ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మూలబడిన విషయం తెలిసిందే. ఒకప్పుడు నిలువెత్తు నిర్మాణాలు.. ఎటు చూసినా.. సందడి వాతావరణం నెలకొన్న అమరాతి ప్రాంతం జగన్ హయాంలో మాత్రం నిలువునా ఒణికి పోయింది. అయితే..రాష్ట్రంలో ప్రజలు అధికారం మార్పిడి చేయడం తో ఇప్పుడు రాజధానిలో కొత్త కళ కనిపిస్తోంది. ఎటు చూసినా.. పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, అడవిని తలపిస్తున్న ప్రాంతాలను కూడా.. తొలగించారు.
మరోవైపు… యుద్దప్రాతిపదికన.. స్మారక నిర్మాణాలను శుభ్రం చేస్తున్నారు. అప్పట్లో ప్రధాని మోడీ శంకు స్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసిన అలంకరిస్తున్నారు. ఇక, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా సుడిగాలి పర్యటన చేశారు. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెం లోని సీఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు.
తర్వాత అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయ భవనాలను, ఎంఎల్ఏల క్వార్టర్లు, ఏపీ ఎన్జీవో లనివాసం భవనాలు సముదాయాలను పరిశీలించారు. అదేవిధంగా హైకోర్టు ప్రాంతం తదితర చోట్ల సిఎస్ పరిశీలన చేశారు. దీంతో ఇక్కడ ఏదో అద్భుతాలు జరగనున్నాయనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఇక్కడి రైతులను అధికారికంగా ఆయన భేటీ అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా నిర్మాణ పనులను కూడా సాధ్యమైనంత వేగంగా చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ఇతరత్రా సదుపాయాలను కూడా వచ్చే ఆరు మాసాల్లోనే పూర్తి చేసి.. కోర్టుకు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. గతంలో వెళ్లిపోయిన సంస్థలను తిరిగి ఆహ్వానించనున్నట్టు తెలిసింది. అలాగే పనులు కూడా ప్రారంభించనున్నట్టు సమాచారం.
This post was last modified on June 10, 2024 7:06 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…