ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్నగర్కు చెందిన బిక్కిన సురేశ్ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన కొందరు చేనేత కార్మికులు కలిసి వైసీపీ గెలుస్తుందని రూ.5 లక్షలు పందెం కాశారు. వైసీపీ ఓటమితో డబ్బులు పోయి వారు బోరుమంటున్నారు.
గుంటూరులో రూ.50 లక్షలు పందె కాసిన ఓ వ్యక్తి ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిన పల్నాడులోనూ పందెంరాయుళ్లు ఏం తక్కువ తినలేదు. పల్నాడు జిల్లా రొంపిచర్ల చెరువు కట్ట సెంటర్లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకుని టీడీపీ, వైసీపీ అభిమానులు అతని వద్ద సుమారు రూ.1.50 కోట్ల మేర నగదును పెట్టారు. ఫలితాల తర్వాత డబ్బుల కోసం అతని ఇంటికి వెళ్లగా అతను అప్పటికే ఊర్లో నుండి ఉడాయించినట్లు తెలుస్తుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరులో చంద్రబాబు సీఎం అవుతారని ఓ వైసీపీ నేతతో పందె కాసి రూ.50 లక్షలు అతని వద్ద పెట్టారు. గెలిచిన వారికి డబ్బులు ఇచ్చేలా కాగితం కూడా రాసుకున్నారు. తీరా ఫలితాల తర్వాత వెళితే అతడు ఊరు విడిచి పారిపోయాడు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి తర్వాత ఏపీలో జోరుగా పందాలు కాసినట్లు తెలుస్తుంది.
This post was last modified on June 6, 2024 10:23 am
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…