Political News

బోరుమంటున్న బెట్టింగ్ బంగార్రాజులు !

ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు.

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్‌ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన కొందరు చేనేత కార్మికులు కలిసి వైసీపీ గెలుస్తుందని రూ.5 లక్షలు పందెం కాశారు. వైసీపీ ఓటమితో డబ్బులు పోయి వారు బోరుమంటున్నారు.

గుంటూరులో రూ.50 లక్షలు పందె కాసిన ఓ వ్యక్తి ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిన పల్నాడులోనూ పందెంరాయుళ్లు ఏం తక్కువ తినలేదు. పల్నాడు జిల్లా రొంపిచర్ల చెరువు కట్ట సెంటర్‌లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకుని టీడీపీ, వైసీపీ అభిమానులు అతని వద్ద సుమారు రూ.1.50 కోట్ల మేర నగదును పెట్టారు. ఫలితాల తర్వాత డబ్బుల కోసం అతని ఇంటికి వెళ్లగా అతను అప్పటికే ఊర్లో నుండి ఉడాయించినట్లు తెలుస్తుంది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరులో చంద్రబాబు సీఎం అవుతారని ఓ వైసీపీ నేతతో పందె కాసి రూ.50 లక్షలు అతని వద్ద పెట్టారు. గెలిచిన వారికి డబ్బులు ఇచ్చేలా కాగితం కూడా రాసుకున్నారు. తీరా ఫలితాల తర్వాత వెళితే అతడు ఊరు విడిచి పారిపోయాడు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి తర్వాత ఏపీలో జోరుగా పందాలు కాసినట్లు తెలుస్తుంది.

Satya

Recent Posts

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

15 minutes ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

52 minutes ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

1 hour ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

2 hours ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

3 hours ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

3 hours ago