Political News

జగన్ ట్వీట్‌కు మాస్ రెస్పాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి కేవలం 11 సీట్లకు పరిమితం అయిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా సోషల్ మీడియాలో మాస్ రెస్పాన్స్ వస్తోందా? అని ఆశ్చర్యం కలుగుతోందా? ఈ రెస్పాన్స్ వస్తోంది ఆయన అభిమానుల నుంచి కాదులెండి. ఆయన వ్యతిరేకుల నుంచి. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి.. ఓడిన నాటి నుంచి వైసీపీ నేతలంతా ఎవరినో నిందించడానికి చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు కానీ.. జనాల చేతుల్లో మోసపోయిన తొలి నాయకుడు జగనే అంటూ కొన్ని రోజులు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు తిప్పారు. తర్వాత చంద్రబాబు సాధ్యం కాని, అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని నిష్ఠూరమాడారు. దీంతో పాటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుతో ఈవీఎంలను హ్యాక్ చేసి కూటమి గెలిచేసిందని కొత్త పాట కూడా అందుకున్నారు.

తాజాగా జగన్ సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతిని పాటిస్తున్నారని.. కాబట్టి ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పద్ధతికి వెళ్లాలని డిమాండ్ చేస్తూ జగన్ తాజాగా ట్వీట్ వేశారు. ఐతే ఈ ట్వీట్ కింద కామెంట్లు, కోట్స్ చూస్తే.. జగన్ అండ్ కో తలలు ఎక్కడ పెట్టుకుంటారో అనిపిస్తోంది. ఇదే జగన్ 2019లో ఘనవిజయం సాధించినపుడు టీడీపీ వాళ్లు ఈవీఎం హ్యాకింగ్ గురించి ఆరోపణలు చేస్తే.. ఎదురుదాడి చేస్తూ మాట్లాడారు.

2014లో గెలిచినపుడు బాబు కూడా ఈవీఎంలు హ్యాక్ చేశాడా అని ప్రశ్నించడంతో పాటు 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని కూడా ప్రస్తావించి ఈవీఎం హ్యాకింగ్‌, టాంపరింగ్ ఆరోపణలపై ఎగతాళిగా మాట్లాడారు. కోట్స్, కామెంట్లలో చాలా వరకు ఈ వీడియోలే కనిపిస్తున్నాయి. మరోవైపు అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు ఈవీఎం టాంపరింగ్ ఆరోపణల మీద టీడీపీ తీరును ఎండగడుతూ, ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియోలతో జగన్‌కు ట్విట్టర్ జనాలు మాస్ రిటార్ట్స్ ఇస్తున్నారు. అంతే కాక హుందాగా ఓటమిని ఒప్పుకోకుండా సాకులు వెతుకుతున్నారని, ఇంకా మబ్బులోనే ఉన్నారంటూ అనేక మీమ్స్ పెట్టి జగన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

This post was last modified on June 18, 2024 12:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పవన్ ఇప్పుడే రాడు.. చిరుతో చూస్కుందాం

టాలీవుడ్ స్టార్ డైెరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్‌.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన కెరీర్లో ఎంతో విలువైన…

5 hours ago

వ‌లంటీర్ల‌ను ఏం చేస్తున్నారు? ఏపీలో తీవ్ర చ‌ర్చ‌

వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. వారికి ఇస్తున్న గౌర‌వ వేతనాన్ని రూ.5…

6 hours ago

చిరు తర్వాత రజనితో సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రమంగా సౌత్ సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హాలీవుడ్ లో చేయడం కన్నా…

7 hours ago

ఏపీ స్పీడు మామూలుగా లేదు

ప‌నిచేయాలన్న సంక‌ల్పం.. రాష్ట్రానికి ఏదో మేలు చేయాల‌న్న త‌ప‌న‌.. ఉంటే.. క‌ష్ట సాధ్యం అయినదేదీ ఉండ‌దు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు…

8 hours ago

అప్పుడు అమ్మాయి అబ్బాయి – ఇప్పుడు నిర్మాత డిప్యూటి సీఎం

కాలం చాలా విచిత్రమైనది. సినిమాల్లో తెరమీద చూసే డ్రామా ఒక్కోసారి నిజ జీవితంలో జరుగుతుంది. ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అలాంటిదే…

9 hours ago

నిర్మాతలతో పవన్ సమావేశం ఎందుకంటే

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలుసుకోవడం వెనుక కారణం ఏమై…

9 hours ago