ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్నగర్కు చెందిన బిక్కిన సురేశ్ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన కొందరు చేనేత కార్మికులు కలిసి వైసీపీ గెలుస్తుందని రూ.5 లక్షలు పందెం కాశారు. వైసీపీ ఓటమితో డబ్బులు పోయి వారు బోరుమంటున్నారు.
గుంటూరులో రూ.50 లక్షలు పందె కాసిన ఓ వ్యక్తి ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిన పల్నాడులోనూ పందెంరాయుళ్లు ఏం తక్కువ తినలేదు. పల్నాడు జిల్లా రొంపిచర్ల చెరువు కట్ట సెంటర్లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకుని టీడీపీ, వైసీపీ అభిమానులు అతని వద్ద సుమారు రూ.1.50 కోట్ల మేర నగదును పెట్టారు. ఫలితాల తర్వాత డబ్బుల కోసం అతని ఇంటికి వెళ్లగా అతను అప్పటికే ఊర్లో నుండి ఉడాయించినట్లు తెలుస్తుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరులో చంద్రబాబు సీఎం అవుతారని ఓ వైసీపీ నేతతో పందె కాసి రూ.50 లక్షలు అతని వద్ద పెట్టారు. గెలిచిన వారికి డబ్బులు ఇచ్చేలా కాగితం కూడా రాసుకున్నారు. తీరా ఫలితాల తర్వాత వెళితే అతడు ఊరు విడిచి పారిపోయాడు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి తర్వాత ఏపీలో జోరుగా పందాలు కాసినట్లు తెలుస్తుంది.
This post was last modified on June 6, 2024 10:23 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…