Political News

ఏపీ ప్ర‌భుత్వానికి ష‌ర్మిల లేఖ‌.. ఏమ‌న్నారంటే!

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన చంద్ర‌బాబు స‌ర్కారుకు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల బ‌హిరంగ లేఖ రాశారు. తొలుత ఆమె మంత్రివ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు అని తెలిపారు. అనంత‌రం జ‌న‌సేన అధినేత‌, మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్‌కు కూడా ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌, మంత్రుల‌ను కూడా అభినందిం చారు.

అయితే.. ఇదే లేఖ‌లో రెండు కీల‌క విష‌యాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు. కేంద్రంలోని ఎన్డీయే తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల‌ని ఆమె విన్నివించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను సాధించాల‌ని ఆమె సూచించారు. ఇదేస‌మ‌యంలో పోల‌వ‌రం  నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని సూచించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నార‌ని.. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోవాల‌ని ష‌ర్మిల కోరారు.

రైతులకు సాగునీరు స‌మ‌స్య‌గా మారింద‌ని.. రైతుల ఆవేద‌న ను కూడా ప‌ట్టించుకోవాల‌ని సూచించారు. మ‌రికొద్ది రోజుల్లోనే సాగు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కోరారు.

ఇక‌, రెండో కీల‌క అంశంగా రాష్ట్రంలో కొంద‌రు దుండ‌గులు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను ఎక్క‌డికక్క‌డ ధ్వంసం చేస్తున్నార‌ని.. రాజ‌కీయ ప్రతీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నార‌ని ఈ విధ్వంసాల‌ను ఆపాల‌ని ష‌ర్మిల కోరారు. “త‌క్ష‌ణ‌మే ఈ దాడుల‌ను నిలువ‌రిం చండి“ అని ష‌ర్మిల సూచించారు.

రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని తెలిపారు. ఇది స‌రికాద‌ని అన్నారు. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశార‌ని చెప్పిన ఆమె.. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితిని నిలువ‌రించాల‌ని సూచించారు. రాజ‌కీయ దాడుల‌కు ఇది స‌మ‌యం కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కూడా ప‌రిర‌క్షించాల‌ని సూచించారు. 

This post was last modified on June 13, 2024 8:20 am

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

3 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

4 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

8 hours ago