ఏపీలో కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు సర్కారుకు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. తొలుత ఆమె మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు అని తెలిపారు. అనంతరం జనసేన అధినేత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్కు కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఇక, మంత్రులను కూడా అభినందిం చారు.
అయితే.. ఇదే లేఖలో రెండు కీలక విషయాలను షర్మిల ప్రస్తావించారు. కేంద్రంలోని ఎన్డీయే తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాలను కాపాడాలని ఆమె విన్నివించారు.
ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించాలని ఆమె సూచించారు. ఇదేసమయంలో పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదని, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారని.. కాబట్టి వారి సమస్యలను కూడా పట్టించుకోవాలని షర్మిల కోరారు.
రైతులకు సాగునీరు సమస్యగా మారిందని.. రైతుల ఆవేదన ను కూడా పట్టించుకోవాలని సూచించారు. మరికొద్ది రోజుల్లోనే సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరారు.
ఇక, రెండో కీలక అంశంగా రాష్ట్రంలో కొందరు దుండగులు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారని.. రాజకీయ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని ఈ విధ్వంసాలను ఆపాలని షర్మిల కోరారు. “తక్షణమే ఈ దాడులను నిలువరిం చండి“ అని షర్మిల సూచించారు.
రాష్ట్రంలో ఎక్కడికక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఇది సరికాదని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పిన ఆమె.. ఇప్పటికైనా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని నిలువరించాలని సూచించారు. రాజకీయ దాడులకు ఇది సమయం కాదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిరక్షించాలని సూచించారు.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…