టీడీపీకి అంతా హ్యాపీనే! జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవసరముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మరింత పెంచుతూ ఆ పార్టీ నాయకుల్లో ఒకరిని గవర్నర్గా చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
టీడీపీ సూచించిన నాయకుడికి గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నాయకులు అశోక్గజపతి రాజు, యనమల రామకృష్ణుడిలో ఒకరిని గవర్నర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతల వారసురాళ్లు ఈ సారి ఎన్నికల్లో విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
యనమల కుమార్తె దివ్య, అశోక్గజపతి తనయ అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్లలో ఏ ఒక్కరికి కూడా బాబు మంత్రి పదవి ఇవ్వలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు మంత్రిగా పని చేశారు. మరోవైపు అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరికి గవర్నర్ పదవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్నట్లు టాక్. బీజేపీ ఆఫర్ను వాడుకుని ఈ ఇద్దరిలో ఒకరిని గవర్నర్ చేయాలని బాబు అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…