‘బీజేపీ గాలి ఉందని మీరు చెబుతున్నారు. ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని ప్రకటించిన మాజీ ఐఎఎస్ అధికారి వీకె పాండియన్ ఎక్కడ ? అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంై ఒడిశాలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది.
తమిళనాడుకు చెందిన పాండియన్ 2019 ఎన్నికల నుండి ముఖ్యమంత్రి నవీన్ కు నమ్మకమైన అధికారిగా మెలిగాడు. ప్రభుత్వ నిర్ణయాలలో కీలకపాత్ర పోషించిన ఆయన సూపర్ సీఎం అని పేరుపడ్డాడు. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి బీజేడీలో చేరాడు. ఈ ఎన్నికల్లో తమిళ వ్యక్తి ఒడిశాలో పెత్తనం ఏంటని ప్రధానంగా బీజేపీ ప్రచారం కూడా చేసింది.
మరోసారి ముఖ్యమంత్రి అయి నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టిస్తారు అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 21 లోక్ సభ స్థానాలలో బీజేడీకి ఒక్కటి కూడా దక్కలేదు. 20 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 147 శాసనసభ స్థానాలలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఎం 1, స్వతంత్రులు 3 స్థానాలలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాండియన్ అదృశ్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? అన్న వాదన వినిపిస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…