ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేయగా.. అనంతరం.. మంత్రులతో భేటీ అయి.. భవిష్యత్తుపై వారితో చర్చించారు. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత.. గురువారం సాయంత్రం నాటికి విజయవాడకు తిరిగి వచ్చారు. ఇక్కడి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం.. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు సరిగ్గా పండితులు నిర్ణ యించిన ముహూర్తం 4.41 గంటలకు తన సీటులో ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం.. చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు.. ఐదు కీలక అంశాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఓ మంత్రి చంద్రబాబుకు బంగారు కలం బహుమతిగా అందించారు. దీంతోనే చంద్రబాబు సంతకాలు చేయడం గమనార్హం.
ఇవీ.. చంద్రబాబు సంతకాలు..
1. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.
2. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం
3. పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం
4. స్కిల్ సెన్సెస్ పై నాలుగో సంతకం.
5. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం
అమరావతిలో పూల పాన్పు!
ముఖ్యమంత్రి చంద్రబాబు.. సెక్రటేరియెట్కు వెళ్తున్న క్రమంలో అమరావతిలోని రాజధాని ప్రాంత రైతులు.. ఆయనకు పూల పాన్పు పరిచారు. రోడ్లపై దారి పొడవునా పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చంద్రబాబు కాన్వాయ్తో పాటు వచ్చారు. అందరికీ ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వచ్చారు.
This post was last modified on June 14, 2024 10:25 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…