ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను…’’ అని చంద్రబాబు అనగానే సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. చంద్రబాబు నాలుగో సారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.
అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని మీ వెనుక నేనున్నాను అని చంద్రబాబు వెన్ను తట్టారు. చంద్రబాబుతోపాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు దక్కాయన్న విషయంపై ఈ రోజు రాత్రి లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత ఈటల రాజేందర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి రమ్య, మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్, దర్శకుడు క్రిష్, హీరో నిఖిల్, మెగా కుటుంబ సభ్యులు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…