ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను…’’ అని చంద్రబాబు అనగానే సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. చంద్రబాబు నాలుగో సారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.
అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని మీ వెనుక నేనున్నాను అని చంద్రబాబు వెన్ను తట్టారు. చంద్రబాబుతోపాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు దక్కాయన్న విషయంపై ఈ రోజు రాత్రి లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత ఈటల రాజేందర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి రమ్య, మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్, దర్శకుడు క్రిష్, హీరో నిఖిల్, మెగా కుటుంబ సభ్యులు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
This post was last modified on June 12, 2024 11:57 am
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…