చంద్రబాబు కేబినెట్లో ఎస్సీ కోటాలో మంత్రి పీఠం దక్కించుకున్న వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న అనితకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలోనే ఇవ్వాలని అను కున్నా.. కుదరలేదు. ఇక, గత ఐదేళ్లలో అనిత పార్టీపరంగా దూకుడు ప్రదర్శించారు. వైసీపీ సర్కారుపై నేరుగా నే కాకుండా.. న్యాయ పోరాటాలతోనూ ఆమె విజృంభించారు. దీనికితోడు బలమైన వాయిస్ కూడా వినిపించారు. ఈ పరిణామాలు ఆమెకు కలిసివచ్చాయి.
కాగా, గతంలో 2012 వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత 2013లో రాజకీయ అరంగే ట్రం చేశారు. తొలిసారి పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ, అవకాశం చిక్కలేదు కొంత నిరాశకు గురైనా.. ఆమె పార్టీ తరఫున ప్రచారం చేయడం లోనూ.. సర్కారుకు దన్నుగా ఉండడంలో కీలక రోల్ పోషించారు.
అయితే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆమె అసెంబ్లీలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు. ఆమె తన బలమైన వాయిస్ను వినిపించారు. అయితే 2019లో నియోజకవర్గం మార్పు చేశారు. దీంతో కొవ్వూరు నుంచి అనిత పోటీ చేశారు. అయితే.. అప్పట్లో ఆమె ఓడిపోయారు. అనితపై మాజీ హోం మంత్రి తానేటి వనిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడినా కూడా.. తన పంథాను ముందుకు సాగించారు. దీనికి తోడు చంద్రబాబు తెలుగు మహిళ రాష్ట్ర చీఫ్ పదవికి ఆమెను ఎంపిక చేశారు.
అనంతరం.. ఆమె తన పాత నియజకవర్గం పాయకరావు పేటకు వెళ్లిపోయారు. తాజా ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్నారు. మొత్తంగా గతంలో టీచర్ వృత్తిని వదిలి.. బయటకు వచ్చిన అనిత ఇప్పుడు పదేళ్ల తర్వాత.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
This post was last modified on June 12, 2024 12:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…