో పడ్డారు.
ఎన్నికల్లో గెలిచి మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. తొలిసారి అమరావతిలోని సచివాలయానికి వస్తున్నారని తెలిసి రాజధాని రైతులు హర్షాతిరేకం ప్రకటించారు. పవన్ను స్వాగతించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. అమరావతిలో వాహనం దిగిన దగ్గర్నుంచి పవన్ను రోడ్డు మీద నడిపించకూడదని స్థానికులు ఫిక్సయ్యారు. అందుకే వందల టన్నుల్లో పూలు తెప్పించారు. పవన్ నడిచే రోడ్డంతా పూలతో నింపేస్తున్నారు. అలాగే పవన్ మీద కూడా పూలు చల్లేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతే కాక పవన్ కోసం భారీ గజమాల కూడా రెడీ చేశారు.
ఇక్కడ పవన్ ప్రయాణం ఒక విజయయాత్ర లాగా సాగబోతున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక రైతులు మీడియాతో మాట్లాడుతూ.. తమను ఏ నాయకులూ కలవకుండా ముళ్లకంచెలు అడ్డుగా పెట్టారని.. వాటిని కూడా దాటుకుని వచ్చి పవన్ తమకు మద్దతు పలికారని.. ఆయన రుణం తీర్చుకోలేనిదని.. అందుకే ఈ ఏర్పాట్లు అని చెప్పారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…