ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.. శనివారం తెల్లవారు జామున అస్తమించిన విషయం తెలి సిందే. దాదాపు 24 గంటలకు పైగానే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. అనంతరం ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియల ఘట్టం ప్రారంభమైంది. అంతిమ ఘట్టంలో టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ రుణం తీర్చుకున్నారు.
రామోజీ రావు పాడెను మోసిన చంద్రబాబు.. తుది ఘట్టంలోనూ.. ఆయన భౌతిక దేహాన్ని పట్టుకుని అం త్యక్రియల వేదికపైకి చేర్చారు. దీంతో 1994 నుంచి చంద్రబాబుతో ఉన్న రామోజీ బంధానికి ముగింపు పలికినట్టయింది. అయితే.. రామోజీ కుటుంబంతో బాబు సంబంధాలు కొనసాగుతాయి. కానీ, ఆ రేంజ్లో ఇకపై ఉండకపోవచ్చు. ఇదిలావుంటే,రామోజీ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు శనివారం ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబు ఆ రోజు రోజంతా కూడా.. అక్కడే ఉన్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు.. ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకో వడం మరో విశేషం. గతంలో అన్నగారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ మృతి చెందినప్పుడు కూడా.. బాబు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆయన పాడె కూడా మోశారు. ఇప్పుడు రామోజీరావు కడ క్రియల్లోనూ చంద్రబాబు తన పాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబుకు ఊపిరి సలపనంత పని ఉంది. అయినప్పటికీ.. తనను రాజకీయంగా ఆదుకున్న మీడియా మొఘల్కు నివాళులర్పించడంలో చంద్రబాబు అడుగు వెనక్కి వేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలు సమర్పించింది. పోలీసుల గౌరవ వందనం అనంతరం.. రామోజీ చితికి ఆయన పెద్దకుమారుడు నిప్పంటించారు.
This post was last modified on June 9, 2024 4:11 pm
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…