Political News

తన ప్రతాపం చూపించిన భారత్ !

ఇంతకాలానికి మన సైన్యాలు తూర్పు లడ్డాఖ్ లో పై చేయి సాధించింది. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయిన కారణంగా మన భూభాగంలోని చాలా ప్రాంతాలను డ్రాగన్ దేశం ఆక్రమించేసింది. అప్పటి నుండి ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఒక్క ఇంచుకూడా వెనక్కు జరగటానికి చైనా అంగీకరించలేదు. దాంతో మన సైన్యాలు కూడా ఆ భూభాగంపై ఆశలు వదిలేసుకుంది. అయితే హఠాత్తుగా గడచిన కొన్ని నెలలుగా సరిహద్దుల్లో మారిన పరిణామాల నేపధ్యంలో సరిహద్దులోని చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో కొంత భాగాన్ని మళ్ళీ మన సైన్యాలు చేజిక్కించుకున్నాయి. ప్రధానంగా తూర్పు లడ్డాఖ్ లోని చాల ప్రాంతాలు దశాబ్దాల తర్వాత మళ్ళీ మన వశం అయ్యాయి.

గడచిన మూడు వారాల్లో లడ్డాఖ్ ప్రాంతంలో ఉన్న 20 పర్వత ప్రాంతాలపై మన సైన్యాలు స్పష్టమైన పట్టుసాధించాయి. ఇందులో ఫింగర్స్ అని పిలుస్తున్న 8 పర్వతాలు చాలా కీలకమైనవి. ఈ ఫింగర్స్ పర్వతాలపైనే డ్రాగన్ తన సైన్యాలను మోహరించి భారత్ సైన్యం కదలికలను జాగ్రత్తగా గమనిస్తు చికాకులు కలిగిస్తోంది. చాలా ఎత్తుగా ఉండే ఈ ఎనిమిది పర్వతాలపైన మోహరించిన చైనా సైన్యం మన దేశ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు గమనించగలుగుతున్నాయి. దాని వల్ల మన సైన్యానికి సంవత్సరాల తరబడి అపరామైన నష్టం జరుగుతోంది.

గాల్వాన్ లోయలో మన సైన్యంపై చైనా సైన్యం దాడులు జరపటం, 20 మంది చనిపోయిన ఘటన తర్వాత నుండి మన సైన్యం కూడా డ్రాగన్ సైన్యంపై ఎదురుదాడులకు దిగింది. అప్పటి వరకు కేవలం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితమైన మనసైన్యాలు ఒక్కసారిగా ఎదురుదాడులు మొదలుపెట్టడంతోచైనా సైన్యాలు తట్టుకోలేకపోతున్నాయి. దాంతో మన సైన్యాలు రెచ్చిపోయి చైనా బలగాలను మెల్లమెల్లగా కబ్జా చేసిన మన భూభాగం నుండి తరిమేయటం మొదలుపెట్టాయి. ఈ నేపధ్యంలోనే చైనా సైన్యం వందల చదరపు కిలీమీటర్ల వెనక్కు వెళ్ళిపోయినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా దశాబ్దాల పాటు తమ ఆధీనంలోనే ఉంచుకున్న 20 పర్వత ప్రాంతాలనుండి డ్రాగన్ సైన్యం వెనక్కు వెళ్ళిపోవాల్సొచ్చింది. దాంతో మన సైన్యం వెంటనే యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను, క్షిపణి ప్రయోగాల లాంచిగ్ ప్యాడ్లను, హెలికాప్టర్లు దిగేందుకు అవసరమైన బేస్ లను ఏర్పాటు చేసేసుకుంది. అంటే ఏ మూలనుండి చైనా ఆక్రమణకు దిగినా వెంటనే మనకు తెలిసిపోతోంది. తన చేతిలో నుండి కీలకమైన పర్వత ప్రాంతాలు చేజారిపోయాయన్న ఉక్రోషంతోనే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుండి డ్రాగన్ సైన్యాలను తరిమేయటం మన సైన్యానికి ఓ లెక్కా. కాకపోతే కాస్త సమయం పడుతుందంతే.

This post was last modified on September 23, 2020 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

18 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

54 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago