Political News

ఈ టీడీపీ సీనియ‌ర్ల‌లో ఒక‌రికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు!

టీడీపీకి అంతా హ్యాపీనే! జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వంలో టీడీపీ కీల‌క పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవ‌స‌ర‌ముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మ‌రింత పెంచుతూ ఆ పార్టీ నాయ‌కుల్లో ఒక‌రిని గ‌వ‌ర్న‌ర్‌గా చేసే అవ‌కాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్న‌ట్లు తెలిసింది.

టీడీపీ సూచించిన నాయ‌కుడికి గ‌వ‌ర్న‌ర్ పోస్టు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు అశోక్‌గ‌జ‌ప‌తి రాజు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిలో ఒక‌రిని గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి నేత‌ల వార‌సురాళ్లు ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే.

య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌, అశోక్‌గ‌జ‌ప‌తి త‌న‌య అదితి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వీళ్ల‌లో ఏ ఒక్క‌రికి కూడా బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వంలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మంత్రిగా ప‌ని చేశారు. మ‌రోవైపు అశోక్ గ‌జ‌ప‌తి రాజు కేంద్ర‌మంత్రిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ ఇద్ద‌రిలో ఒక‌రికి గ‌వ‌ర్న‌ర్ ప‌దవిని ఇచ్చేలా బాబు ఆలోచిస్తున్న‌ట్లు టాక్‌. బీజేపీ ఆఫ‌ర్‌ను వాడుకుని ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని గ‌వ‌ర్న‌ర్ చేయాల‌ని బాబు అనుకుంటున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందో చూడాలి.

This post was last modified on June 14, 2024 6:01 pm

Share

Recent Posts

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…

2 hours ago

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

3 hours ago

మడమ తిప్పిన విజయ సాయిరెడ్డి… కొత్త పార్టీ రెడీ!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న…

3 hours ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

3 hours ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

5 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

6 hours ago