Political News

ఏపీ ప్ర‌భుత్వానికి ష‌ర్మిల లేఖ‌.. ఏమ‌న్నారంటే!

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన చంద్ర‌బాబు స‌ర్కారుకు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల బ‌హిరంగ లేఖ రాశారు. తొలుత ఆమె మంత్రివ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు అని తెలిపారు. అనంత‌రం జ‌న‌సేన అధినేత‌, మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్‌కు కూడా ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌, మంత్రుల‌ను కూడా అభినందిం చారు.

అయితే.. ఇదే లేఖ‌లో రెండు కీల‌క విష‌యాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు. కేంద్రంలోని ఎన్డీయే తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల‌ని ఆమె విన్నివించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను సాధించాల‌ని ఆమె సూచించారు. ఇదేస‌మ‌యంలో పోల‌వ‌రం  నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని సూచించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నార‌ని.. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోవాల‌ని ష‌ర్మిల కోరారు.

రైతులకు సాగునీరు స‌మ‌స్య‌గా మారింద‌ని.. రైతుల ఆవేద‌న ను కూడా ప‌ట్టించుకోవాల‌ని సూచించారు. మ‌రికొద్ది రోజుల్లోనే సాగు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కోరారు.

ఇక‌, రెండో కీల‌క అంశంగా రాష్ట్రంలో కొంద‌రు దుండ‌గులు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను ఎక్క‌డికక్క‌డ ధ్వంసం చేస్తున్నార‌ని.. రాజ‌కీయ ప్రతీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నార‌ని ఈ విధ్వంసాల‌ను ఆపాల‌ని ష‌ర్మిల కోరారు. “త‌క్ష‌ణ‌మే ఈ దాడుల‌ను నిలువ‌రిం చండి“ అని ష‌ర్మిల సూచించారు.

రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని తెలిపారు. ఇది స‌రికాద‌ని అన్నారు. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశార‌ని చెప్పిన ఆమె.. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితిని నిలువ‌రించాల‌ని సూచించారు. రాజ‌కీయ దాడుల‌కు ఇది స‌మ‌యం కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కూడా ప‌రిర‌క్షించాల‌ని సూచించారు. 

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

8 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

9 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

11 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

12 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

13 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

14 hours ago