టీడీపీకి అంతా హ్యాపీనే! జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవసరముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మరింత పెంచుతూ ఆ పార్టీ నాయకుల్లో ఒకరిని గవర్నర్గా చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ సూచించిన నాయకుడికి గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నాయకులు అశోక్గజపతి రాజు, యనమల రామకృష్ణుడిలో ఒకరిని గవర్నర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతల వారసురాళ్లు ఈ సారి ఎన్నికల్లో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
యనమల కుమార్తె దివ్య, అశోక్గజపతి తనయ అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్లలో ఏ ఒక్కరికి కూడా బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా పని చేశారు. మరోవైపు అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ పదవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్నట్లు టాక్. బీజేపీ ఆఫర్ను వాడుకుని ఈ ఇద్దరిలో ఒకరిని గవర్నర్ చేయాలని బాబు అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2024 6:01 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…