‘బీజేపీ గాలి ఉందని మీరు చెబుతున్నారు. ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని ప్రకటించిన మాజీ ఐఎఎస్ అధికారి వీకె పాండియన్ ఎక్కడ ? అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంై ఒడిశాలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది.
తమిళనాడుకు చెందిన పాండియన్ 2019 ఎన్నికల నుండి ముఖ్యమంత్రి నవీన్ కు నమ్మకమైన అధికారిగా మెలిగాడు. ప్రభుత్వ నిర్ణయాలలో కీలకపాత్ర పోషించిన ఆయన సూపర్ సీఎం అని పేరుపడ్డాడు. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి బీజేడీలో చేరాడు. ఈ ఎన్నికల్లో తమిళ వ్యక్తి ఒడిశాలో పెత్తనం ఏంటని ప్రధానంగా బీజేపీ ప్రచారం కూడా చేసింది.
మరోసారి ముఖ్యమంత్రి అయి నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టిస్తారు అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 21 లోక్ సభ స్థానాలలో బీజేడీకి ఒక్కటి కూడా దక్కలేదు. 20 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 147 శాసనసభ స్థానాలలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఎం 1, స్వతంత్రులు 3 స్థానాలలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాండియన్ అదృశ్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? అన్న వాదన వినిపిస్తుంది.
This post was last modified on June 7, 2024 12:19 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…