Political News

ఒడిశా : పాండియన్ ఎక్కడ ?

‘బీజేపీ గాలి ఉందని మీరు చెబుతున్నారు. ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని ప్రకటించిన మాజీ ఐఎఎస్ అధికారి వీకె పాండియన్ ఎక్కడ ? అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంై ఒడిశాలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది.

తమిళనాడుకు చెందిన పాండియన్ 2019 ఎన్నికల నుండి ముఖ్యమంత్రి నవీన్ కు నమ్మకమైన అధికారిగా మెలిగాడు. ప్రభుత్వ నిర్ణయాలలో కీలకపాత్ర పోషించిన ఆయన సూపర్ సీఎం అని పేరుపడ్డాడు. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి బీజేడీలో చేరాడు. ఈ ఎన్నికల్లో తమిళ వ్యక్తి ఒడిశాలో పెత్తనం ఏంటని ప్రధానంగా బీజేపీ ప్రచారం కూడా చేసింది.

మరోసారి ముఖ్యమంత్రి అయి నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టిస్తారు అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 21 లోక్ సభ స్థానాలలో బీజేడీకి ఒక్కటి కూడా దక్కలేదు. 20 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 147 శాసనసభ స్థానాలలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఎం 1, స్వతంత్రులు 3 స్థానాలలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాండియన్ అదృశ్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? అన్న వాదన వినిపిస్తుంది.

This post was last modified on June 7, 2024 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago