ఒక నాయకుడిని ప్రజలు నమ్మితే ఏం చేస్తారు? ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటారు…ఆయన పాలన కావాలని అనుక్షణం పరితపిస్తుంటారు…ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తుంటారు…ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే రోజు కోసం పరితపిస్తుంటారు…వారు కలలుగన్న క్షణం నిజమైన వేళ వారి ఆనందానికి అవధులుండవు..తమ అభిమాన, ఆరాధ్య నాయకుడు కళ్ల ముందు కనిపిస్తే వారి పరుగుకు పట్టపగ్గాలుండవు..
తన అభిమాన నాయకుడు, విజనరీ లీడర్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించగానే ఓ మహిళ ఆయన కాన్వాయ్ వెంట మండుటెండలో పరుగులు పెట్టింది…సార్ సార్ అంటూ…పట్టు వదలకుండా ఆయన కారు వెంబడి పరుగెట్టింది…ఆమెను చూసిన చంద్రబాబు కాన్వాయ్ ను ఆపి మరీ ఆమెను పలకరించారు.
భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా..చంద్రబాబు వారిని సున్నితంగా వారించి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాకుండా సామాన్య ప్రజలకు కూడా దారి పొడవునా చంద్రన్నకు ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే సమావేశం ముగించుకొని ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగు తీసింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు.
పరిగెత్తడం వల్ల గస పెడుతున్న ఆ మహిళను నెమ్మదించమని సూచించిన చంద్రబాబు…ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని, చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని ఎమోషనల్ గా చెప్పింది. చంద్రబాబు గెలుపు కోసం తాను చాలా కష్టపడ్డానని, తమ కష్టం ఫలించి తమ కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్ అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ కోరింది. అయితే, చంద్రబాబు సున్నితంగా వద్దని వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా మిమ్మల్ని చూడాలన్న తపనతో వచ్చాను అని నందిని చెప్పింది.
ముందు ఆసుపత్రికి వెళ్లు అని నందినికి చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని…. అవసరమైన వైద్యం, సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on June 11, 2024 7:06 pm
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఏ పెద్ద స్టార్ సినిమాకూ…
కియారా అద్వానీ.. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. అమ్మడు ఎలాంటి ఫోటోని పోస్ట్…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది.…
వైసీపీ కార్యకర్త, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. మూసీ నది…
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలు క్రికెట్ పరంగా మరింత హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. రెండు…