కష్టానికి ఫలితం దక్కింది. తెలంగాణలో బీజేపీ దూకుడుకు.. ఆ పార్టీ విస్తరణకు కూడా… పెద్ద ఎత్తున కృషి చేసిన బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అలుపెరుగని పోరాటం చేస్తూ.. కేసీఆర్ గత సర్కారుపై నిప్పులు చెరగడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నూ.. సాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ.. కీలక రోల్తో ఆయన దూకుడు ప్రదర్శించారు. అదేవిధంగా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం విజయం దక్కించుకున్నారు. దీంతో ఈయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. ఇప్పటికే ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రావడంతో అక్కడే ఉన్న బండి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డికి కూడా.. మంత్రి పదవి దక్కింది. ఈయనకు కూడా.. కేంద్ర కేబినెట్ పదవే దక్కడం గమనార్హం.
వ్యూహం ప్రకారం చూస్తే.. 4 స్థానాలుగా ఉన్న తెలంగాణలో బీజేపీని 8 స్థానాలకు పరుగులు పెట్టించడం లోనూ.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరగడంలోనూ.. బండి కీలక పాత్ర పోషించారు.
పైగా మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం కూడా కలిసి వచ్చింది. రెడ్ల కోటాలో కిషన్ రెడ్డికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో మున్ముందు పార్టీ బలోపేతం అయ్యేందుకు.. ఈ ప్రయోగం ఫలిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on June 9, 2024 4:05 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…