ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన దరిమిలా.. ఇంకా ఆ షాక్ నుంచి పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తేరుకోలేదు. ఇంకా లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. ఎలా ఓడిపోయామా? అని సందేహాలు వ్యక్తం చేస్తూ నే ఉన్నారు. అంతేకాదు.. నాయకులను కూర్చోబెట్టుకుని తన ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే.. ఈ షాక్ నుంచే ఇంకా తేరకోని జగన్కు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఆయనకు హైదరాబాద్లో ఉన్న ఇల్లు, పార్టీ కార్యాలయంలో కూల్చి వేతలు జరుగుతున్నాయి.
హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. కార్యాలయ నిర్మాణంలో భాగంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని అధికారులు దగ్గరుండి మరీ కూల్చి వేయిస్తున్నారు. పలు జేసీబీలను రంగంలోకి దించిన హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ అధికారులు పోలీసుల సహకారంతో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలు కూల్చి వేయిస్తున్నారు.
కూల్చి వేస్తున్న వాటిలో ఫుట్పాత్ లను ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్ లు, భారీ ఎత్తున నిర్మించి న హోర్డింగులు, ప్రహరీ గోడలు.. వాహనాల పార్కింగులు(టూ వీలర్) ఉన్నాయి. లోటస్పాండ్ చుట్టూ అక్రమంగా ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదులు చేయడంతో అధికారులు స్పందిం చారు. గత నెలలోనే కార్యాలయ అధికారులను నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. అయితే వారు స్పందించలేదు. దీంతో ఇప్పుడు నేరుగా అధికారులు రంగంలోకి దిగి కూల్చి వేతలు చేపట్టారు.
అయితే..ఇ దే కార్యాలయంలో వెనుకవైపు పీసీసీ చీఫ్ షర్మిల కార్యాలయం కూడా ఉంది. మరి దాని వైపు అధికారులు చూస్తారా? లేక వదిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వైసీపీకి చెందిన కార్యాల యం ఎదురుగా ఉన్న కట్టడాలను మాత్రమే అధికారులు కూల్చి వేస్తున్నారు. ఎలాంటి ఆందోళనలను నిర్వహించకుండా.. పోలీసులను కూడా రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఈ దారిని మూసివేశారు.
This post was last modified on June 15, 2024 1:08 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…