జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే.. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు కూడా.. ఆయన ప్రభు త్వంలో చేరేది లేదన్నారు. పదవులు ఆశించడం లేదని కూడా చెప్పారు.
ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఓ పది మంది వరకు ఎమ్మెల్యేలను అసెంబ్లీ గడప దాటిస్తే.. చాలని ఆ తర్వాత.. నెమ్మడిగా పాతికేళ్లలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేద్దామని కూడా చెప్పారు.
అయితే.. అనూహ్యంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వం పాత్ర తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యత లు తీసుకున్నారు. పైగా.. చంద్రబాబు ఆయనకు తీరిక లేని మంత్రి త్వ శాఖను కట్టబెట్టారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలంటే.. ఎంత చేసినా పని ఉంటూనే ఉంటుంది. రోజుకు 24 గంటలు కష్టపడినా.. ఆయా ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఉండదని అంటారు. అలాంటి శాఖను తీసుకున్నారు పవన్.
తద్వారా.. రెండు రకాల ప్రయోజనాలను పవన్ నెరవేర్చుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనితీరు కారణంగా.. ఆయన ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు.. పార్టీ పరంగా ముందుకు సాగేందు కు అవకాశం ఉంటుంది.
అదేసమయంలో పాలన చేతకాదు.. అన్న విపక్ష నాయకులకు, కొందరు మేధా వులకు కూడా.. తన పనితీరుతో సమాధానం చెప్పేందుకు కూడా.. పవన్ కు పెద్ద అవకాశం దక్కినట్టే భావించాలి. ఇది ఆయన వ్యక్తిగత విషయాన్ని మాత్రమే కాదు.. పార్టీకి కూడా ప్రయోజనం చేకూర్చనుంది.
మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసుకుని.. చెరగని ముద్రను వేసుకుం టే.. అది వచ్చే 2029 ఎన్నికల నాటికి వైసీపీ ఓటు బ్యాంకు కూడా.. తనవైపు తిప్పుకొనే పక్కా వ్యూహం తో ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. గ్
రామీణ ప్రాంతాల్లో ఇప్పటిక ఈవైసీపీ బలంగా ఉంది. అందుకే 40 శాతం ఓటు బ్యాంకును పొందింది. ఇప్పుడుజనసేన కనుక డెవలప్ అయితే.. వైసీపీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు కూడా పవన్కు ఒక పెద్ద అవకాశం వచ్చినట్టుగానే భావించాలి.
This post was last modified on June 16, 2024 10:47 am
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…