Political News

ఏపీ ప్ర‌భుత్వానికి ష‌ర్మిల లేఖ‌.. ఏమ‌న్నారంటే!

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన చంద్ర‌బాబు స‌ర్కారుకు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల బ‌హిరంగ లేఖ రాశారు. తొలుత ఆమె మంత్రివ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు అని తెలిపారు. అనంత‌రం జ‌న‌సేన అధినేత‌, మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్‌కు కూడా ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌, మంత్రుల‌ను కూడా అభినందిం చారు.

అయితే.. ఇదే లేఖ‌లో రెండు కీల‌క విష‌యాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు. కేంద్రంలోని ఎన్డీయే తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల‌ని ఆమె విన్నివించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను సాధించాల‌ని ఆమె సూచించారు. ఇదేస‌మ‌యంలో పోల‌వ‌రం  నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని సూచించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నార‌ని.. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోవాల‌ని ష‌ర్మిల కోరారు.

రైతులకు సాగునీరు స‌మ‌స్య‌గా మారింద‌ని.. రైతుల ఆవేద‌న ను కూడా ప‌ట్టించుకోవాల‌ని సూచించారు. మ‌రికొద్ది రోజుల్లోనే సాగు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కోరారు.

ఇక‌, రెండో కీల‌క అంశంగా రాష్ట్రంలో కొంద‌రు దుండ‌గులు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను ఎక్క‌డికక్క‌డ ధ్వంసం చేస్తున్నార‌ని.. రాజ‌కీయ ప్రతీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నార‌ని ఈ విధ్వంసాల‌ను ఆపాల‌ని ష‌ర్మిల కోరారు. “త‌క్ష‌ణ‌మే ఈ దాడుల‌ను నిలువ‌రిం చండి“ అని ష‌ర్మిల సూచించారు.

రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని తెలిపారు. ఇది స‌రికాద‌ని అన్నారు. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశార‌ని చెప్పిన ఆమె.. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితిని నిలువ‌రించాల‌ని సూచించారు. రాజ‌కీయ దాడుల‌కు ఇది స‌మ‌యం కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కూడా ప‌రిర‌క్షించాల‌ని సూచించారు. 

This post was last modified on June 13, 2024 8:20 am

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

24 minutes ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

1 hour ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

1 hour ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

2 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago