ఎవరైనా బోలెడు పిండి వంటలు, నోరూరించే పదార్థాలతో పెద్ద పళ్లెంలో మంచి ఆకలి మీదున్నప్పుడు వడ్డించారనుకోండి. ఎలా ఫీలవుతాం. ఆవురావురమంటూ తినేస్తాం. తర్వాత భుక్తాయాసంతో ఆమ్మో అయ్యో అంటూ ఈనో లేదా సోడానో తాగేందుకు పరిగెడతాం.
పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రోజుకో ఎలివేషన్ వీడియో, ఫోటోలతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నావదినతో పాటు తల్లి ఆశీర్వాదం తీసుకున్న క్లిప్స్ తో సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోయింది.
ఇది ఇంకా కళ్ళముందు ఉండగానే ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, కీలక నేతల ముందు పవన్ కళ్యాణ్ ని తుఫానుగా వర్ణించిన వీడియో ఓ రేంజ్ లో పేలింది.
ఒకప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన రోజు నుంచి ఏకంగా పార్లమెంట్ లో మోడీకి మద్దతు తెలిపే స్థాయికి చేరుకోవడం చూసిన ఫ్యాన్స్ కి అంతకన్నా సంబరం ఇంకేముంటుంది. గతంలో నోరు పారేసుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు క్షమాపణ కోరుతున్న వైనం మాములు వైరల్ కాలేదు. ఇలాంటివి క్రమం తప్పకుండ వస్తున్నాయి.
ఇదంతా చూస్తూ పవన్ ఫ్యాన్స్ వేరే పనులు చేసుకోలేక వీటినే చూసుకుంటూ ఉన్నామంటూ వాపోతున్నారు. జనసేన గెలుపుకన్నా ముందు గత ఎన్నికల ఓటమి గురించి గెలిచేస్తున్న వాళ్లకు సమాధానం చెప్పే స్టేజి నుంచి ఇప్పుడు ఇది మా పవన్ రేంజ్ అంటూ సజీవ సాక్ష్యాలతో బదులు ఇచ్చే రేంజుకి రావడం చూసి వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు.
ఇంకా ప్రమాణస్వీకారం, పొలిటికల్ మీటింగులు, గెస్టుగా ఈవెంట్లకు వెళ్లడం,వీరమల్లు షూటింగ్ విశేషాలు అబ్బో రాబోయే రోజులు నిజంగానే అప్డేట్లతోనే ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమే. ఇదంతా కెజిఎఫ్ రేంజ్ ఎలివేషనని జనాలు అనుకోవడంలో తప్పేమీ లేదు.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…