ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. మరో నాలుగు రోజుల్లో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. గత జగన్ పాలనలో జరిగిన అవినీతి.. తీసుకున్న నిర్ణయాలపై.. కూటమి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే.. యాక్షన్ ప్రారంభ మైంది. ఈ క్రమంలో ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ప్రధానంగా లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఈ క్రమంలో జగన్ హయాంలో ఏపీ బేవరేజస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదా లు ప్రారంభమయ్యాయి. జగన్ పాలనా కాలంలో మద్యం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎక్క డా లేనివిధంగా చీపు లిక్కర్ ను ఇక్కడ విక్రయించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం కంటికి కనిపించకుండా చేశారు. దీనికితోడు రూ.60 ఉన్న మద్యం బాటిల్ను రూ.200లకు అమ్మారు. దీనివెనుక పెద్ద ఎత్తున ఏదో మాఫియా ఉందనే చర్చ అప్పట్లోనే జరిగింది.
పలు మార్లు చంద్రబాబు కూడా.. లిక్కర్ కుంభకోణంపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే.. లిక్కర్ మాఫియా అంతు చూస్తామని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలోనే తొలి అడుగు ఇప్పుడు పడినట్టు కనిపిస్తోంది. జగన్ హయాంలో ఏపీ బేవరేజస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నట్టు సమాచారం.
జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని వాసుదేవ రెడ్డిపై ఆరోపణలు ఉ న్నాయి. అధికార వైసీపీకి, ముఖ్యంగా జగన్కు కూడా.. ఆయన కరడుగట్టిన మద్దతుదారుగా వ్యవహరించా రని టీడీపీ నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే. మద్యం రాబడి.. పాలసీ సహా అన్ని విషయా లు ఈయన కనుసన్నల్లోనే జరిగాయని అంటారు. అందుకే.. ముందుగా ఈయనను విచారిస్తున్నట్టు సమా చారం. అనంతరం.. అసలు వ్యక్తులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.
This post was last modified on June 7, 2024 1:34 pm
సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…