చంద్రబాబు కేబినెట్లో ఎస్సీ కోటాలో మంత్రి పీఠం దక్కించుకున్న వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న అనితకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలోనే ఇవ్వాలని అను కున్నా.. కుదరలేదు. ఇక, గత ఐదేళ్లలో అనిత పార్టీపరంగా దూకుడు ప్రదర్శించారు. వైసీపీ సర్కారుపై నేరుగా నే కాకుండా.. న్యాయ పోరాటాలతోనూ ఆమె విజృంభించారు. దీనికితోడు బలమైన వాయిస్ కూడా వినిపించారు. ఈ పరిణామాలు ఆమెకు కలిసివచ్చాయి.
కాగా, గతంలో 2012 వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత 2013లో రాజకీయ అరంగే ట్రం చేశారు. తొలిసారి పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ, అవకాశం చిక్కలేదు కొంత నిరాశకు గురైనా.. ఆమె పార్టీ తరఫున ప్రచారం చేయడం లోనూ.. సర్కారుకు దన్నుగా ఉండడంలో కీలక రోల్ పోషించారు.
అయితే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆమె అసెంబ్లీలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు. ఆమె తన బలమైన వాయిస్ను వినిపించారు. అయితే 2019లో నియోజకవర్గం మార్పు చేశారు. దీంతో కొవ్వూరు నుంచి అనిత పోటీ చేశారు. అయితే.. అప్పట్లో ఆమె ఓడిపోయారు. అనితపై మాజీ హోం మంత్రి తానేటి వనిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడినా కూడా.. తన పంథాను ముందుకు సాగించారు. దీనికి తోడు చంద్రబాబు తెలుగు మహిళ రాష్ట్ర చీఫ్ పదవికి ఆమెను ఎంపిక చేశారు.
అనంతరం.. ఆమె తన పాత నియజకవర్గం పాయకరావు పేటకు వెళ్లిపోయారు. తాజా ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్నారు. మొత్తంగా గతంలో టీచర్ వృత్తిని వదిలి.. బయటకు వచ్చిన అనిత ఇప్పుడు పదేళ్ల తర్వాత.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…