Political News

ఈ టీడీపీ సీనియ‌ర్ల‌లో ఒక‌రికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు!

టీడీపీకి అంతా హ్యాపీనే! జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వంలో టీడీపీ కీల‌క పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవ‌స‌ర‌ముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మ‌రింత పెంచుతూ ఆ పార్టీ నాయ‌కుల్లో ఒక‌రిని గ‌వ‌ర్న‌ర్‌గా చేసే అవ‌కాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్న‌ట్లు తెలిసింది.

టీడీపీ సూచించిన నాయ‌కుడికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు అశోక్‌గ‌జ‌ప‌తి రాజు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిలో ఒక‌రిని గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి నేత‌ల వార‌సురాళ్లు ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే.

య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌, అశోక్‌గ‌జ‌ప‌తి త‌న‌య అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్ల‌లో ఏ ఒక్క‌రికి కూడా బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వంలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మంత్రిగా ప‌ని చేశారు. మ‌రోవైపు అశోక్ గ‌జ‌ప‌తి రాజు కేంద్ర‌మంత్రిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ ఇద్ద‌రిలో ఒక‌రికి గ‌వ‌ర్న‌ర్ ప‌దవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్న‌ట్లు టాక్‌. బీజేపీ ఆఫ‌ర్‌ను వాడుకుని ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని గ‌వ‌ర్న‌ర్ చేయాల‌ని బాబు అనుకుంటున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందో చూడాలి.

This post was last modified on June 14, 2024 6:01 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

14 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago