ఏపీలో కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు సర్కారుకు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. తొలుత ఆమె మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు అని తెలిపారు. అనంతరం జనసేన అధినేత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్కు కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఇక, మంత్రులను కూడా అభినందిం చారు.
అయితే.. ఇదే లేఖలో రెండు కీలక విషయాలను షర్మిల ప్రస్తావించారు. కేంద్రంలోని ఎన్డీయే తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాలను కాపాడాలని ఆమె విన్నివించారు.
ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించాలని ఆమె సూచించారు. ఇదేసమయంలో పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏమీ బాగోలేదని, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారని.. కాబట్టి వారి సమస్యలను కూడా పట్టించుకోవాలని షర్మిల కోరారు.
రైతులకు సాగునీరు సమస్యగా మారిందని.. రైతుల ఆవేదన ను కూడా పట్టించుకోవాలని సూచించారు. మరికొద్ది రోజుల్లోనే సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరారు.
ఇక, రెండో కీలక అంశంగా రాష్ట్రంలో కొందరు దుండగులు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారని.. రాజకీయ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని ఈ విధ్వంసాలను ఆపాలని షర్మిల కోరారు. “తక్షణమే ఈ దాడులను నిలువరిం చండి“ అని షర్మిల సూచించారు.
రాష్ట్రంలో ఎక్కడికక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఇది సరికాదని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పిన ఆమె.. ఇప్పటికైనా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని నిలువరించాలని సూచించారు. రాజకీయ దాడులకు ఇది సమయం కాదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిరక్షించాలని సూచించారు.
This post was last modified on June 13, 2024 8:20 am
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…