“అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.. నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా” అంటూ ఘనమైన ప్రకటనలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. 2019 ఎన్నికల తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించి మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతికి ఎలా మరణ శాసనం రాశారో తెలిసిందే. ఐతే అమరావతిని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నం.. చివరికి వైసీపీ పతనానికి దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. రాజధాని చుట్టు పక్కల ఎక్కడా వైసీపీ ఖాతా తెరవలేదు. భారీ తేడాతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు.
అమరావతి విషయంలో జగన్ ఆడిన గేమ్ తమ పార్టీని దారుణంగా దెబ్బ కొట్టిందని ఇప్పుడు వైసీపీ నేతలు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పోగానే ఇక అమరావతికి పునరుజ్జీవం వచ్చినట్లే అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది.
కాగా చంద్రబాబు సారథ్యంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే అమరావతిలో యాక్టివిటీ మొదలైపోయింది. ఐదేళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిన సీఆర్డీఏ.. హడావుడిగా పనులు మొదలుపెట్టేసింది. ఒకప్పుడు రాజధానికి శంకు స్థాపన జరిగిన ప్రాంతం జగన్ హయాంలో శ్మశానాన్ని తలపించగా.. ఇప్పుడక్కడ చెట్లు కొట్టించి శుద్ధి చేసి అందంగా తయారు చేస్తున్నారు. ఆ ప్రాంత రోడ్లను కూడా బాగు చేస్తున్నారు. చంద్రబాబు ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోయేది అమరావతి నుంచే అన్న సంగతి తెలిసిందే. ఆ లోపే రాజధాని ప్రాంతాన్ని వీలైనంత అందంగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అధికారంలోకి వచ్చాక బాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించే ప్రాజెక్టుల్లో రాజధాని ఒకటనడంలో సందేహం లేదు. గతంలో కంటే వేగంగా ఇక్కడ పనులు చేయించి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరగొచ్చు.
This post was last modified on June 7, 2024 12:45 pm
``ప్రధాని నరేంద్ర మోడీని వాడుకోవడం అంటే.. చంద్రబాబు తర్వాతే.. అనేలా వ్యవహరించారు`` అనేకామెంట్లు వినిపిస్తున్నాయి. చెలిమి చేయడం.. చేతులు దులుపుకోవడం…
కొందరు దర్శకులకు తాము తీసింది ఫ్లాపని ఒప్పుకోవాలంటే మహా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తాము తీసింది…
ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం…
బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ విషయంలో ఏదైనా కొంత అసంతృప్తి కలిగించిన…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని…
గత ఏడాది డిసెంబర్లో ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప 2 తెలుగులో కంటే హిందీలోనే భారీ వసూళ్లు…