ఆంధ్రప్రదేశ్ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకునే కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మధ్య ఎంతటి భావోద్వేగ అనుబంధం ఉందన్న విషయం అనూహ్యంగా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కటమే కాదు.. బాబు – పవన్ మధ్య ఉన్న బలమైన బంధం ఆవిష్క్రతమైంది. అసలేం జరిగిందంటే..
ఏపీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును కూటమి తరఫున తాను ప్రతిపాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ వెంటనే ఆ ప్రతిపాదనకు ఏకగీవ్రంగా ఆమోదం పలికారు. అనంతరం ఆనందంతో చంద్రబాబు పవన్ వద్దకు వచ్చారు. పవన్ ను చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఒకొరికొకరు అప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైనం అందరిని ఆకర్షించింది.
అనంతరం తిరిగి వెళుతున్న చంద్రబాబు చేతిని పట్టుకున్న పవన్ కల్యాణ్.. మైకు వద్దకు తీసుకెళ్లి.. “ఇది నేను ఆయన్ను పక్కన పెట్టుకొనే చెప్పాలి.. “ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన్ను. భువనేశ్వరి కన్నీళ్లుపెట్టుకుంటే చెప్పాను.. అమ్మా కన్నీళ్లు పెట్టుకోవద్దు. మంచిరోజులు వస్తాయని చెప్పాను. మంచి రోజులు వచ్చాయి. ఆయనకు మనస్ఫూర్తిగా (నొక్కి చెబుతూ) వారికి నా హ్రదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికి. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను” అని పవన్ చెప్పగా.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు తలను అంగీకారంగా ఊపారు. ఈ సందర్భంగా తన తలను కాస్త ముందుకు వంచి పవన్ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించి వెనుదిరిగారు. ఈ అనూహ్య సీన్ కూటమి నేతల మధ్య మరింత బలమైన భావోద్వేగ బంధానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమన్నట్లు కాకుండా.. అసలుసిసలు కూటమి బంధంగా ఈ వైనం కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…