చంద్రబాబు కేబినెట్లో ఎస్సీ కోటాలో మంత్రి పీఠం దక్కించుకున్న వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న అనితకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలోనే ఇవ్వాలని అను కున్నా.. కుదరలేదు. ఇక, గత ఐదేళ్లలో అనిత పార్టీపరంగా దూకుడు ప్రదర్శించారు. వైసీపీ సర్కారుపై నేరుగా నే కాకుండా.. న్యాయ పోరాటాలతోనూ ఆమె విజృంభించారు. దీనికితోడు బలమైన వాయిస్ కూడా వినిపించారు. ఈ పరిణామాలు ఆమెకు కలిసివచ్చాయి.
కాగా, గతంలో 2012 వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత 2013లో రాజకీయ అరంగే ట్రం చేశారు. తొలిసారి పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ, అవకాశం చిక్కలేదు కొంత నిరాశకు గురైనా.. ఆమె పార్టీ తరఫున ప్రచారం చేయడం లోనూ.. సర్కారుకు దన్నుగా ఉండడంలో కీలక రోల్ పోషించారు.
అయితే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆమె అసెంబ్లీలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు. ఆమె తన బలమైన వాయిస్ను వినిపించారు. అయితే 2019లో నియోజకవర్గం మార్పు చేశారు. దీంతో కొవ్వూరు నుంచి అనిత పోటీ చేశారు. అయితే.. అప్పట్లో ఆమె ఓడిపోయారు. అనితపై మాజీ హోం మంత్రి తానేటి వనిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడినా కూడా.. తన పంథాను ముందుకు సాగించారు. దీనికి తోడు చంద్రబాబు తెలుగు మహిళ రాష్ట్ర చీఫ్ పదవికి ఆమెను ఎంపిక చేశారు.
అనంతరం.. ఆమె తన పాత నియజకవర్గం పాయకరావు పేటకు వెళ్లిపోయారు. తాజా ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్నారు. మొత్తంగా గతంలో టీచర్ వృత్తిని వదిలి.. బయటకు వచ్చిన అనిత ఇప్పుడు పదేళ్ల తర్వాత.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
This post was last modified on June 12, 2024 12:04 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…