ఆంధ్రప్రదేశ్ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకునే కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మధ్య ఎంతటి భావోద్వేగ అనుబంధం ఉందన్న విషయం అనూహ్యంగా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కటమే కాదు.. బాబు – పవన్ మధ్య ఉన్న బలమైన బంధం ఆవిష్క్రతమైంది. అసలేం జరిగిందంటే..
ఏపీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును కూటమి తరఫున తాను ప్రతిపాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ వెంటనే ఆ ప్రతిపాదనకు ఏకగీవ్రంగా ఆమోదం పలికారు. అనంతరం ఆనందంతో చంద్రబాబు పవన్ వద్దకు వచ్చారు. పవన్ ను చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఒకొరికొకరు అప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైనం అందరిని ఆకర్షించింది.
అనంతరం తిరిగి వెళుతున్న చంద్రబాబు చేతిని పట్టుకున్న పవన్ కల్యాణ్.. మైకు వద్దకు తీసుకెళ్లి.. “ఇది నేను ఆయన్ను పక్కన పెట్టుకొనే చెప్పాలి.. “ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన్ను. భువనేశ్వరి కన్నీళ్లుపెట్టుకుంటే చెప్పాను.. అమ్మా కన్నీళ్లు పెట్టుకోవద్దు. మంచిరోజులు వస్తాయని చెప్పాను. మంచి రోజులు వచ్చాయి. ఆయనకు మనస్ఫూర్తిగా (నొక్కి చెబుతూ) వారికి నా హ్రదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికి. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను” అని పవన్ చెప్పగా.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు తలను అంగీకారంగా ఊపారు. ఈ సందర్భంగా తన తలను కాస్త ముందుకు వంచి పవన్ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించి వెనుదిరిగారు. ఈ అనూహ్య సీన్ కూటమి నేతల మధ్య మరింత బలమైన భావోద్వేగ బంధానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమన్నట్లు కాకుండా.. అసలుసిసలు కూటమి బంధంగా ఈ వైనం కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 11, 2024 12:42 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…