టీడీపీకి అంతా హ్యాపీనే! జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవసరముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మరింత పెంచుతూ ఆ పార్టీ నాయకుల్లో ఒకరిని గవర్నర్గా చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ సూచించిన నాయకుడికి గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నాయకులు అశోక్గజపతి రాజు, యనమల రామకృష్ణుడిలో ఒకరిని గవర్నర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతల వారసురాళ్లు ఈ సారి ఎన్నికల్లో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
యనమల కుమార్తె దివ్య, అశోక్గజపతి తనయ అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్లలో ఏ ఒక్కరికి కూడా బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా పని చేశారు. మరోవైపు అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ పదవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్నట్లు టాక్. బీజేపీ ఆఫర్ను వాడుకుని ఈ ఇద్దరిలో ఒకరిని గవర్నర్ చేయాలని బాబు అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2024 6:01 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…