“అప్పలనాయుడూ ఫ్లైట్ టికెట్ ఉందా ? తీసుకున్నావా ? లేదా ? లేదంటే మన వాళ్లు బుక్ చేస్తారు” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు అడగడంతో ఒక్కసారిగా అప్పలనాయుడు భావోద్వేగానికి గురికావడం జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్వయంగా హాజరుకాగా దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
“అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి అప్పలనాయుడు గెలిచాడు. ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టిక్కెట్లు వస్తాయి అనడానికి అప్పలనాయుడు ఒక ఉదాహరణ అని, ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని” చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించవద్దని, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్లో కృషి చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు.
This post was last modified on June 7, 2024 12:32 pm
విశ్వంభర.. మెగాస్టార్ చిరంజీవి కెరర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన…
వచ్చే వారం రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ సందడి చాలా జోరుగా ఉండబోతోంది. కొత్త…
‘బాహుబలి’ తర్వాత ‘పాన్ ఇండియా’ పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో నిజంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను…
ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక త్వరలోనే…
ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న చిన్న విషయాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. మీడియాతో మాట్లాడేటపుడు మూవీ…
కావ్య థాపర్.. ‘ఏక్ మిని కథ’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ. నేరుగా ఓటీటీలో…