ఏపీలో వైసీపీ సర్కారు ఓటమి తర్వాత.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గుడివాడ మాజీఎమ్మెల్యే కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు.. తమ భూములు దోచుకున్నారంటూ.. పదుల సంఖ్యలో బాధితులు.. ఇప్పుడు అక్కడకు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న బాధితులు గెడ్డం గ్యాంగ్ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు.
టీడీపీ విజయంతో గెడ్డం గ్యాంగ్ అరాచకాలను ఎదిరిస్తున్నామని స్థానికులు చెబుతుండడం గమనార్హం. రెండు జెసిబిలతో కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను బాధితులు తొలగించారు. కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశారని వాపోయారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి. వేధించడమే కాకుండా తమపై దాడి చేయించారని వ్యాఖ్యనించారు.
న్యాయం కోసం పోలీసులను వేడుకున్నా.. పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. కోర్టులను ఆశ్రయించా మని.. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగామని చెప్పారు. అయినా తమకు న్యాయం దక్కలేదని, వెనిగం డ్ల రాము వల్లే నేడు తమకుకు న్యాయం జరిగిందని బాధితులు తెలిపారు. అందరినీ 420 అనే కొడాలి నాని అసలైన 420 అని బాధితులు ఆరోపించారు. కొడాలి నానీని గుడివాడ నుండి తరిమి కొడతామని హెచ్చరించారు. మరలా కొడాలి నానిని రాజకీయాల్లోకి రాకుండా చేస్తామని బాధితులు తెలిపారు.
ఆశలు వదిలేసుకున్న తరుణంలో తమ పాలిట దైవంలా వెనుగండ్ల రాము అండగా నిలబడ్డారని బాధితులు చెప్పడం గమనార్హం. ఇటువంటి నాయకులు గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నామని బాధితులు పేర్కొన్నారు. రాము ఎమ్మెల్యే గా ఉన్నంతకాలం గుడివాడకు అంత మంచే జరుగుతుందని వారు వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on June 8, 2024 5:33 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…