ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.. శనివారం తెల్లవారు జామున అస్తమించిన విషయం తెలి సిందే. దాదాపు 24 గంటలకు పైగానే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. అనంతరం ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియల ఘట్టం ప్రారంభమైంది. అంతిమ ఘట్టంలో టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ రుణం తీర్చుకున్నారు.
రామోజీ రావు పాడెను మోసిన చంద్రబాబు.. తుది ఘట్టంలోనూ.. ఆయన భౌతిక దేహాన్ని పట్టుకుని అం త్యక్రియల వేదికపైకి చేర్చారు. దీంతో 1994 నుంచి చంద్రబాబుతో ఉన్న రామోజీ బంధానికి ముగింపు పలికినట్టయింది. అయితే.. రామోజీ కుటుంబంతో బాబు సంబంధాలు కొనసాగుతాయి. కానీ, ఆ రేంజ్లో ఇకపై ఉండకపోవచ్చు. ఇదిలావుంటే,రామోజీ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు శనివారం ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబు ఆ రోజు రోజంతా కూడా.. అక్కడే ఉన్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు.. ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకో వడం మరో విశేషం. గతంలో అన్నగారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ మృతి చెందినప్పుడు కూడా.. బాబు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆయన పాడె కూడా మోశారు. ఇప్పుడు రామోజీరావు కడ క్రియల్లోనూ చంద్రబాబు తన పాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబుకు ఊపిరి సలపనంత పని ఉంది. అయినప్పటికీ.. తనను రాజకీయంగా ఆదుకున్న మీడియా మొఘల్కు నివాళులర్పించడంలో చంద్రబాబు అడుగు వెనక్కి వేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలు సమర్పించింది. పోలీసుల గౌరవ వందనం అనంతరం.. రామోజీ చితికి ఆయన పెద్దకుమారుడు నిప్పంటించారు.
This post was last modified on June 9, 2024 4:11 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…