వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అత్యంత నష్టపోయిన.. దారుణమైన అవమానాలు, కష్టాలు అనుభవించిన ప్రాంతం ఏది అంటే మరో మాట లేకుండా అమరావతి అని చెప్పేయొచ్చు. ఎన్నికలకు ముందు వరకు అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నాం, రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చి.. అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్ అండ్ కో చేయని ప్రయత్నం లేదు.
ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారి వాళ్లు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్ట కాలంలో అమరావతి రైతులకు అండగా నిలిచి, వారి కోసం గట్టిగా గళం వినిపించిన నేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకడు. అప్పుడు ఆయన చేసిన సాయానికి ఇప్పుడు అమరావతి రైతులు రుణం తీర్చుకునే పనిలో పడ్డారు.
ఎన్నికల్లో గెలిచి మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. తొలిసారి అమరావతిలోని సచివాలయానికి వస్తున్నారని తెలిసి రాజధాని రైతులు హర్షాతిరేకం ప్రకటించారు. పవన్ను స్వాగతించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. అమరావతిలో వాహనం దిగిన దగ్గర్నుంచి పవన్ను రోడ్డు మీద నడిపించకూడదని స్థానికులు ఫిక్సయ్యారు. అందుకే వందల టన్నుల్లో పూలు తెప్పించారు. పవన్ నడిచే రోడ్డంతా పూలతో నింపేస్తున్నారు. అలాగే పవన్ మీద కూడా పూలు చల్లేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతే కాక పవన్ కోసం భారీ గజమాల కూడా రెడీ చేశారు.
ఇక్కడ పవన్ ప్రయాణం ఒక విజయయాత్ర లాగా సాగబోతున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక రైతులు మీడియాతో మాట్లాడుతూ.. తమను ఏ నాయకులూ కలవకుండా ముళ్లకంచెలు అడ్డుగా పెట్టారని.. వాటిని కూడా దాటుకుని వచ్చి పవన్ తమకు మద్దతు పలికారని.. ఆయన రుణం తీర్చుకోలేనిదని.. అందుకే ఈ ఏర్పాట్లు అని చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…