కష్టానికి ఫలితం దక్కింది. తెలంగాణలో బీజేపీ దూకుడుకు.. ఆ పార్టీ విస్తరణకు కూడా… పెద్ద ఎత్తున కృషి చేసిన బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అలుపెరుగని పోరాటం చేస్తూ.. కేసీఆర్ గత సర్కారుపై నిప్పులు చెరగడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నూ.. సాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ.. కీలక రోల్తో ఆయన దూకుడు ప్రదర్శించారు. అదేవిధంగా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం విజయం దక్కించుకున్నారు. దీంతో ఈయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. ఇప్పటికే ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం రావడంతో అక్కడే ఉన్న బండి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డికి కూడా.. మంత్రి పదవి దక్కింది. ఈయనకు కూడా.. కేంద్ర కేబినెట్ పదవే దక్కడం గమనార్హం.
వ్యూహం ప్రకారం చూస్తే.. 4 స్థానాలుగా ఉన్న తెలంగాణలో బీజేపీని 8 స్థానాలకు పరుగులు పెట్టించడం లోనూ.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరగడంలోనూ.. బండి కీలక పాత్ర పోషించారు.
పైగా మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం కూడా కలిసి వచ్చింది. రెడ్ల కోటాలో కిషన్ రెడ్డికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో మున్ముందు పార్టీ బలోపేతం అయ్యేందుకు.. ఈ ప్రయోగం ఫలిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on June 9, 2024 4:05 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…