‘బీజేపీ గాలి ఉందని మీరు చెబుతున్నారు. ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని ప్రకటించిన మాజీ ఐఎఎస్ అధికారి వీకె పాండియన్ ఎక్కడ ? అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంై ఒడిశాలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది.
తమిళనాడుకు చెందిన పాండియన్ 2019 ఎన్నికల నుండి ముఖ్యమంత్రి నవీన్ కు నమ్మకమైన అధికారిగా మెలిగాడు. ప్రభుత్వ నిర్ణయాలలో కీలకపాత్ర పోషించిన ఆయన సూపర్ సీఎం అని పేరుపడ్డాడు. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి బీజేడీలో చేరాడు. ఈ ఎన్నికల్లో తమిళ వ్యక్తి ఒడిశాలో పెత్తనం ఏంటని ప్రధానంగా బీజేపీ ప్రచారం కూడా చేసింది.
మరోసారి ముఖ్యమంత్రి అయి నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టిస్తారు అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 21 లోక్ సభ స్థానాలలో బీజేడీకి ఒక్కటి కూడా దక్కలేదు. 20 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 147 శాసనసభ స్థానాలలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఎం 1, స్వతంత్రులు 3 స్థానాలలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాండియన్ అదృశ్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? అన్న వాదన వినిపిస్తుంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…