ఒక నాయకుడిని ప్రజలు నమ్మితే ఏం చేస్తారు? ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటారు…ఆయన పాలన కావాలని అనుక్షణం పరితపిస్తుంటారు…ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తుంటారు…ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే రోజు కోసం పరితపిస్తుంటారు…వారు కలలుగన్న క్షణం నిజమైన వేళ వారి ఆనందానికి అవధులుండవు..తమ అభిమాన, ఆరాధ్య నాయకుడు కళ్ల ముందు కనిపిస్తే వారి పరుగుకు పట్టపగ్గాలుండవు..
తన అభిమాన నాయకుడు, విజనరీ లీడర్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించగానే ఓ మహిళ ఆయన కాన్వాయ్ వెంట మండుటెండలో పరుగులు పెట్టింది…సార్ సార్ అంటూ…పట్టు వదలకుండా ఆయన కారు వెంబడి పరుగెట్టింది…ఆమెను చూసిన చంద్రబాబు కాన్వాయ్ ను ఆపి మరీ ఆమెను పలకరించారు.
భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా..చంద్రబాబు వారిని సున్నితంగా వారించి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాకుండా సామాన్య ప్రజలకు కూడా దారి పొడవునా చంద్రన్నకు ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే సమావేశం ముగించుకొని ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగు తీసింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు.
పరిగెత్తడం వల్ల గస పెడుతున్న ఆ మహిళను నెమ్మదించమని సూచించిన చంద్రబాబు…ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని, చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని ఎమోషనల్ గా చెప్పింది. చంద్రబాబు గెలుపు కోసం తాను చాలా కష్టపడ్డానని, తమ కష్టం ఫలించి తమ కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్ అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ కోరింది. అయితే, చంద్రబాబు సున్నితంగా వద్దని వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా మిమ్మల్ని చూడాలన్న తపనతో వచ్చాను అని నందిని చెప్పింది.
ముందు ఆసుపత్రికి వెళ్లు అని నందినికి చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని…. అవసరమైన వైద్యం, సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on June 11, 2024 7:06 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…