ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.. శనివారం తెల్లవారు జామున అస్తమించిన విషయం తెలి సిందే. దాదాపు 24 గంటలకు పైగానే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. అనంతరం ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియల ఘట్టం ప్రారంభమైంది. అంతిమ ఘట్టంలో టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ రుణం తీర్చుకున్నారు.
రామోజీ రావు పాడెను మోసిన చంద్రబాబు.. తుది ఘట్టంలోనూ.. ఆయన భౌతిక దేహాన్ని పట్టుకుని అం త్యక్రియల వేదికపైకి చేర్చారు. దీంతో 1994 నుంచి చంద్రబాబుతో ఉన్న రామోజీ బంధానికి ముగింపు పలికినట్టయింది. అయితే.. రామోజీ కుటుంబంతో బాబు సంబంధాలు కొనసాగుతాయి. కానీ, ఆ రేంజ్లో ఇకపై ఉండకపోవచ్చు. ఇదిలావుంటే,రామోజీ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు శనివారం ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబు ఆ రోజు రోజంతా కూడా.. అక్కడే ఉన్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు.. ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకో వడం మరో విశేషం. గతంలో అన్నగారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ మృతి చెందినప్పుడు కూడా.. బాబు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆయన పాడె కూడా మోశారు. ఇప్పుడు రామోజీరావు కడ క్రియల్లోనూ చంద్రబాబు తన పాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబుకు ఊపిరి సలపనంత పని ఉంది. అయినప్పటికీ.. తనను రాజకీయంగా ఆదుకున్న మీడియా మొఘల్కు నివాళులర్పించడంలో చంద్రబాబు అడుగు వెనక్కి వేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలు సమర్పించింది. పోలీసుల గౌరవ వందనం అనంతరం.. రామోజీ చితికి ఆయన పెద్దకుమారుడు నిప్పంటించారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…