వైసీపీలో నాయకుల ఫైరింగ్ పెరుగుతోంది. అధినేత జగన్ కేంద్రంగా నాయకులు నిప్పులు చెరుగుతు న్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణం.. జగన్ వైఖరేనని నాయకులు చెబుతున్నారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం తన అనుచరుల దగ్గర విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వైసీపీ కీలక నాయకుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పైగా.. టీడీపీ నుంచి తీసుకున్న నల్లగట్ల స్వామిదాసుకు జగన్ ఇక్కడి టికెట్ను ఇచ్చారు. అయినప్పటికీ.. ఇక్కడ వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్టానికి చేసింది శున్యం అని పరుషంగానే వ్యాఖ్యానించారు.
జగన్ కారణంగానే 2019-24 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తిరువూరు నియోజక వర్గ అభివృద్ధి చేయలేకపోయానని రక్షణ నిధి చెప్పారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు.. రహదారుల దుస్థితిని వివరించానని.. అయినా పట్టించుకోలేదన్నారు. తిరువూరు వచ్చి జగన్ ఇచ్చిన హామీలు నీట మునిగాయన్నారు. 2023 డిసెంబర్ నుంచి వైసిపికి దూరంగా వున్నానన్నారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి నట్టేట మునిగావు జగన్ అని అన్నారు.
“ప్రజల మధ్య తిరిగింది మేము. కనీసం మమ్మల్ని అడిగావా జగన్. నీ వల్ల రాష్టానికి ఒరిగింది ఏమి లేదు. కనీసం ఎప్పుడైనా ఎమ్మెల్యే లను గుర్తించావా జగన్. ఏ సమస్య చెప్పినా.. అధికారులకు చెప్పేవాడు. కానీ, వాళ్లు మమ్మల్ని పురుగుల మాదిరిగా తీసేశారు. 60 మంది సలహాదారులు ఈయనకు ఏం చెప్పారో.. ఈయన వారికి ఏం ఇచ్చారో.. మొత్తానికి పార్టీని బుట్టదాఖలు చేశారు” అని రక్షణ నిధి వ్యాఖ్యానించారు. గెలుచిన ఎమ్మెల్యే అభ్యర్ది కొలికపూడి. శ్రీనివాసరావు, ఎంపీ. అభ్యర్ది కేశినేని. శివ నాథ్ కు, కూటమి పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on June 10, 2024 6:23 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…