ఒక ఓటమి నాయకుల్లో మార్పు తీసుకువస్తుంది. ఒక పెద్ద ఘోర పరాజయం పార్టీలను మార్పు దిశగా అడుగులు వేయిస్తుంది. ఇది మనకు 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ.. ఇప్పటికి ఆ పార్టీ లో వచ్చిన మేలిమి మార్పును కళ్లకు కడుతుంది.
అనేక మంది వివాదాస్పద నాయకులకు చంద్రబాబు చెక్ పెట్టారు. తనను తాను ప్రజలకు మరింత చేరువ చేసుకున్నారు. ప్రజల నాడి పట్టుకున్నారు. తన ఆలోచనలకు విరుద్ధమే అయినా.. ప్రజలు ఉచితాలు కోరుకుంటున్నారని తెలుసుకుని వాటి వైపే పయనించారు.
ఇక, ఇతర పార్టీలను కలుపుకొంటే తప్ప.. విజయం దక్కడం సాధ్యం కాకపోవచ్చని అంచనా వేసుకున్నారు. దీంతో చంద్రబాబు మారిన మనిషిగా ముందుకు సాగారు. ఫలితం కళ్ల ముందు కనిపిస్తోంది. కొంత తగ్గినా.. ఆయన భారీగా నెగ్గారు. కనీ వినీ ఎరుగని రీతిలో విజయం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. కేంద్రాన్ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా కూడా.. మార్పు దిశగా వేసిన అడుగుల కారణంగానే చంద్రబాబుకు లభించిన విజయం.
ఇక, తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా.. ఇదే పంథాలో పయనిస్తారని అందరూ అనుకున్నారు. ఆశలు కూడా పెట్టుకున్నారు. తన తప్పులు తెలుసు కుంటారని ఆశించారు., వాటిని సరిదిద్దుకుని అడుగులు వేస్తూ..పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకు సాగుతారని కూడా కొందరు అంచనా వేసుకున్నారు. నిజానికి రాజకీయాల్లో పార్టీలు.. నాయకులు కూడా.. తమ తప్పులు తెలుసుకుని ముందుకు సాగడం.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం.
కానీ, జగన్ ఆదిశగా ఎక్కడా అడుగులు వేసినట్టు కనిపించడం లేదు. తాజాగా ఆయన తన పార్టీకి చెందిన ఎంఎల్సీలతో భేటీ అయ్యారు. సంఖ్యా బలం అసెంబ్లీలో లేకపోయినా.. శాసన మండలిలో ఉందని.. కాబట్టి ఇక్కడ గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో తాము చేసింది మంచేనని ఆయన చెప్పుకొచ్చారు. ఐదేళ్లు తమ పాలన అద్భుత మని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇప్పటికీ తననే విశ్వసిస్తున్నారని కూడా చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో వైసీపీ కంచుకోటలు కదిలిపోయాయన్న విషయం తెలిసి కూడా.. ఇలా వ్యాఖ్యానించడం చూస్తే.. జగన్ తెంపరి తనం ఏంటో అర్ధమవుతుంది.
ఓటమి తర్వాత ఎంత పెద్ద పార్టీ అయినా.. ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ, జగన్ లో మాత్రం మార్పు… ఆత్మ పరిశీలన.. తప్పులు వెతికి పట్టుకోవడం వంటివి ఎక్కడా కనిపించకపోగా.. తన పాలనకు తను మరోసారి మార్కులు వేసుకున్నారు.
ఇది పార్టీ అధినేతగా ఆయనకు బాగానే ఉందేమో.. కానీ.. ప్రజాస్వామ్యంలో ఒకసారి ప్రజలు ఇంతగా దూరం పెట్టాక.. మాత్రం మరోసారి అదే బాట బాగుందని చెప్పడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ తనను తాను సరిచేసుకోవాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 14, 2024 10:32 am
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…