చింతచచ్చినా పులువు చాదన్నట్టుగా ఉంది వైసీపీ వైఖరి. తాజాగా ఆ పార్టీ కీలక నాయకుడు, నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఉద్దేశించి ఆయన క్లాస్ వార్నింగ్ ఇచ్చారు.
వాస్తవానికి ఏపీలో వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. వైనాట్ 175 అన్న వైసీపీ.. కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇక, పార్లమెంటు స్థానాల్లోనూ కేవలం 4 చోట్ల గెలుపు గుర్రం ఎక్కడి.. బతిపోయాను అన్నట్టుగా మారిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీ నాయకుల దూకుడు అయితే తగ్గలేదు. తాజాగా సాయిరెడ్డి చేసిన హెచ్చరికల్లోనూ ఇదే టోన్ కనిపించింది.
బీజేపీకి మా అవసరం లేదని అనుకుంటే పొరపాటే అని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడు తూ.. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పండగ అయిపోయినట్టు కాదని అన్నారు. తమ అవసరం బీజేపీకి ఇంకా ఉంటుందని తెలిపారు.
రాజ్యసభలో టీడీపీ పనితీరు జీరో అని వ్యాఖ్యానించిన సాయిరెడ్డి.. తమకు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారని తెలపారు. రాజ్యసభలో బీజేపీ కి తమ మద్దతు అవసరం ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని క్లాస్ వార్నింగ్ ఇచ్చారు.
“లోక్ సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. వైసీపీకి రెండు సభల్లో కలిపి 15 మంది ఎంపీల బలం ఉంది. ఈ విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకుంటుందని అనుకుంటున్నాం. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ, రాజ్యసభ విషయానికి వచ్చేసరికి బీజేపీకి వైసీపీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి.
రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంటులో వాళ్లు టీడీపీపై ఎంత ఆధారపడతారో, వైసీపీపై రాజ్యసభలో అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది“ అని సాయిరెడ్డి తెలిపారు. అంతేకాదు.. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు గమనించే ఉంటారని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, లోకల్ లీడర్లు కూడా గుర్తు పెట్టుకోవాలని సాయిరెడ్డి సూచించారు. మరి ఈ క్లాస్ వార్నింగ్ పై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on June 13, 2024 8:21 am
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…