Political News

జ‌గ‌న్ మార‌లేదు.. బ్రో!

ఒక ఓట‌మి నాయ‌కుల్లో మార్పు తీసుకువ‌స్తుంది. ఒక పెద్ద ఘోర ప‌రాజ‌యం పార్టీల‌ను మార్పు దిశ‌గా అడుగులు వేయిస్తుంది. ఇది మ‌న‌కు 2019లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికి ఆ పార్టీ లో వ‌చ్చిన మేలిమి మార్పును క‌ళ్ల‌కు క‌డుతుంది.

అనేక మంది వివాదాస్ప‌ద నాయ‌కుల‌కు చంద్ర‌బాబు చెక్ పెట్టారు. త‌న‌ను తాను ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ చేసుకున్నారు. ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకున్నారు. త‌న ఆలోచ‌న‌ల‌కు విరుద్ధ‌మే అయినా.. ప్ర‌జ‌లు ఉచితాలు కోరుకుంటున్నార‌ని తెలుసుకుని వాటి వైపే ప‌య‌నించారు.

ఇక‌, ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొంటే త‌ప్ప‌.. విజ‌యం ద‌క్క‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేసుకున్నారు. దీంతో చంద్ర‌బాబు మారిన మ‌నిషిగా ముందుకు సాగారు. ఫ‌లితం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. కొంత త‌గ్గినా.. ఆయ‌న భారీగా నెగ్గారు. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో విజ‌యం ద‌క్కించుకున్నారు. ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్నారు. కేంద్రాన్ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా కూడా.. మార్పు దిశ‌గా వేసిన అడుగుల కార‌ణంగానే చంద్ర‌బాబుకు ల‌భించిన విజ‌యం.

ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన‌.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ కూడా.. ఇదే పంథాలో ప‌య‌నిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఆశ‌లు కూడా పెట్టుకున్నారు. తన త‌ప్పులు తెలుసు కుంటార‌ని ఆశించారు., వాటిని స‌రిదిద్దుకుని అడుగులు వేస్తూ..పార్టీని ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా ముందుకు సాగుతార‌ని కూడా కొంద‌రు అంచ‌నా వేసుకున్నారు. నిజానికి రాజ‌కీయాల్లో పార్టీలు.. నాయ‌కులు కూడా.. త‌మ త‌ప్పులు తెలుసుకుని ముందుకు సాగ‌డం.. వాటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ముఖ్యం.

కానీ, జ‌గ‌న్ ఆదిశ‌గా ఎక్క‌డా అడుగులు వేసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. తాజాగా ఆయ‌న త‌న పార్టీకి చెందిన ఎంఎల్‌సీల‌తో భేటీ అయ్యారు. సంఖ్యా బ‌లం అసెంబ్లీలో లేక‌పోయినా.. శాస‌న మండ‌లిలో ఉంద‌ని.. కాబ‌ట్టి ఇక్క‌డ గ‌ట్టిగా పోరాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఇదే స‌మ‌యంలో తాము చేసింది మంచేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఐదేళ్లు త‌మ పాల‌న అద్భుత మ‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ త‌న‌నే విశ్వ‌సిస్తున్నార‌ని కూడా చెప్పారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో వైసీపీ కంచుకోట‌లు క‌దిలిపోయాయ‌న్న విష‌యం తెలిసి కూడా.. ఇలా వ్యాఖ్యానించ‌డం చూస్తే.. జ‌గ‌న్ తెంప‌రి త‌నం ఏంటో అర్ధ‌మ‌వుతుంది.

ఓట‌మి త‌ర్వాత ఎంత పెద్ద పార్టీ అయినా.. ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటుంది. త‌ప్పులు స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కానీ, జ‌గ‌న్ లో మాత్రం మార్పు… ఆత్మ ప‌రిశీల‌న‌.. త‌ప్పులు వెతికి ప‌ట్టుకోవ‌డం వంటివి ఎక్క‌డా క‌నిపించ‌క‌పోగా.. త‌న పాల‌నకు త‌ను మ‌రోసారి మార్కులు వేసుకున్నారు.

ఇది పార్టీ అధినేత‌గా ఆయ‌న‌కు బాగానే ఉందేమో.. కానీ.. ప్ర‌జాస్వామ్యంలో ఒక‌సారి ప్ర‌జ‌లు ఇంతగా దూరం పెట్టాక‌.. మాత్రం మ‌రోసారి అదే బాట బాగుంద‌ని చెప్ప‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న‌ను తాను స‌రిచేసుకోవాల్సి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 14, 2024 10:32 am

Share
Show comments
Published by
Satya
Tags: FeatureJagan

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago