విశాఖపట్నంలో రుషికొండ పై మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ను ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకువెళ్లి పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి… ఎలాంటి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి? అనే విషయాలు వెలుగు చూశాయి. నిజానికి ఈ నిర్మాణం గత మూడేళ్లలో చేపట్టినా.. పురుగును కూడా పోనివ్వనంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే.. ప్రజాతీర్పుతో కుప్పకూలిన వైసీపీ ప్రభుత్వం తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వారంలోనే మాజీ మంత్రి గంటా ఇక్కడ పర్యటించారు. రుషికొండపై కట్టిన భవనంలోని విలాసాలను ఆయన బాహ్య ప్రపంచానికి చూపించారు. దీనిపై మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ.. రుషికొండ లీలలు చాలానే ఉన్నాయని అన్నారు. ఇంకా అనేక ఫొటోలు రావాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే వాటిని కూడా బయట పెడతామని తెలిపారు.
కృష్ణా నది పక్కన కట్టిన ప్రజావేదికను దారుణమని పేర్కొంటూ.. నిబంధనలు పాటించలేదని చెబుతూ కూల్చివేశారని.. నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరి కొండ మొత్తాన్నీ తొలిచేసి ప్యాలెస్ ఎలా కట్టారని.. దీనిని ఏ నిబంధనలు పాటించారని ఆయన ప్రశ్నించారు. అన్నింటినీ చంద్రబాబు వెలికి తీస్తారని చెప్పారు. ఇక, టీడీపీ నేతలపైనే వైసీపీ నాయకులు దాడులు చేసి హత్యలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ పార్టీ నాయకులు ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు.
తాము తలుచుకుంటే వైసీపీ నాయకులు ఇబ్బంది పడతారని.. కానీ, చంద్రబాబు దూరదృష్టితో తమను కట్టడి చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్ద పీట వేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ను ఉక్కుపాదంతో అణిచేస్తామన్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని నారా లోకేష్ వివరించారు.
This post was last modified on June 17, 2024 4:15 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…