Political News

‘రుషికొండ ‘ లీల‌లు చాలానే ఉన్నాయ్‌: నారా లోకేష్‌

విశాఖప‌ట్నంలో రుషికొండ పై మాజీ సీఎం జ‌గ‌న్ హ‌యాంలో నిర్మించిన విలాస‌వంత‌మైన ప్యాలెస్‌ను ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మీడియాను తీసుకువెళ్లి ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా లోప‌ల ఎలాంటి సౌక‌ర్యాలు ఉన్నాయి… ఎలాంటి విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు ఉన్నాయి? అనే విష‌యాలు వెలుగు చూశాయి. నిజానికి ఈ నిర్మాణం గ‌త మూడేళ్ల‌లో చేప‌ట్టినా.. పురుగును కూడా పోనివ్వ‌నంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

అయితే.. ప్ర‌జాతీర్పుతో కుప్ప‌కూలిన వైసీపీ ప్ర‌భుత్వం త‌ర్వాత టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చిన వారంలోనే మాజీ మంత్రి గంటా ఇక్క‌డ ప‌ర్య‌టించారు. రుషికొండ‌పై క‌ట్టిన భ‌వ‌నంలోని విలాసాల‌ను ఆయ‌న బాహ్య ప్ర‌పంచానికి చూపించారు. దీనిపై మంత్రి, టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ స్పందిస్తూ.. రుషికొండ లీల‌లు చాలానే ఉన్నాయ‌ని అన్నారు. ఇంకా అనేక ఫొటోలు రావాల్సి ఉంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే వాటిని కూడా బ‌య‌ట పెడ‌తామ‌ని తెలిపారు.

కృష్ణా న‌ది ప‌క్క‌న క‌ట్టిన ప్ర‌జావేదిక‌ను దారుణ‌మ‌ని పేర్కొంటూ.. నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని చెబుతూ కూల్చివేశార‌ని.. నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మ‌రి కొండ మొత్తాన్నీ తొలిచేసి ప్యాలెస్ ఎలా క‌ట్టార‌ని.. దీనిని ఏ నిబంధ‌న‌లు పాటించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అన్నింటినీ చంద్ర‌బాబు వెలికి తీస్తార‌ని చెప్పారు. ఇక, టీడీపీ నేత‌ల‌పైనే వైసీపీ నాయ‌కులు దాడులు చేసి హ‌త్య‌లు చేస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌మ పార్టీ నాయ‌కులు ముగ్గురు హత్య‌కు గుర‌య్యార‌న్నారు.

తాము త‌లుచుకుంటే వైసీపీ నాయ‌కులు ఇబ్బంది ప‌డ‌తార‌ని.. కానీ, చంద్ర‌బాబు దూర‌దృష్టితో త‌మ‌ను క‌ట్ట‌డి చేస్తున్నార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు పెద్ద పీట వేయాల‌న్న ఉద్దేశంతో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌ను ఉక్కుపాదంతో అణిచేస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే దీనిపై ఒక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని నారా లోకేష్ వివ‌రించారు.

This post was last modified on June 17, 2024 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

10 minutes ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

1 hour ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

3 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

3 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

3 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

4 hours ago