Political News

700 కోట్లు మింగేసిన గొర్రెలు? ఈడీ కేసు

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గొర్రెల పంపిణీ వ్య‌వ‌హారం.. వివాదంగా మారింది. ఈ పంపిణీ ప‌థ‌కంలో అవినీతి చోటు చేసుకుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో ఏసీబీ అధికారులు దీనిపై గ‌త నెల రోజులుగా సైలెంట్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో వారు జ‌రిపిన విచార‌ణ సంచ‌ల‌నంగా మారి.. గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో ఏకంగా 700 కోట్ల రూపాయ‌ల మేర‌కు మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిన‌ట్టు గుర్తించారు.

ఆవెంట‌నే కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ)కి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్న‌ట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం అధికారి ఒక‌రు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంట‌నే ఏసీబీ న‌మోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారుల కూడా ప్రాథ‌మికంగా కేసును న‌మోదు చేశారు.

ప్ర‌స్తుతం విచార‌ణ‌ను కూడా ఈడీ అధికారులు ప్రారంభించారు. మనీలాండరింగ్ చట్టం కింద, ఈసీఐ ఆర్ నమోదు చేశారు. ఈ కుంభ‌కోణ‌లో ప‌ది మంది పాత్ర ఉన్న‌ట్టు ప్రాథ‌మికంగా ఏసీబీ అధికారులు గుర్తిం చారు. వీరిలో ఇద్ద‌రు మాజీ మంత్రుల కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆయా వివ‌రాల‌ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నేత‌లు మౌనంగా ఉన్నారు.

ఏంటీ ప‌థ‌కం..

బీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అప్ప‌టి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని ప‌శుపాల‌కుల‌కు.. గొర్రెల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీ, మ‌హారాష్ట్ర స‌హా ఐదు రాష్ట్రాల నుంచి నాణ్య‌మైన గొర్రెల‌ను కొనుగోలు చేసి..తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలో భారీ ఎత్తున సొమ్ములు.. దోచుకున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే తెలంగాణ ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఏసీబీని రంగంలోకి దించ‌గా.. రూ.700 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు ప్రాధమికంగా గుర్తించారు.

This post was last modified on June 14, 2024 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లోకేష్‌తో సినిమాపై తేల్చేసిన స్టార్ హీరో

కూలీ సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో.. ఎన్ని ఊహాగానాలు…

9 minutes ago

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

3 hours ago

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…

5 hours ago

మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…

6 hours ago

జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…

6 hours ago

తమ్మినేని తనయుడి పొలిటికల్ పాట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…

7 hours ago