ఒక నాయకుడిని ప్రజలు నమ్మితే ఏం చేస్తారు? ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటారు…ఆయన పాలన కావాలని అనుక్షణం పరితపిస్తుంటారు…ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తుంటారు…ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే రోజు కోసం పరితపిస్తుంటారు…వారు కలలుగన్న క్షణం నిజమైన వేళ వారి ఆనందానికి అవధులుండవు..తమ అభిమాన, ఆరాధ్య నాయకుడు కళ్ల ముందు కనిపిస్తే వారి పరుగుకు పట్టపగ్గాలుండవు..
తన అభిమాన నాయకుడు, విజనరీ లీడర్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించగానే ఓ మహిళ ఆయన కాన్వాయ్ వెంట మండుటెండలో పరుగులు పెట్టింది…సార్ సార్ అంటూ…పట్టు వదలకుండా ఆయన కారు వెంబడి పరుగెట్టింది…ఆమెను చూసిన చంద్రబాబు కాన్వాయ్ ను ఆపి మరీ ఆమెను పలకరించారు.
భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా..చంద్రబాబు వారిని సున్నితంగా వారించి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాకుండా సామాన్య ప్రజలకు కూడా దారి పొడవునా చంద్రన్నకు ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే సమావేశం ముగించుకొని ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగు తీసింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు.
పరిగెత్తడం వల్ల గస పెడుతున్న ఆ మహిళను నెమ్మదించమని సూచించిన చంద్రబాబు…ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని, చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని ఎమోషనల్ గా చెప్పింది. చంద్రబాబు గెలుపు కోసం తాను చాలా కష్టపడ్డానని, తమ కష్టం ఫలించి తమ కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్ అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ కోరింది. అయితే, చంద్రబాబు సున్నితంగా వద్దని వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా మిమ్మల్ని చూడాలన్న తపనతో వచ్చాను అని నందిని చెప్పింది.
ముందు ఆసుపత్రికి వెళ్లు అని నందినికి చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని…. అవసరమైన వైద్యం, సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…