Political News

అమరావతి 2.0.. మొదలైంది

“అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.. నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా” అంటూ ఘనమైన ప్రకటనలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. 2019 ఎన్నికల తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించి మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతికి ఎలా మరణ శాసనం రాశారో తెలిసిందే. ఐతే అమరావతిని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నం.. చివరికి వైసీపీ పతనానికి దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. రాజధాని చుట్టు పక్కల ఎక్కడా వైసీపీ ఖాతా తెరవలేదు. భారీ తేడాతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు.

అమరావతి విషయంలో జగన్ ఆడిన గేమ్ తమ పార్టీని దారుణంగా దెబ్బ కొట్టిందని ఇప్పుడు వైసీపీ నేతలు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పోగానే ఇక అమరావతికి పునరుజ్జీవం వచ్చినట్లే అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది.

కాగా చంద్రబాబు సారథ్యంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే అమరావతిలో యాక్టివిటీ మొదలైపోయింది. ఐదేళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిన సీఆర్డీఏ.. హడావుడిగా పనులు మొదలుపెట్టేసింది. ఒకప్పుడు రాజధానికి శంకు స్థాపన జరిగిన ప్రాంతం జగన్ హయాంలో శ్మశానాన్ని తలపించగా.. ఇప్పుడక్కడ చెట్లు కొట్టించి శుద్ధి చేసి అందంగా తయారు చేస్తున్నారు. ఆ ప్రాంత రోడ్లను కూడా బాగు చేస్తున్నారు. చంద్రబాబు ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోయేది అమరావతి నుంచే అన్న సంగతి తెలిసిందే. ఆ లోపే రాజధాని ప్రాంతాన్ని వీలైనంత అందంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అధికారంలోకి వచ్చాక బాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించే ప్రాజెక్టుల్లో రాజధాని ఒకటనడంలో సందేహం లేదు. గతంలో కంటే వేగంగా ఇక్కడ పనులు చేయించి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరగొచ్చు.

This post was last modified on June 7, 2024 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

46 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago