Political News

జగన్ వైఫల్యం గుర్తుకు రావట్లేదా?

నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయంతో అధికారంలోకి రావడం ఆలస్యం.. ప్రతిపక్ష పాత్రలోకి మారిన వైసీపీ టార్గెట్ ఏంటో స్పష్టం చేసేసింది.

చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చూడాలని.. కాని పక్షంలో దాని మీదే రాజకీయం చేయాలని వైసీపీ మద్దతుదారులు ఫిక్సయిపోయారు. నిజానికి దానికి మించిన రాజకీయ ఎజెండా కూడా ఆ పార్టీకి ఏమీ లేదు.

టీడీపీ వాళ్లు చేస్తున్న ప్రతీకార దాడుల మీద కూడా ఎక్కువ రోజులు రాజకీయం నడిపే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో అందరికీ తెలుసు.

అప్పుడు టీడీపీ వాళ్ల గోడును ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్లదీ అదే పరిస్థితి. అందుకే కొత్త ప్రభుత్వం హామీలు నెరవేర్చడం మీద ఫోకస్ చేయడానికి వైసీపీ సైన్యం సిద్ధమైపోయింది.

కానీ అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెడతానన్న చంద్రబాబు.. ప్రమాణ స్వీకారం రోజు ఆ పని చేయలేదంటూ ఒక రోజంతా గగ్గోలు పెట్టారు. కానీ బాబు తర్వాతి రోజే ఆ పని చేసేశారు. దీంతో వైసీపీ వాళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. కానీ వాళ్లేమీ రాజకీయం ఆపలేదు.

మెగా డీఎస్సీ అని చెప్పి 16 వేల ఉద్యోగాల భర్తీనే చేయబోతున్నారని.. రాష్ట్రంలో 50 వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉంటే, 16 వేలు మాత్రమే భర్తీ చేస్తారా అంటూ గొడవ మొదలుపెట్టారు. కానీ ఒకేసారి 16 వేల టీచర్ పోస్టుల భర్తీ అంటే చిన్న విషయం కాదు. ఇది కచ్చితంగా పెద్ద నంబరే. ఇది నిజంగా ‘మెగా’ డీఎస్సీనే.

ఒకేసారి 50 వేల టీచర్ పోస్టుల భర్తీ అంటే అసాధ్యమైన విషయం. ఒకవైపు ఐదేళ్ల వ్యవధిలో అసలు డీఎస్సీనే ప్రకటించకుండా ఒక్క పోస్టు భర్తీ చేయకుండా కాలం గడిపేసింది జగన్ సర్కారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్కసారిగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే అందరికీ జగన్ వైఫల్యం గుర్తుకొస్తుంటే.. వైసీపీ వాళ్లు మాత్రం ఆ వైఫల్యాన్ని మరిచిపోయి బాబు నెరవేరుస్తున్న హామీలో లోపాలు వెతకడం విడ్డూరం.

This post was last modified on June 14, 2024 2:52 pm

Share

Recent Posts

వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి…

8 minutes ago

ఈ ట్రంపు మాకొద్దు… బాబోయ్‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మ‌ధ్యంతర ఎన్నిక‌ల సెగ భారీగా త‌గిలేలా క‌నిపిస్తోంది. మ‌ధ్యంతర ఎన్నిక‌లు వ‌చ్చే అక్టోబ‌రు-న‌వంబ‌రు మాసాల…

58 minutes ago

బుచ్చిబాబు ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయంటే

పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి…

3 hours ago

సిద్దు సుమంత్ ఇద్దరికీ పనవ్వాలి

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ కంటెంట్…

3 hours ago

H-1B ఉద్యోగి కోసం అదనపు ఫీజా… అమెరికా ప్లాన్ ఏంటి?

అమెరికాలో H-1B వీసాపై విదేశీ ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీలు భారీగా అదనపు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రతి H-1B…

3 hours ago

రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం… కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన…

4 hours ago