టీడీపీకి అంతా హ్యాపీనే! జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవసరముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మరింత పెంచుతూ ఆ పార్టీ నాయకుల్లో ఒకరిని గవర్నర్గా చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ సూచించిన నాయకుడికి గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నాయకులు అశోక్గజపతి రాజు, యనమల రామకృష్ణుడిలో ఒకరిని గవర్నర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతల వారసురాళ్లు ఈ సారి ఎన్నికల్లో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
యనమల కుమార్తె దివ్య, అశోక్గజపతి తనయ అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్లలో ఏ ఒక్కరికి కూడా బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా పని చేశారు. మరోవైపు అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ పదవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్నట్లు టాక్. బీజేపీ ఆఫర్ను వాడుకుని ఈ ఇద్దరిలో ఒకరిని గవర్నర్ చేయాలని బాబు అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2024 6:01 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…