వైసీపీలో నాయకుల ఫైరింగ్ పెరుగుతోంది. అధినేత జగన్ కేంద్రంగా నాయకులు నిప్పులు చెరుగుతు న్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణం.. జగన్ వైఖరేనని నాయకులు చెబుతున్నారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం తన అనుచరుల దగ్గర విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వైసీపీ కీలక నాయకుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పైగా.. టీడీపీ నుంచి తీసుకున్న నల్లగట్ల స్వామిదాసుకు జగన్ ఇక్కడి టికెట్ను ఇచ్చారు. అయినప్పటికీ.. ఇక్కడ వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్టానికి చేసింది శున్యం అని పరుషంగానే వ్యాఖ్యానించారు.
జగన్ కారణంగానే 2019-24 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తిరువూరు నియోజక వర్గ అభివృద్ధి చేయలేకపోయానని రక్షణ నిధి చెప్పారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు.. రహదారుల దుస్థితిని వివరించానని.. అయినా పట్టించుకోలేదన్నారు. తిరువూరు వచ్చి జగన్ ఇచ్చిన హామీలు నీట మునిగాయన్నారు. 2023 డిసెంబర్ నుంచి వైసిపికి దూరంగా వున్నానన్నారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి నట్టేట మునిగావు జగన్ అని అన్నారు.
“ప్రజల మధ్య తిరిగింది మేము. కనీసం మమ్మల్ని అడిగావా జగన్. నీ వల్ల రాష్టానికి ఒరిగింది ఏమి లేదు. కనీసం ఎప్పుడైనా ఎమ్మెల్యే లను గుర్తించావా జగన్. ఏ సమస్య చెప్పినా.. అధికారులకు చెప్పేవాడు. కానీ, వాళ్లు మమ్మల్ని పురుగుల మాదిరిగా తీసేశారు. 60 మంది సలహాదారులు ఈయనకు ఏం చెప్పారో.. ఈయన వారికి ఏం ఇచ్చారో.. మొత్తానికి పార్టీని బుట్టదాఖలు చేశారు” అని రక్షణ నిధి వ్యాఖ్యానించారు. గెలుచిన ఎమ్మెల్యే అభ్యర్ది కొలికపూడి. శ్రీనివాసరావు, ఎంపీ. అభ్యర్ది కేశినేని. శివ నాథ్ కు, కూటమి పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…