Political News

700 కోట్లు మింగేసిన గొర్రెలు? ఈడీ కేసు

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గొర్రెల పంపిణీ వ్య‌వ‌హారం.. వివాదంగా మారింది. ఈ పంపిణీ ప‌థ‌కంలో అవినీతి చోటు చేసుకుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో ఏసీబీ అధికారులు దీనిపై గ‌త నెల రోజులుగా సైలెంట్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో వారు జ‌రిపిన విచార‌ణ సంచ‌ల‌నంగా మారి.. గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో ఏకంగా 700 కోట్ల రూపాయ‌ల మేర‌కు మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిన‌ట్టు గుర్తించారు.

ఆవెంట‌నే కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ)కి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్న‌ట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం అధికారి ఒక‌రు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంట‌నే ఏసీబీ న‌మోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారుల కూడా ప్రాథ‌మికంగా కేసును న‌మోదు చేశారు.

ప్ర‌స్తుతం విచార‌ణ‌ను కూడా ఈడీ అధికారులు ప్రారంభించారు. మనీలాండరింగ్ చట్టం కింద, ఈసీఐ ఆర్ నమోదు చేశారు. ఈ కుంభ‌కోణ‌లో ప‌ది మంది పాత్ర ఉన్న‌ట్టు ప్రాథ‌మికంగా ఏసీబీ అధికారులు గుర్తిం చారు. వీరిలో ఇద్ద‌రు మాజీ మంత్రుల కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆయా వివ‌రాల‌ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నేత‌లు మౌనంగా ఉన్నారు.

ఏంటీ ప‌థ‌కం..

బీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అప్ప‌టి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని ప‌శుపాల‌కుల‌కు.. గొర్రెల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీ, మ‌హారాష్ట్ర స‌హా ఐదు రాష్ట్రాల నుంచి నాణ్య‌మైన గొర్రెల‌ను కొనుగోలు చేసి..తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలో భారీ ఎత్తున సొమ్ములు.. దోచుకున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే తెలంగాణ ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఏసీబీని రంగంలోకి దించ‌గా.. రూ.700 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు ప్రాధమికంగా గుర్తించారు.

This post was last modified on June 14, 2024 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…

23 minutes ago

మట్కాని చూపించే పద్దతి ఇది

మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…

4 hours ago

ఆదివారం పరీక్షలో విజేత ఎవరు

నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…

4 hours ago

ధనుష్ కర… భలే ఛాన్స్ దొరికెరా

సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…

5 hours ago

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు…

12 hours ago

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ…

14 hours ago