ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.. శనివారం తెల్లవారు జామున అస్తమించిన విషయం తెలి సిందే. దాదాపు 24 గంటలకు పైగానే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. అనంతరం ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియల ఘట్టం ప్రారంభమైంది. అంతిమ ఘట్టంలో టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ రుణం తీర్చుకున్నారు.
రామోజీ రావు పాడెను మోసిన చంద్రబాబు.. తుది ఘట్టంలోనూ.. ఆయన భౌతిక దేహాన్ని పట్టుకుని అం త్యక్రియల వేదికపైకి చేర్చారు. దీంతో 1994 నుంచి చంద్రబాబుతో ఉన్న రామోజీ బంధానికి ముగింపు పలికినట్టయింది. అయితే.. రామోజీ కుటుంబంతో బాబు సంబంధాలు కొనసాగుతాయి. కానీ, ఆ రేంజ్లో ఇకపై ఉండకపోవచ్చు. ఇదిలావుంటే,రామోజీ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు శనివారం ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబు ఆ రోజు రోజంతా కూడా.. అక్కడే ఉన్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు.. ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకో వడం మరో విశేషం. గతంలో అన్నగారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ మృతి చెందినప్పుడు కూడా.. బాబు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆయన పాడె కూడా మోశారు. ఇప్పుడు రామోజీరావు కడ క్రియల్లోనూ చంద్రబాబు తన పాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబుకు ఊపిరి సలపనంత పని ఉంది. అయినప్పటికీ.. తనను రాజకీయంగా ఆదుకున్న మీడియా మొఘల్కు నివాళులర్పించడంలో చంద్రబాబు అడుగు వెనక్కి వేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలు సమర్పించింది. పోలీసుల గౌరవ వందనం అనంతరం.. రామోజీ చితికి ఆయన పెద్దకుమారుడు నిప్పంటించారు.
This post was last modified on June 9, 2024 4:11 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…