Political News

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు

గత ఐదేళ్లలో తెలుగుదేశం అభిమానులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో వాళ్లు దుర్భర పరిస్థితులను అనుభవించారు. తెలుగుదేశం అత్యంత దారుణమైన పరాభవం చవిచూసింది ఆ ఎన్నికల్లో. ఆ స్థితి నుంచి టీడీపీ మళ్లీ పుంజుకోగలదా అన్న సందేహాలు నెలకొన్నాయి.

మరోవైపు తెలంగాణలో వరుసగా రెండో పర్యాయం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం ఉనికే లేకుండా పోయింది. ఇంకోవైపు కేంద్రంలో మోడీ సర్కారు మరింత బలోపేతమై.. టీడీపీని ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీకి ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇలా టీడీపీకి ఏ రకంగానూ ఆశాజనకమైన పరిస్థితులు కనిపించలేదు. కానీ ఐదేళ్లు గడిచేసరికి మొత్తం కథ మారిపోయింది. ఈ మూడు చోట్లా టీడీపీ వాళ్లు ఎంతో సంతోషించే ఫలితాలు వచ్చాయి.

ముందుగా గత ఏడాది చివర్లో తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. పైగా టీడీపీ వాళ్లు ఎంతో అభిమానించే మాజీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అది కాంగ్రెస్ వాళ్లకంటే టీడీపీ మద్దతుదారులకే ఎక్కువ ఆనందాన్నిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఇక లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి చరిత్రాత్మక విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తిని 240 సీట్లకు పరిమితమైంది. ఎన్డీయే మిత్ర పక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన స్థితికి వచ్చింది. టీడీపీ మద్దతు ఇప్పుడు ఎంతో కీలకం. దీని వల్ల వచ్చే ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఇలా మూడు చోట్ల టీడీపీ వాళ్లు సంతోషించే ఫలితాలు వచ్చాయి. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్లు తయారైంది పరిస్థితి.

This post was last modified on June 7, 2024 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago