Political News

700 కోట్లు మింగేసిన గొర్రెలు? ఈడీ కేసు

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గొర్రెల పంపిణీ వ్య‌వ‌హారం.. వివాదంగా మారింది. ఈ పంపిణీ ప‌థ‌కంలో అవినీతి చోటు చేసుకుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో ఏసీబీ అధికారులు దీనిపై గ‌త నెల రోజులుగా సైలెంట్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో వారు జ‌రిపిన విచార‌ణ సంచ‌ల‌నంగా మారి.. గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో ఏకంగా 700 కోట్ల రూపాయ‌ల మేర‌కు మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిన‌ట్టు గుర్తించారు.

ఆవెంట‌నే కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ)కి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్న‌ట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం అధికారి ఒక‌రు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంట‌నే ఏసీబీ న‌మోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారుల కూడా ప్రాథ‌మికంగా కేసును న‌మోదు చేశారు.

ప్ర‌స్తుతం విచార‌ణ‌ను కూడా ఈడీ అధికారులు ప్రారంభించారు. మనీలాండరింగ్ చట్టం కింద, ఈసీఐ ఆర్ నమోదు చేశారు. ఈ కుంభ‌కోణ‌లో ప‌ది మంది పాత్ర ఉన్న‌ట్టు ప్రాథ‌మికంగా ఏసీబీ అధికారులు గుర్తిం చారు. వీరిలో ఇద్ద‌రు మాజీ మంత్రుల కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆయా వివ‌రాల‌ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నేత‌లు మౌనంగా ఉన్నారు.

ఏంటీ ప‌థ‌కం..

బీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అప్ప‌టి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని ప‌శుపాల‌కుల‌కు.. గొర్రెల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీ, మ‌హారాష్ట్ర స‌హా ఐదు రాష్ట్రాల నుంచి నాణ్య‌మైన గొర్రెల‌ను కొనుగోలు చేసి..తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలో భారీ ఎత్తున సొమ్ములు.. దోచుకున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే తెలంగాణ ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఏసీబీని రంగంలోకి దించ‌గా.. రూ.700 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు ప్రాధమికంగా గుర్తించారు.

This post was last modified on June 14, 2024 10:35 am

Share

Recent Posts

ఫౌజీ లో నేతాజీ పాత్ర కనిపిస్తుందా?

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న 'ఫౌజీ' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల…

56 minutes ago

స్టార్ల కోసం కథలా… కథ కోసం స్టార్లా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే…

4 hours ago

నాగార్జున ఒడిస్సీ లెక్కలు వింటారా

లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో…

4 hours ago

కిరణ్ అబ్బవరం అడుగులు ఎటువైపు

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కిరణ్ అబ్బవరం భారీ నమ్మకం పెట్టుకున్నాడు. క,…

6 hours ago

మహేష్ బాబు అన్న కొడుకు హిట్ కొట్టాలి!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య…

6 hours ago

అయోధ్య విరాళాల చోరీపై రాజకీయం ఒద్దు: సుప్రీం

అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది.…

6 hours ago