విశాఖపట్నంలో రుషికొండ పై మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ను ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకువెళ్లి పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి… ఎలాంటి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి? అనే విషయాలు వెలుగు చూశాయి. నిజానికి ఈ నిర్మాణం గత మూడేళ్లలో చేపట్టినా.. పురుగును కూడా పోనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే.. ప్రజాతీర్పుతో కుప్పకూలిన వైసీపీ ప్రభుత్వం తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వారంలోనే మాజీ మంత్రి గంటా ఇక్కడ పర్యటించారు. రుషికొండపై కట్టిన భవనంలోని విలాసాలను ఆయన బాహ్య ప్రపంచానికి చూపించారు. దీనిపై మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ.. రుషికొండ లీలలు చాలానే ఉన్నాయని అన్నారు. ఇంకా అనేక ఫొటోలు రావాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే వాటిని కూడా బయట పెడతామని తెలిపారు.
కృష్ణా నది పక్కన కట్టిన ప్రజావేదికను దారుణమని పేర్కొంటూ.. నిబంధనలు పాటించలేదని చెబుతూ కూల్చివేశారని.. నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరి కొండ మొత్తాన్నీ తొలిచేసి ప్యాలెస్ ఎలా కట్టారని.. దీనిని ఏ నిబంధనలు పాటించారని ఆయన ప్రశ్నించారు. అన్నింటినీ చంద్రబాబు వెలికి తీస్తారని చెప్పారు. ఇక, టీడీపీ నేతలపైనే వైసీపీ నాయకులు దాడులు చేసి హత్యలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ పార్టీ నాయకులు ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు.
తాము తలుచుకుంటే వైసీపీ నాయకులు ఇబ్బంది పడతారని.. కానీ, చంద్రబాబు దూరదృష్టితో తమను కట్టడి చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్ద పీట వేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ను ఉక్కుపాదంతో అణిచేస్తామన్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని నారా లోకేష్ వివరించారు.
This post was last modified on June 17, 2024 4:15 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…