వైసీపీలో నాయకుల ఫైరింగ్ పెరుగుతోంది. అధినేత జగన్ కేంద్రంగా నాయకులు నిప్పులు చెరుగుతు న్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణం.. జగన్ వైఖరేనని నాయకులు చెబుతున్నారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం తన అనుచరుల దగ్గర విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వైసీపీ కీలక నాయకుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పైగా.. టీడీపీ నుంచి తీసుకున్న నల్లగట్ల స్వామిదాసుకు జగన్ ఇక్కడి టికెట్ను ఇచ్చారు. అయినప్పటికీ.. ఇక్కడ వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్టానికి చేసింది శున్యం అని పరుషంగానే వ్యాఖ్యానించారు.
జగన్ కారణంగానే 2019-24 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తిరువూరు నియోజక వర్గ అభివృద్ధి చేయలేకపోయానని రక్షణ నిధి చెప్పారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు.. రహదారుల దుస్థితిని వివరించానని.. అయినా పట్టించుకోలేదన్నారు. తిరువూరు వచ్చి జగన్ ఇచ్చిన హామీలు నీట మునిగాయన్నారు. 2023 డిసెంబర్ నుంచి వైసిపికి దూరంగా వున్నానన్నారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి నట్టేట మునిగావు జగన్ అని అన్నారు.
“ప్రజల మధ్య తిరిగింది మేము. కనీసం మమ్మల్ని అడిగావా జగన్. నీ వల్ల రాష్టానికి ఒరిగింది ఏమి లేదు. కనీసం ఎప్పుడైనా ఎమ్మెల్యే లను గుర్తించావా జగన్. ఏ సమస్య చెప్పినా.. అధికారులకు చెప్పేవాడు. కానీ, వాళ్లు మమ్మల్ని పురుగుల మాదిరిగా తీసేశారు. 60 మంది సలహాదారులు ఈయనకు ఏం చెప్పారో.. ఈయన వారికి ఏం ఇచ్చారో.. మొత్తానికి పార్టీని బుట్టదాఖలు చేశారు” అని రక్షణ నిధి వ్యాఖ్యానించారు. గెలుచిన ఎమ్మెల్యే అభ్యర్ది కొలికపూడి. శ్రీనివాసరావు, ఎంపీ. అభ్యర్ది కేశినేని. శివ నాథ్ కు, కూటమి పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on June 10, 2024 6:23 pm
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…