తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి పార్టీల సమావేశంలో తదుపరి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను అందరూ ఏకగ్రీవంగా అంగీకరించా రు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. మాట్లాడారు. ఆయన పార్టీకి.. ఏపీలో రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. రెండు చోట్ల పోటీ చేసి రెండు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్కు కూడా.. ఎన్డీయేలో కీలక పాత్ర లభించింది.
ఇక, పవన్ మాట్లాడుతూ.. 2014లోనే చంద్రబాబు తనకు ఓ మాట చెప్పారని.. వచ్చే 15 సంవత్సరాలు.. ఈ దేశానికి ప్రదానిగా మోడీనే ఉంటారని అన్నారని తెలిపారు. అంతేకాదు.. మోడీ విజన్తో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ విషయా న్ని కూడా చంద్రబాబు అప్పట్లోనే అంచనా వేశారని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఎన్డీయే మిత్ర పక్షా లు హర్షం వ్యక్తం చేస్తూ.. బల్లలు చరుస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తీకరించాయి.
ఈ సమయంలో చంద్రబాబు.. మోడీలు సంతోషంలో మునిగిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు అన్న మాటలను పవన్ గుర్తు చేసిన సమయంలో చంద్రబాబు కూడా.. మోడీ చెవిలో.. ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో మోడీ మరింత మురిసిపోయారు. చంద్రబాబు చేతిలో చేయి వేసి..మరీ అభినందన పూర్వకంగా నవ్వులుకురిపించారు. మీడియాలో వీరి ఆనంద క్షణాలను ప్రముఖంగా ప్రసారం చేయడం గమనార్హం.
This post was last modified on June 7, 2024 3:26 pm
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. డెకాయిట్ సినిమా సక్సెస్ మీట్లో ఈ చిత్ర కథానాయిక మృణాల్ ఠాకూర్ను ఉద్దేశించిన…
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…